లగచర్ల ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడు సురేశ్తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు మాట్లాడినట్లు ఫోన్ రికార్డింగ్స్లో కనిపించిందని, అంతేకాకుండా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ ఘటన వెనుక ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.
లగచర్ల ఘటనపై స్పందించిన కోమటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దాడులకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించారు. ఎస్సీల భూముల విషయంలో గతంలో జరిగిన భూ సేకరణలు సమస్య లేకుండా జరిగినప్పటికీ, ఇప్పుడు అటువంటి ఘటనలు జరగడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ సహా పలు ప్రాజెక్టులకు భూసేకరణ సమయంలో ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోకుండా ప్రజా ప్రయోజనాలు పాటించామని అన్నారు.
మున్సిపల్ మంత్రి ఆదేశాల మేరకు లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి తెలిపారు. కలెక్టర్ మీద జరిగిన దాడి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని, చట్టం ముందు నేరస్థులు తప్పించుకోలేరని చెప్పారు. కాల్ రికార్డులు, వాట్సాప్ సందేశాలను కూపీ లాగి మరింత విచారణ జరిపే ఉద్దేశం ఉన్నట్లు వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారన్న విషయం స్పష్టమని, రైతులు పరిశ్రమ ఏర్పాటు వద్దని నిర్ణయిస్తే, ప్రభుత్వం వారి అభిప్రాయాన్ని గౌరవిస్తుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
This post was last modified on November 13, 2024 6:13 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…