ఏపీ అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేయడం తో రాత్రికి రాత్రి ఫుడ్ కాంట్రాక్టర్ను అధికారులు తప్పించేశారు. వాస్తవానికి ప్రతి మూడేళ్లకు ఒకసారి కాంట్రాక్టర్ను మారుస్తారు. ఇలా చూస్తే.. ఇప్పటి వరకు ఆహారం అందించిన కాంట్రాక్టర్ వచ్చి ఏడాది కూడా కాలేదు. కానీ, సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఏర్పాటు చేసిన భోజనం నాణ్యతగా లేదన్న ఫిర్యాదులు రావడంతో స్పీకర్ ఆగ్రహించడం.. ఆవెంటనే కాంట్రాక్టర్ను మార్చేయడం గంటల్లోనే జరిగిపోయింది.
ఏం జరిగింది?
బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. ఈ క్రమంలో అన్నంలో నాణ్యత లోపించిందన్న విమర్శలు వచ్చాయి. ఇవి స్పీకర్ వరకు చేరాయి. దీంతో అసెంబ్లీ భోజనంపై నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు. దీనిపై చర్చ కూడా జరిగింది. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ ను స్పీకర్ నిలదీశారు.
ఈ పరిణామాల క్రమంలోనే ఫుడ్ సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ ను మార్చివేశారు. మంగళవారం నుంచి కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యత అప్పగించారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పీకర్ను అభినందించారు. మంచి పనిచేశారని కొనియాడారు.
This post was last modified on November 12, 2024 1:49 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…