లగచర్ల ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడు సురేశ్తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు మాట్లాడినట్లు ఫోన్ రికార్డింగ్స్లో కనిపించిందని, అంతేకాకుండా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ ఘటన వెనుక ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.
లగచర్ల ఘటనపై స్పందించిన కోమటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దాడులకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించారు. ఎస్సీల భూముల విషయంలో గతంలో జరిగిన భూ సేకరణలు సమస్య లేకుండా జరిగినప్పటికీ, ఇప్పుడు అటువంటి ఘటనలు జరగడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ సహా పలు ప్రాజెక్టులకు భూసేకరణ సమయంలో ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోకుండా ప్రజా ప్రయోజనాలు పాటించామని అన్నారు.
మున్సిపల్ మంత్రి ఆదేశాల మేరకు లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి తెలిపారు. కలెక్టర్ మీద జరిగిన దాడి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని, చట్టం ముందు నేరస్థులు తప్పించుకోలేరని చెప్పారు. కాల్ రికార్డులు, వాట్సాప్ సందేశాలను కూపీ లాగి మరింత విచారణ జరిపే ఉద్దేశం ఉన్నట్లు వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారన్న విషయం స్పష్టమని, రైతులు పరిశ్రమ ఏర్పాటు వద్దని నిర్ణయిస్తే, ప్రభుత్వం వారి అభిప్రాయాన్ని గౌరవిస్తుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
This post was last modified on November 13, 2024 6:13 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…