ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు, ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య వారధిలా పనిచేసిన పవన్ కల్యాణ్ కూటమి ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు.
అంతేకాకుండా, ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతలను తీసుకురాగలిగారు. ఇటు, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ విజయ దుందుభి మోగించడం, ఏపీలో కూటమి తరపున గెలుపొందిన ఎంపీలు మోదీ సర్కార్ ఏర్పాటులో కీలకం కావడంతో పవన్ ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలోనే పవన్ ను ఆంధీ అనే ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు.
ఈ క్రమంలోనే ఈ తుఫానును మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజులు పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజెపి తరపున జానసేనా అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు.
తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీల్లో బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కు ఉన్న సినీ గ్లామర్ తో పాటు సనాతన ధర్మం కోసం పవన్ చేస్తున్న పోరాటం వంటి విషయాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ కీలకంగా మారబోతున్నారని తెలుస్తోంది.
This post was last modified on November 12, 2024 4:28 pm
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……