ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు, ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య వారధిలా పనిచేసిన పవన్ కల్యాణ్ కూటమి ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు.
అంతేకాకుండా, ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతలను తీసుకురాగలిగారు. ఇటు, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ విజయ దుందుభి మోగించడం, ఏపీలో కూటమి తరపున గెలుపొందిన ఎంపీలు మోదీ సర్కార్ ఏర్పాటులో కీలకం కావడంతో పవన్ ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలోనే పవన్ ను ఆంధీ అనే ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు.
ఈ క్రమంలోనే ఈ తుఫానును మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజులు పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజెపి తరపున జానసేనా అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు.
తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీల్లో బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కు ఉన్న సినీ గ్లామర్ తో పాటు సనాతన ధర్మం కోసం పవన్ చేస్తున్న పోరాటం వంటి విషయాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ కీలకంగా మారబోతున్నారని తెలుస్తోంది.
This post was last modified on November 12, 2024 4:28 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…