విజన్ 2047 లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడంతో పాటు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఏపీకి టాటా వంటి దిగ్గజ సంస్థలను తీసుకురావడంతో పాటు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విజన్ 2047 సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు కోరారు.
ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన వర్క్ షాప్ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాలపై, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. అంతేకాదు, ప్రభుత్వం తెస్తున్న బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకోవాలని, తెలుసుకోవాలని చెప్పారు. సభలో ప్రతిపక్షం లేదని, అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తెలిపారు.
ఇక, శాసన సభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు, తాజా రాజకీయా పరిణామాలపై కూడా కూటమి నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. బీఏసీ మీటింగ్ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, విప్ ల ప్రస్తావన రావడంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి ఎవరిని ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమిస్తారు? ఎంతమంది విప్ లు ఉంటారు అన్నదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది.
This post was last modified on November 12, 2024 6:48 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…