Political News

అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌.. అభివృద్ధి ప‌రుగులే!

ఏపీ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల అడ్డంకులు దాదాపు తొలిగిపోయాయి. అటు రుణం రూపంలో కొంత.. ఇటు బ‌డ్జెట్ కేటాయింపులు మ‌రికొంత‌.. బాండ్లు విక్ర‌యించ‌డం ద్వారా ఇంకొంత సొమ్మును స‌మీక‌రించుకునేందుకు స‌ర్కారు ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అన్నీ స‌మ‌కూ రేందుకు మార్గం రెడీ అయింది. అమ‌రావ‌తి పూర్తిస్థాయి నిర్మాణానికి ల‌క్ష కోట్ల వ‌ర‌కు కావాల్సి ఉంది. అయితే.. ఈ మొత్తాన్ని రెండు ద‌శ‌లుగా విభ‌వించారు.

తొలి ద‌శ‌లో 50 వేల కోట్ల‌ను, మ‌లిద‌శ‌(అంటే దాదాపు సగానికిపైగా నిర్మాణాలు పూర్త‌వుతాయి)లో మిగిలిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకుని రాజ‌ధానిని పూర్తి చేయాల‌న్న‌ది ప్ర‌స్తుత ప్ర‌ణాళిక‌. దీని ప్ర‌కార‌మే చంద్ర‌బాబు స‌ర్కారు ఆదిశ‌గా అడుగులు వేసింది. కేంద్ర బ‌డ్జెట్‌లో రూ.15000 కోట్ల‌ను ప్ర‌క‌టించారు. ఇది అప్పు రూపంలో ప్ర‌పంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇవ్వ‌నున్నారు. దీనిలోనూ 1400 కోట్ల వ‌ర‌కు కేంద్రం భ‌రించ‌నుంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించాలి.

సో.. మొత్తంగా 15000 కోట్లు రానున్నాయి. ఇక‌, తాజాగా ప్ర‌క‌టించిన స్వ‌ల్ప కాలిక బ‌డ్జెట్‌(న‌వంబ‌రు-మార్చి )లో 3445 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. ఇవి రాష్ట్ర సొమ్ములు. రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం నుంచి కేటాయించ‌నున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం సొంత‌గా హ‌డ్కో సంస్థ నుంచి మ‌రో 12 వేల కోట్ల రూపాయ‌లు తీసుకునేందుకు రెడీ అయింది. హ‌డ్కో కూడా ఇస్తాన‌ని చెప్పింది. అంటే.. మొత్తంగా 30 వేల కోట్ల‌కు పైగానే సొమ్ములు వ‌చ్చేందుకు మార్గం సుగ‌మం అయింది.

ఇవి కాకుండా.. రాజ‌ధాని బాండ్ల‌ను విక్ర‌యించ‌డం ద్వారా.. హ్యాపీ నెస్ట్ భ‌వ‌నాల‌ను విక్ర‌యించ‌డం(ఉన్న త త‌ర‌గ‌తుల కుటుంబాలు నివ‌సించేందుకు ఇళ్లు) ద్వారా 23 వేల కోట్ల‌ను స‌మీక‌రించ‌నున్నారు. అంటే.. మొత్తంగా తొలి ద‌శ‌లో ప్ర‌తిపాదించిన 50 వేల కోట్ల రూపాయ‌లు స‌మీక‌రించుకునేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు చేసిన ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. అయితే.. ఇవ‌న్నీ ఒక్క‌సారిగా కాకుండా.. విడ‌త‌ల వారీగా ప‌నులు పూర్తికాగానే వ‌చ్చేస్తాయి. ఎలా చూసుకున్నా.. అమ‌రావ‌తి నిర్మాణానికి 50 వేల కోట్ల రూపాయ‌లు స‌మ‌కూర‌నున్నాయి.

జంగిల్ క్లియ‌రెన్స్‌..

గ‌త ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో అమ‌రావ‌తిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇక్క‌డ తుమ్మ‌, పిచ్చిచెట్లు పెరిగిపో యి.. అడ‌విని త‌ల‌పించింది. దీనిని క్లియ‌ర్ చేసేందుకు 38 కోట్ల రూపాయ‌ల‌ను స‌ర్కారు గ‌తంలోనే కేటా యించింది. ప‌నులు కూడా పూర్త‌వుతున్నాయి. నేడో రేపో.. జంగిల్ క్లియ‌రెన్స్ పూర్త‌వుతుంది. అనంత‌రం.. రాష్ట్ర స‌ర్కారు బ‌డ్జెట్‌లో కేటాయించిన 3445 కోట్ల‌తో ప‌నులు ప్రాధ‌మికంగా ప్రారంభించ‌నుంది. త‌ర్వాత‌.. ఒక‌టి రెండు రోజుల్లోనే ప్ర‌పంచ బ్యాంకు నుంచి 25 శాతం చొప్పున అంటే 3 వేల కోట్ల‌కు పైగానే సొమ్ములు అంద‌నున్నాయి. దీంతో అమ‌రావ‌తి నిర్మాణాలు ప‌రుగులు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తున్నా యి. డిసెంబ‌రులోనే టెండ‌ర్ల‌ను ఆహ్వానించి ప‌నులు చేప‌ట్టేలా స‌ర్కారు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది.

This post was last modified on November 12, 2024 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

2 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

4 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

6 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

6 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

8 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

10 hours ago