Political News

అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌.. అభివృద్ధి ప‌రుగులే!

ఏపీ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల అడ్డంకులు దాదాపు తొలిగిపోయాయి. అటు రుణం రూపంలో కొంత.. ఇటు బ‌డ్జెట్ కేటాయింపులు మ‌రికొంత‌.. బాండ్లు విక్ర‌యించ‌డం ద్వారా ఇంకొంత సొమ్మును స‌మీక‌రించుకునేందుకు స‌ర్కారు ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అన్నీ స‌మ‌కూ రేందుకు మార్గం రెడీ అయింది. అమ‌రావ‌తి పూర్తిస్థాయి నిర్మాణానికి ల‌క్ష కోట్ల వ‌ర‌కు కావాల్సి ఉంది. అయితే.. ఈ మొత్తాన్ని రెండు ద‌శ‌లుగా విభ‌వించారు.

తొలి ద‌శ‌లో 50 వేల కోట్ల‌ను, మ‌లిద‌శ‌(అంటే దాదాపు సగానికిపైగా నిర్మాణాలు పూర్త‌వుతాయి)లో మిగిలిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకుని రాజ‌ధానిని పూర్తి చేయాల‌న్న‌ది ప్ర‌స్తుత ప్ర‌ణాళిక‌. దీని ప్ర‌కార‌మే చంద్ర‌బాబు స‌ర్కారు ఆదిశ‌గా అడుగులు వేసింది. కేంద్ర బ‌డ్జెట్‌లో రూ.15000 కోట్ల‌ను ప్ర‌క‌టించారు. ఇది అప్పు రూపంలో ప్ర‌పంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇవ్వ‌నున్నారు. దీనిలోనూ 1400 కోట్ల వ‌ర‌కు కేంద్రం భ‌రించ‌నుంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించాలి.

సో.. మొత్తంగా 15000 కోట్లు రానున్నాయి. ఇక‌, తాజాగా ప్ర‌క‌టించిన స్వ‌ల్ప కాలిక బ‌డ్జెట్‌(న‌వంబ‌రు-మార్చి )లో 3445 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. ఇవి రాష్ట్ర సొమ్ములు. రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం నుంచి కేటాయించ‌నున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం సొంత‌గా హ‌డ్కో సంస్థ నుంచి మ‌రో 12 వేల కోట్ల రూపాయ‌లు తీసుకునేందుకు రెడీ అయింది. హ‌డ్కో కూడా ఇస్తాన‌ని చెప్పింది. అంటే.. మొత్తంగా 30 వేల కోట్ల‌కు పైగానే సొమ్ములు వ‌చ్చేందుకు మార్గం సుగ‌మం అయింది.

ఇవి కాకుండా.. రాజ‌ధాని బాండ్ల‌ను విక్ర‌యించ‌డం ద్వారా.. హ్యాపీ నెస్ట్ భ‌వ‌నాల‌ను విక్ర‌యించ‌డం(ఉన్న త త‌ర‌గ‌తుల కుటుంబాలు నివ‌సించేందుకు ఇళ్లు) ద్వారా 23 వేల కోట్ల‌ను స‌మీక‌రించ‌నున్నారు. అంటే.. మొత్తంగా తొలి ద‌శ‌లో ప్ర‌తిపాదించిన 50 వేల కోట్ల రూపాయ‌లు స‌మీక‌రించుకునేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు చేసిన ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. అయితే.. ఇవ‌న్నీ ఒక్క‌సారిగా కాకుండా.. విడ‌త‌ల వారీగా ప‌నులు పూర్తికాగానే వ‌చ్చేస్తాయి. ఎలా చూసుకున్నా.. అమ‌రావ‌తి నిర్మాణానికి 50 వేల కోట్ల రూపాయ‌లు స‌మ‌కూర‌నున్నాయి.

జంగిల్ క్లియ‌రెన్స్‌..

గ‌త ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో అమ‌రావ‌తిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇక్క‌డ తుమ్మ‌, పిచ్చిచెట్లు పెరిగిపో యి.. అడ‌విని త‌ల‌పించింది. దీనిని క్లియ‌ర్ చేసేందుకు 38 కోట్ల రూపాయ‌ల‌ను స‌ర్కారు గ‌తంలోనే కేటా యించింది. ప‌నులు కూడా పూర్త‌వుతున్నాయి. నేడో రేపో.. జంగిల్ క్లియ‌రెన్స్ పూర్త‌వుతుంది. అనంత‌రం.. రాష్ట్ర స‌ర్కారు బ‌డ్జెట్‌లో కేటాయించిన 3445 కోట్ల‌తో ప‌నులు ప్రాధ‌మికంగా ప్రారంభించ‌నుంది. త‌ర్వాత‌.. ఒక‌టి రెండు రోజుల్లోనే ప్ర‌పంచ బ్యాంకు నుంచి 25 శాతం చొప్పున అంటే 3 వేల కోట్ల‌కు పైగానే సొమ్ములు అంద‌నున్నాయి. దీంతో అమ‌రావ‌తి నిర్మాణాలు ప‌రుగులు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తున్నా యి. డిసెంబ‌రులోనే టెండ‌ర్ల‌ను ఆహ్వానించి ప‌నులు చేప‌ట్టేలా స‌ర్కారు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది.

This post was last modified on November 12, 2024 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

6 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

22 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago