ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు తొలిరోజు బడ్జెట్ ప్రసంగంతో ప్రశాంతంగా సాగిపోయాయి. అయితే.. ఈసమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ సహా ఇతర సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. ఈ పరిణామంపై సర్వత్రా విమర్శలు, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా మీడియా ప్రతినిధులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో ఆయన స్పందిస్తూ.. ఎవరి కోసమూ సభలను వాయిదా వేయలేమన్నారు. సభలు సజావుగా సాగిపోతాయన్నారు.
ప్రజల కావాలనుకునేవారు, ప్రజల సమస్యలపై మాట్లాడాలనుకునేవారు సభలకు వస్తారు. ఎవరు వచ్చినా.. ఎవరు రాకపోయినా.. సభలను మాత్రం నిర్వహిస్తాం. గతంలో 2014-19 మధ్యకూడా వైసీపీ సభలకు రాకుండా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరించింది. దీంతో అప్పట్లో మేమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాం. మా ఎమ్మెల్యేలే ప్రజల తరఫున సభలో సమస్యలను లేవనెత్తారు. మాకు ప్రజల సమస్యలు కొత్త కాదు. ప్రజల తరఫున మాట్లాడడం కూడా కొత్త కాదు. వైసీపీ వస్తే.. వారికి అవకాశం స్పీకర్ ఇస్తారు. మాకు సంబంధించిన వ్యవహారం కాదు. ఒకవేళ రాకపోతే.. ఆ పాత్ర కూడా మేమే నిర్వహిస్తాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సభలకు హాజరయ్యేలా అందరూ కోరుతున్నారని… ప్రజలు ఏదో ఇవ్వాలని కోరుకోవడం, దాని కోసం అలగడం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. గతంలో తమకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రతి సభకూ హాజరైన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తాను మాట్లాడేందుకు లేచినా.. తనకు కూడా మైకు ఇవ్వలేదన్నారు. అయినా.. తాను ఓపికగా సభకు వెళ్లానని తెలిపారు. సభకు రావడం అనేది ప్రజాప్రతినిధి కర్తవ్యమని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేశామని, సభలో ఉన్న ప్రతి ఒక్కరూ.. ప్రజల తరఫున మాట్లాడేందుకు అవకాశం దక్కుతుందన్నారు. ఈ విషయంలో తాము ఎంత వరకు పాత్ర పోషించాలో అంత వరకు పోషిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
This post was last modified on November 12, 2024 5:32 am
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…