ఏపీ అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేయడం తో రాత్రికి రాత్రి ఫుడ్ కాంట్రాక్టర్ను అధికారులు తప్పించేశారు. వాస్తవానికి ప్రతి మూడేళ్లకు ఒకసారి కాంట్రాక్టర్ను మారుస్తారు. ఇలా చూస్తే.. ఇప్పటి వరకు ఆహారం అందించిన కాంట్రాక్టర్ వచ్చి ఏడాది కూడా కాలేదు. కానీ, సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఏర్పాటు చేసిన భోజనం నాణ్యతగా లేదన్న ఫిర్యాదులు రావడంతో స్పీకర్ ఆగ్రహించడం.. ఆవెంటనే కాంట్రాక్టర్ను మార్చేయడం గంటల్లోనే జరిగిపోయింది.
ఏం జరిగింది?
బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. ఈ క్రమంలో అన్నంలో నాణ్యత లోపించిందన్న విమర్శలు వచ్చాయి. ఇవి స్పీకర్ వరకు చేరాయి. దీంతో అసెంబ్లీ భోజనంపై నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు. దీనిపై చర్చ కూడా జరిగింది. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ ను స్పీకర్ నిలదీశారు.
ఈ పరిణామాల క్రమంలోనే ఫుడ్ సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ ను మార్చివేశారు. మంగళవారం నుంచి కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యత అప్పగించారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పీకర్ను అభినందించారు. మంచి పనిచేశారని కొనియాడారు.
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…