ఏపీ అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేయడం తో రాత్రికి రాత్రి ఫుడ్ కాంట్రాక్టర్ను అధికారులు తప్పించేశారు. వాస్తవానికి ప్రతి మూడేళ్లకు ఒకసారి కాంట్రాక్టర్ను మారుస్తారు. ఇలా చూస్తే.. ఇప్పటి వరకు ఆహారం అందించిన కాంట్రాక్టర్ వచ్చి ఏడాది కూడా కాలేదు. కానీ, సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఏర్పాటు చేసిన భోజనం నాణ్యతగా లేదన్న ఫిర్యాదులు రావడంతో స్పీకర్ ఆగ్రహించడం.. ఆవెంటనే కాంట్రాక్టర్ను మార్చేయడం గంటల్లోనే జరిగిపోయింది.
ఏం జరిగింది?
బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. ఈ క్రమంలో అన్నంలో నాణ్యత లోపించిందన్న విమర్శలు వచ్చాయి. ఇవి స్పీకర్ వరకు చేరాయి. దీంతో అసెంబ్లీ భోజనంపై నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు. దీనిపై చర్చ కూడా జరిగింది. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ ను స్పీకర్ నిలదీశారు.
ఈ పరిణామాల క్రమంలోనే ఫుడ్ సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ ను మార్చివేశారు. మంగళవారం నుంచి కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యత అప్పగించారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పీకర్ను అభినందించారు. మంచి పనిచేశారని కొనియాడారు.
This post was last modified on November 12, 2024 1:49 pm
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…