Political News

ఎమ్మెల్యేలకే భోజ‌నం సరిగ్గా పెట్టలేకపోతే

ఏపీ అసెంబ్లీలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం తో రాత్రికి రాత్రి ఫుడ్ కాంట్రాక్ట‌ర్‌ను అధికారులు త‌ప్పించేశారు. వాస్త‌వానికి ప్ర‌తి మూడేళ్ల‌కు ఒక‌సారి కాంట్రాక్ట‌ర్‌ను మారుస్తారు. ఇలా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆహారం అందించిన కాంట్రాక్ట‌ర్ వ‌చ్చి ఏడాది కూడా కాలేదు. కానీ, సోమ‌వారం బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా.. ఏర్పాటు చేసిన భోజ‌నం నాణ్య‌త‌గా లేద‌న్న ఫిర్యాదులు రావ‌డంతో స్పీక‌ర్ ఆగ్ర‌హించ‌డం.. ఆవెంట‌నే కాంట్రాక్ట‌ర్‌ను మార్చేయ‌డం గంట‌ల్లోనే జ‌రిగిపోయింది.

ఏం జ‌రిగింది?

బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా సుమారు 500 మందికి భోజ‌నాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. ఈ క్ర‌మంలో అన్నంలో నాణ్య‌త లోపించింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇవి స్పీక‌ర్ వ‌ర‌కు చేరాయి. దీంతో అసెంబ్లీ భోజనంపై నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు. దీనిపై చ‌ర్చ కూడా జ‌రిగింది. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ ను స్పీక‌ర్ నిల‌దీశారు.

ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే ఫుడ్ సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ ను మార్చివేశారు. మంగ‌ళ‌వారం నుంచి కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యత అప్పగించారు. ఈ ప‌రిణామంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పీక‌ర్‌ను అభినందించారు. మంచి ప‌నిచేశార‌ని కొనియాడారు.

This post was last modified on November 12, 2024 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

18 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

7 hours ago