Political News

‘గత CM ఆత్మలతో మాట్లాడి అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు’

జాతీయ విద్యాదినోత్సవాన్ని విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ప్రభుత్వం సన్మానించింది. అవార్డు గ్రహీతలకు రూ. 20 వేల నగదు, షీల్డ్స్‌, శాలువాతో సత్కరించింది.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన లోకేష్ తన శాఖ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు విద్యాశాఖ అప్పగించగానే తన సన్నిహితులు చాలామంది మెసేజ్ పెట్టారని, ఈ శాఖ నీకు అవసరమా అని వారించారని గుర్తు చేసుకున్నారు. స్టాన్ ఫోర్డ్ లో ఎంబీఏ చేసిన తాను ఈ శాఖను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నానని, దేశంలోనే ఏపీ విద్యాశాఖను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని వారికి తాను చెప్పానని లోకేష్ గుర్తు చేసుకున్నారు. కేరళ మోడల్, ఢిల్లీ మోడల్ కాదని, ఏపీ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేస్తానని చెప్పారు.

కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి పటిష్టం చేస్తానని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్లు రాణించేలా మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తామని లోకేష్ చెప్పారు.

సమాజానికి ఉత్తమ పౌరులను అందించే బాధ్యత ఉపాధ్యాయులుదేనని, ప్రైవేటు పాఠశాలలకు డీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని లోకేష్ అన్నారు. తల రాతలు రాసేది బ్రహ్మ అయితే… తల రాత మార్చేది గురువులు అని, కానీ, అటువంటి ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు గత ప్రభుత్వం నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇస్తుందని చెప్పారు.

గత ప్రభుత్వంలో ఫొటోలు, రంగుల పిచ్చి చూశారని, ఈ ప్రభుత్వంలో ఎక్కడా తన ఫొటో, సీఎం ఫొటో పుస్తకంలో ఉండదని చెప్పారు. యాప్‌ల పనే ఉపాధ్యాయులుకు ఎక్కువ భారంగా మారిందని, ఇక నుంచి చిన్న లోపాలు ఉన్నా సరిదిద్దుకుంటామని చెప్పారు. రాత్రి ఆత్మలతో మాట్లాడి.. ఉదయం అనాలోచితంగా జీవో నంబర్ 117 తెచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఉన్నారని జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు.
త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని, మూడేళ్లల్లో ప్రతి స్కూల్లో అన్ని వసతులు ఉండేలా చూస్తామని హామీనిచ్చారు. రెండేళ్లు కష్టపడితే మన విద్యా వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంటుందని చెప్పారు.

This post was last modified on November 12, 2024 5:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

7 hours ago