Political News

విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైసీపీ జెండా పీకేశారు..!

విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైసీపీ జెండా దించేశారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కార్పొరేష‌న్ వెలుప‌ల ప్ర‌హ‌రీ ని ఆనుకుని ఉన్న జెండా దిమ్మెపై వైసీపీ ఎన్నిక‌ల జెండాను ఎగుర‌వేశారు. అయితే.. సోమ‌వారం మాత్రం జెండాను తీసేశారు. దీంతో ఏం జ‌రిగింద‌న్న చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌ను గ‌త 2021లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకుంది. జ‌న‌ర‌ల్‌కు కేటాయించి మేయ‌ర్ ప‌ద‌విని కూడా బీసీ సామాజిక వ‌ర్గానికి కేటాయించి మ‌రీ ప్రాధాన్యం ఇచ్చారు.

దీంతో కొన్నాళ్లు బాగానే సాగింది. అయితే. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మెజారిటీ వైసీపీ కార్పొరేట‌ర్లు.. వైసీపీకి దూర‌మ‌య్యారు. తాజాగా 32 మంది కార్పొరేట‌ర్లు జెండా మార్చేశారు. కొంద‌రు టీడీపీలో చేర‌గా.. 19 మంది జ‌నసేన బాట ప‌ట్టారు. దీంతో సంఖ్యా ప‌రంగా వైసీపీకి సీట్లు త‌గ్గాయి. మ‌రోవైపు మేయ‌ర్ కూడా.. జ‌నసేన వైపు చూస్తున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఈ ప‌రిణామాలతోనే కౌన్సిల్ స‌మావేశాలు కూడా జ‌ర‌గ‌డం లేదు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఉన్న కార్పొరేట‌ర్ల‌ను కూడా.. టీడీపీలో చేర్పించేలా కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే త‌న ప‌రిధిలోని కార్పొరేట‌ర్ల‌ను టీడీపీలోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది స‌క్సెస్ అయితే.. పూర్తిగా వైసీపీ కార్పొరేట‌ర్లు పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి కూడా.. కొంద‌రిని బీజేపీలోకి చేర్పించ‌డం ద్వారా.. త‌న హ‌వా పెంచుకునే ఉద్దేశంలో ఉన్నారు.

అయితే.. బీజేపీలోకి కార్పొరేట‌ర్లు వెళ్ల‌కుండా టీడీపీ నాయ‌కులు అడ్డు ప‌డుతున్నారు. ఇదే జ‌రిగితే.. అది సుజ‌నాకు మ‌రింత ద‌న్నుగా మారుతుంద‌నివారు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీలో చేరేవారికి డిమాండ్ పెరుగుతోంది. వార్డు ప‌రిధిలో నిధులు, వ్య‌క్తిగ‌త స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం.. కార్పొరేట‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వైసీపీ పోవ‌డం అయితే ఖాయం అయిపోయింది.అ యితే.. ఇంత జ‌రుగుతున్నా స్థానిక మాజీ మంత్రి వైసీపీ నాయ‌కుడు వెల్లంప‌ల్లి శ్రీనివాస్ మాత్రం సైలెంట్ అయిపోయారు.

This post was last modified on November 12, 2024 11:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

4 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

6 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago