తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సోమవారం ఫార్మా సిటీ నిర్మాణానికి సంబంధించిన భూములను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పై మహిళ ఒకరు చేయి చేసుకున్న విషయం బయటకు వచ్చింది.
ఈ దాడిలో కలెక్టర్ పక్కనే ఉన్న నీటి మడుగులో కూడా పడిపోయారు. ఇది పెను విధ్వంసానికి దారి తీసింది. 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా మంది పై రౌడీ షీట్లు తెరిచేందుకు రెడీ అయ్యారు. ఇక, పెరిచర్ల గ్రామంలో 114 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే.. అప్రకటిత కర్ఫ్యూ ఇక్కడ అమలు జరుగుతోంది. అయితే.. ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. “నాపై ఎవరూ దాడి చెయ్యలేదు” అని కలెక్టర్ ప్రతీక్ జైన్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు.
అంతేకాదు.. ఇక్కడి రైతులు అందరూ మన వారే అంటూ ఆయన కామెంటు చేయడం గమనార్హం. కలెక్టర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను ఆయన బుజ్జగించారు.
తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన కలెక్టర్.. మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడించారు. అయితే.. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపారు. అంతా మన రైతులు అని, మావాళ్లు మనపై దాడి చేయరని కలెక్టర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని..ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించారు. అయితే.. కలెక్టర్ చెప్పింది నిజమైతే.. ఆయన కింద ఎందుకు పడిపోయారు..? తర్వాత రణరంగంగా ఎందుకు మారిందనేది ప్రశ్న.
ఇదిలావుంటే.. రేవంత్రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో తలెత్తిన ఈ వివాదం సిటీ ఏర్పాటుపైనే నీలినీడలు ముసురుకునేలా చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
దీంతో ప్రభుత్వ సూచనల మేరకే కలెక్టర్ యూరట్న్ తీసుకున్నారనేది రాజకీయ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. స్థానికులను బుజ్జగించి.. వారినుంచి భూములు తీసుకునేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
This post was last modified on November 12, 2024 5:26 pm
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…