Political News

ఎమ్మెల్యేలకే భోజ‌నం సరిగ్గా పెట్టలేకపోతే

ఏపీ అసెంబ్లీలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం తో రాత్రికి రాత్రి ఫుడ్ కాంట్రాక్ట‌ర్‌ను అధికారులు త‌ప్పించేశారు. వాస్త‌వానికి ప్ర‌తి మూడేళ్ల‌కు ఒక‌సారి కాంట్రాక్ట‌ర్‌ను మారుస్తారు. ఇలా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆహారం అందించిన కాంట్రాక్ట‌ర్ వ‌చ్చి ఏడాది కూడా కాలేదు. కానీ, సోమ‌వారం బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా.. ఏర్పాటు చేసిన భోజ‌నం నాణ్య‌త‌గా లేద‌న్న ఫిర్యాదులు రావ‌డంతో స్పీక‌ర్ ఆగ్ర‌హించ‌డం.. ఆవెంట‌నే కాంట్రాక్ట‌ర్‌ను మార్చేయ‌డం గంట‌ల్లోనే జ‌రిగిపోయింది.

ఏం జ‌రిగింది?

బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా సుమారు 500 మందికి భోజ‌నాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. ఈ క్ర‌మంలో అన్నంలో నాణ్య‌త లోపించింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇవి స్పీక‌ర్ వ‌ర‌కు చేరాయి. దీంతో అసెంబ్లీ భోజనంపై నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు. దీనిపై చ‌ర్చ కూడా జ‌రిగింది. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ ను స్పీక‌ర్ నిల‌దీశారు.

ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే ఫుడ్ సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ ను మార్చివేశారు. మంగ‌ళ‌వారం నుంచి కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యత అప్పగించారు. ఈ ప‌రిణామంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పీక‌ర్‌ను అభినందించారు. మంచి ప‌నిచేశార‌ని కొనియాడారు.

This post was last modified on November 12, 2024 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

18 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

44 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

1 hour ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago