Political News

‘నా పై ఎవరూ దాడి చెయ్యలేదు’

తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లాలో సోమ‌వారం ఫార్మా సిటీ నిర్మాణానికి సంబంధించిన భూముల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్‌ పై మ‌హిళ ఒక‌రు చేయి చేసుకున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ దాడిలో క‌లెక్ట‌ర్ ప‌క్క‌నే ఉన్న నీటి మ‌డుగులో కూడా ప‌డిపోయారు. ఇది పెను విధ్వంసానికి దారి తీసింది. 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా మంది పై రౌడీ షీట్లు తెరిచేందుకు రెడీ అయ్యారు. ఇక‌, పెరిచ‌ర్ల గ్రామంలో 114 సెక్ష‌న్ కూడా అమ‌లు చేస్తున్నారు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ ఇక్క‌డ అమ‌లు జ‌రుగుతోంది. అయితే.. ఇప్పుడు అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. “నాపై ఎవరూ దాడి చెయ్యలేదు” అని కలెక్టర్ ప్రతీక్ జైన్ తాజాగా యూట‌ర్న్ తీసుకున్నారు.

అంతేకాదు.. ఇక్క‌డి రైతులు అంద‌రూ మ‌న వారే అంటూ ఆయ‌న కామెంటు చేయ‌డం గ‌మ‌నార్హం. క‌లెక్ట‌ర్‌పై దాడి చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ.. పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను ఆయ‌న బుజ్జ‌గించారు.

తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన క‌లెక్ట‌ర్‌.. మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడించారు. అయితే.. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపారు. అంతా మన రైతులు అని, మావాళ్లు మనపై దాడి చేయరని కలెక్టర్ వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని..ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించారు. అయితే.. క‌లెక్ట‌ర్ చెప్పింది నిజ‌మైతే.. ఆయ‌న కింద ఎందుకు ప‌డిపోయారు..? త‌ర్వాత ర‌ణ‌రంగంగా ఎందుకు మారింద‌నేది ప్ర‌శ్న‌.

ఇదిలావుంటే.. రేవంత్‌రెడ్డి స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఫార్మా సిటీ ఏర్పాటు విష‌యంలో త‌లెత్తిన ఈ వివాదం సిటీ ఏర్పాటుపైనే నీలినీడ‌లు ముసురుకునేలా చేస్తుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

దీంతో ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కే క‌లెక్ట‌ర్ యూర‌ట్న్ తీసుకున్నార‌నేది రాజ‌కీయ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. స్థానికుల‌ను బుజ్జ‌గించి.. వారినుంచి భూములు తీసుకునేందుకు స‌ర్కారు చేస్తున్న ప్ర‌య‌త్నంలో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 12, 2024 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

25 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago