Political News

లగచర్ల ఘటనలో కేటీఆర్ రహస్య సంభాషణలు?

లగచర్ల ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడు సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు మాట్లాడినట్లు ఫోన్ రికార్డింగ్స్‌లో కనిపించిందని, అంతేకాకుండా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కూడా మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ ఘటన వెనుక ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

లగచర్ల ఘటనపై స్పందించిన కోమటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దాడులకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించారు. ఎస్సీల భూముల విషయంలో గతంలో జరిగిన భూ సేకరణలు సమస్య లేకుండా జరిగినప్పటికీ, ఇప్పుడు అటువంటి ఘటనలు జరగడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ సహా పలు ప్రాజెక్టులకు భూసేకరణ సమయంలో ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోకుండా ప్రజా ప్రయోజనాలు పాటించామని అన్నారు.

మున్సిపల్ మంత్రి ఆదేశాల మేరకు లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి తెలిపారు. కలెక్టర్ మీద జరిగిన దాడి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని, చట్టం ముందు నేరస్థులు తప్పించుకోలేరని చెప్పారు. కాల్ రికార్డులు, వాట్సాప్ సందేశాలను కూపీ లాగి మరింత విచారణ జరిపే ఉద్దేశం ఉన్నట్లు వెల్లడించారు.

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారన్న విషయం స్పష్టమని, రైతులు పరిశ్రమ ఏర్పాటు వద్దని నిర్ణయిస్తే, ప్రభుత్వం వారి అభిప్రాయాన్ని గౌరవిస్తుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

This post was last modified on November 13, 2024 6:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

38 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago