జాతీయ విద్యాదినోత్సవాన్ని విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ప్రభుత్వం సన్మానించింది. అవార్డు గ్రహీతలకు రూ. 20 వేల నగదు, షీల్డ్స్, శాలువాతో సత్కరించింది.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన లోకేష్ తన శాఖ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు విద్యాశాఖ అప్పగించగానే తన సన్నిహితులు చాలామంది మెసేజ్ పెట్టారని, ఈ శాఖ నీకు అవసరమా అని వారించారని గుర్తు చేసుకున్నారు. స్టాన్ ఫోర్డ్ లో ఎంబీఏ చేసిన తాను ఈ శాఖను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నానని, దేశంలోనే ఏపీ విద్యాశాఖను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని వారికి తాను చెప్పానని లోకేష్ గుర్తు చేసుకున్నారు. కేరళ మోడల్, ఢిల్లీ మోడల్ కాదని, ఏపీ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేస్తానని చెప్పారు.
కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి పటిష్టం చేస్తానని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్లు రాణించేలా మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తామని లోకేష్ చెప్పారు.
సమాజానికి ఉత్తమ పౌరులను అందించే బాధ్యత ఉపాధ్యాయులుదేనని, ప్రైవేటు పాఠశాలలకు డీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని లోకేష్ అన్నారు. తల రాతలు రాసేది బ్రహ్మ అయితే… తల రాత మార్చేది గురువులు అని, కానీ, అటువంటి ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు గత ప్రభుత్వం నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇస్తుందని చెప్పారు.
గత ప్రభుత్వంలో ఫొటోలు, రంగుల పిచ్చి చూశారని, ఈ ప్రభుత్వంలో ఎక్కడా తన ఫొటో, సీఎం ఫొటో పుస్తకంలో ఉండదని చెప్పారు. యాప్ల పనే ఉపాధ్యాయులుకు ఎక్కువ భారంగా మారిందని, ఇక నుంచి చిన్న లోపాలు ఉన్నా సరిదిద్దుకుంటామని చెప్పారు. రాత్రి ఆత్మలతో మాట్లాడి.. ఉదయం అనాలోచితంగా జీవో నంబర్ 117 తెచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఉన్నారని జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు.
త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని, మూడేళ్లల్లో ప్రతి స్కూల్లో అన్ని వసతులు ఉండేలా చూస్తామని హామీనిచ్చారు. రెండేళ్లు కష్టపడితే మన విద్యా వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్గా ఉంటుందని చెప్పారు.
This post was last modified on November 12, 2024 5:40 am
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…