విజన్ 2047 లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడంతో పాటు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఏపీకి టాటా వంటి దిగ్గజ సంస్థలను తీసుకురావడంతో పాటు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విజన్ 2047 సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు కోరారు.
ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన వర్క్ షాప్ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాలపై, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. అంతేకాదు, ప్రభుత్వం తెస్తున్న బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకోవాలని, తెలుసుకోవాలని చెప్పారు. సభలో ప్రతిపక్షం లేదని, అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తెలిపారు.
ఇక, శాసన సభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు, తాజా రాజకీయా పరిణామాలపై కూడా కూటమి నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. బీఏసీ మీటింగ్ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, విప్ ల ప్రస్తావన రావడంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి ఎవరిని ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమిస్తారు? ఎంతమంది విప్ లు ఉంటారు అన్నదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…