Political News

‘నా పై ఎవరూ దాడి చెయ్యలేదు’

తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లాలో సోమ‌వారం ఫార్మా సిటీ నిర్మాణానికి సంబంధించిన భూముల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్‌ పై మ‌హిళ ఒక‌రు చేయి చేసుకున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ దాడిలో క‌లెక్ట‌ర్ ప‌క్క‌నే ఉన్న నీటి మ‌డుగులో కూడా ప‌డిపోయారు. ఇది పెను విధ్వంసానికి దారి తీసింది. 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా మంది పై రౌడీ షీట్లు తెరిచేందుకు రెడీ అయ్యారు. ఇక‌, పెరిచ‌ర్ల గ్రామంలో 114 సెక్ష‌న్ కూడా అమ‌లు చేస్తున్నారు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ ఇక్క‌డ అమ‌లు జ‌రుగుతోంది. అయితే.. ఇప్పుడు అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. “నాపై ఎవరూ దాడి చెయ్యలేదు” అని కలెక్టర్ ప్రతీక్ జైన్ తాజాగా యూట‌ర్న్ తీసుకున్నారు.

అంతేకాదు.. ఇక్క‌డి రైతులు అంద‌రూ మ‌న వారే అంటూ ఆయ‌న కామెంటు చేయ‌డం గ‌మ‌నార్హం. క‌లెక్ట‌ర్‌పై దాడి చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ.. పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను ఆయ‌న బుజ్జ‌గించారు.

తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన క‌లెక్ట‌ర్‌.. మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడించారు. అయితే.. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపారు. అంతా మన రైతులు అని, మావాళ్లు మనపై దాడి చేయరని కలెక్టర్ వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని..ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించారు. అయితే.. క‌లెక్ట‌ర్ చెప్పింది నిజ‌మైతే.. ఆయ‌న కింద ఎందుకు ప‌డిపోయారు..? త‌ర్వాత ర‌ణ‌రంగంగా ఎందుకు మారింద‌నేది ప్ర‌శ్న‌.

ఇదిలావుంటే.. రేవంత్‌రెడ్డి స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఫార్మా సిటీ ఏర్పాటు విష‌యంలో త‌లెత్తిన ఈ వివాదం సిటీ ఏర్పాటుపైనే నీలినీడ‌లు ముసురుకునేలా చేస్తుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

దీంతో ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కే క‌లెక్ట‌ర్ యూర‌ట్న్ తీసుకున్నార‌నేది రాజ‌కీయ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. స్థానికుల‌ను బుజ్జ‌గించి.. వారినుంచి భూములు తీసుకునేందుకు స‌ర్కారు చేస్తున్న ప్ర‌య‌త్నంలో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 12, 2024 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

16 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

43 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

1 hour ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago