తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సోమవారం ఫార్మా సిటీ నిర్మాణానికి సంబంధించిన భూములను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పై మహిళ ఒకరు చేయి చేసుకున్న విషయం బయటకు వచ్చింది.
ఈ దాడిలో కలెక్టర్ పక్కనే ఉన్న నీటి మడుగులో కూడా పడిపోయారు. ఇది పెను విధ్వంసానికి దారి తీసింది. 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా మంది పై రౌడీ షీట్లు తెరిచేందుకు రెడీ అయ్యారు. ఇక, పెరిచర్ల గ్రామంలో 114 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే.. అప్రకటిత కర్ఫ్యూ ఇక్కడ అమలు జరుగుతోంది. అయితే.. ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. “నాపై ఎవరూ దాడి చెయ్యలేదు” అని కలెక్టర్ ప్రతీక్ జైన్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు.
అంతేకాదు.. ఇక్కడి రైతులు అందరూ మన వారే అంటూ ఆయన కామెంటు చేయడం గమనార్హం. కలెక్టర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను ఆయన బుజ్జగించారు.
తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన కలెక్టర్.. మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడించారు. అయితే.. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపారు. అంతా మన రైతులు అని, మావాళ్లు మనపై దాడి చేయరని కలెక్టర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని..ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించారు. అయితే.. కలెక్టర్ చెప్పింది నిజమైతే.. ఆయన కింద ఎందుకు పడిపోయారు..? తర్వాత రణరంగంగా ఎందుకు మారిందనేది ప్రశ్న.
ఇదిలావుంటే.. రేవంత్రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో తలెత్తిన ఈ వివాదం సిటీ ఏర్పాటుపైనే నీలినీడలు ముసురుకునేలా చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
దీంతో ప్రభుత్వ సూచనల మేరకే కలెక్టర్ యూరట్న్ తీసుకున్నారనేది రాజకీయ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. స్థానికులను బుజ్జగించి.. వారినుంచి భూములు తీసుకునేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
This post was last modified on November 12, 2024 5:26 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…