Political News

నేత‌ల భార్య‌లే టార్గెట్‌: విర్ర‌వీగిన‌ వ‌ర్రా

వైసీపీ సోష‌ల్ మీడియాలో విర్ర‌వీగి.. అస‌భ్య ప‌ద‌జాలంతో దూకుడు ప్ర‌ద‌ర్శించి.. అదే గొప్ప‌గాఫీలైన వారి భ‌ర‌తం ప‌ట్టేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

ఈ క్ర‌మంలో వైసీపీ సోష‌ల్ మీడియాలో బూతులను మించిన స్థాయిలో ప‌చ్చి కారుకూత‌ల‌తో రెచ్చిపోయిన వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి స‌హా సుబ్బారెడ్డి, ఉద‌య్‌ల‌ను తాజాగా క‌ర్నూలు జిల్లా పోలీసులు, క‌డ‌ప జిల్లా అధికారులు సంయుక్తంగా ప‌ట్టుకున్నారు.

ఈ క్ర‌మంలో అస‌లు వీరి టార్గెట్ ఎవ‌రు? ఏంటి? అనే విష‌యాల‌ను రాబ‌ట్టారు. సోష‌ల్ మీడియాలోనూ పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో త‌మ పేరు మ‌రింత ప్ర‌చారంలోకివ‌చ్చేందుకు వ‌ర్రా రవీంద్రారెడ్డి ప్ర‌య‌త్నించాడు.

ఈ విష‌యాన్ని పోలీసు ఉన్న‌తాదికారులే చెప్పుకొచ్చారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం పొందేందుకు.. నేత‌ల భార్య‌ల‌ను, కుటుంబంలోని లేడీస్‌ను టార్గెట్ చేసుకున్నార‌ని వివ‌రించారు. ముఖ్యంగా వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి గ‌తంలో భార‌తీ సిమెంట్ కంపెనీలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంబించార‌ని తెలిపారు. 2012లో ఆయ‌న సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంలోకి వ‌చ్చార‌ని.. త‌ర్వాత కాలంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించార‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో 2020 నుంచి ఇష్టానుసారంగా చెల‌రేగిపోయిన‌ట్టు తెలిపారు. సాధార‌ణ పోస్టుల‌ను పెద్ద‌గా ఎవ‌రూ చూడ‌డం లేద‌ని భావించి.. నేత‌ల కుటుంబాల‌ను టార్గెట్ చేసుకున్నార‌ని వివ‌రించారు.

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు స‌హా ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, అదేవిధంగా ఆయ‌న కోడ‌లు, మంత్రి నారాలోకేష్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి, టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే బాల‌య్య స‌తీమ‌ణి, కుటుంబ స‌భ్యుల‌ను ప‌చ్చి బూతుల తో సోష‌లో మీడియాలో పోస్టులు పెట్టార‌ని చెప్పారు.

అంతేకాకుండా.. ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కుటుంబ స‌భ్యులు, మంత్రి అనిత కుటుంబం స‌హా ఇత‌ర నేత‌ల కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయార‌న్నారు. ఇలా నేత‌ల కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రెచ్చిపోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్రా సోష‌ల్ మీడియా చెల‌రేగిపోయిం ద‌న్నారు.

అదేవిధంగా క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి పిఏ క‌నుస‌న్న‌ల్లోనే ఈ గ్యాంగ్ రెచ్చిపోయిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఎంపీ చెబితే చేశారా? లేదా? అనేది విచార‌ణ‌లో తేలాల్సి ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం వ‌ర్రాపై 26 కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఇవ‌న్నీ రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదైన కేసులేన‌ని వివ‌రించారు.

This post was last modified on November 11, 2024 9:23 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago