Political News

ఎమ్మెల్యేలకే భోజ‌నం సరిగ్గా పెట్టలేకపోతే

ఏపీ అసెంబ్లీలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం తో రాత్రికి రాత్రి ఫుడ్ కాంట్రాక్ట‌ర్‌ను అధికారులు త‌ప్పించేశారు. వాస్త‌వానికి ప్ర‌తి మూడేళ్ల‌కు ఒక‌సారి కాంట్రాక్ట‌ర్‌ను మారుస్తారు. ఇలా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆహారం అందించిన కాంట్రాక్ట‌ర్ వ‌చ్చి ఏడాది కూడా కాలేదు. కానీ, సోమ‌వారం బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా.. ఏర్పాటు చేసిన భోజ‌నం నాణ్య‌త‌గా లేద‌న్న ఫిర్యాదులు రావ‌డంతో స్పీక‌ర్ ఆగ్ర‌హించ‌డం.. ఆవెంట‌నే కాంట్రాక్ట‌ర్‌ను మార్చేయ‌డం గంట‌ల్లోనే జ‌రిగిపోయింది.

ఏం జ‌రిగింది?

బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా సుమారు 500 మందికి భోజ‌నాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. ఈ క్ర‌మంలో అన్నంలో నాణ్య‌త లోపించింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇవి స్పీక‌ర్ వ‌ర‌కు చేరాయి. దీంతో అసెంబ్లీ భోజనంపై నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు. దీనిపై చ‌ర్చ కూడా జ‌రిగింది. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ ను స్పీక‌ర్ నిల‌దీశారు.

ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే ఫుడ్ సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ ను మార్చివేశారు. మంగ‌ళ‌వారం నుంచి కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యత అప్పగించారు. ఈ ప‌రిణామంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పీక‌ర్‌ను అభినందించారు. మంచి ప‌నిచేశార‌ని కొనియాడారు.

This post was last modified on November 12, 2024 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

4 minutes ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

9 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago