Political News

నేత‌ల భార్య‌లే టార్గెట్‌: విర్ర‌వీగిన‌ వ‌ర్రా

వైసీపీ సోష‌ల్ మీడియాలో విర్ర‌వీగి.. అస‌భ్య ప‌ద‌జాలంతో దూకుడు ప్ర‌ద‌ర్శించి.. అదే గొప్ప‌గాఫీలైన వారి భ‌ర‌తం ప‌ట్టేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

ఈ క్ర‌మంలో వైసీపీ సోష‌ల్ మీడియాలో బూతులను మించిన స్థాయిలో ప‌చ్చి కారుకూత‌ల‌తో రెచ్చిపోయిన వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి స‌హా సుబ్బారెడ్డి, ఉద‌య్‌ల‌ను తాజాగా క‌ర్నూలు జిల్లా పోలీసులు, క‌డ‌ప జిల్లా అధికారులు సంయుక్తంగా ప‌ట్టుకున్నారు.

ఈ క్ర‌మంలో అస‌లు వీరి టార్గెట్ ఎవ‌రు? ఏంటి? అనే విష‌యాల‌ను రాబ‌ట్టారు. సోష‌ల్ మీడియాలోనూ పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో త‌మ పేరు మ‌రింత ప్ర‌చారంలోకివ‌చ్చేందుకు వ‌ర్రా రవీంద్రారెడ్డి ప్ర‌య‌త్నించాడు.

ఈ విష‌యాన్ని పోలీసు ఉన్న‌తాదికారులే చెప్పుకొచ్చారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం పొందేందుకు.. నేత‌ల భార్య‌ల‌ను, కుటుంబంలోని లేడీస్‌ను టార్గెట్ చేసుకున్నార‌ని వివ‌రించారు. ముఖ్యంగా వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి గ‌తంలో భార‌తీ సిమెంట్ కంపెనీలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంబించార‌ని తెలిపారు. 2012లో ఆయ‌న సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంలోకి వ‌చ్చార‌ని.. త‌ర్వాత కాలంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించార‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో 2020 నుంచి ఇష్టానుసారంగా చెల‌రేగిపోయిన‌ట్టు తెలిపారు. సాధార‌ణ పోస్టుల‌ను పెద్ద‌గా ఎవ‌రూ చూడ‌డం లేద‌ని భావించి.. నేత‌ల కుటుంబాల‌ను టార్గెట్ చేసుకున్నార‌ని వివ‌రించారు.

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు స‌హా ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, అదేవిధంగా ఆయ‌న కోడ‌లు, మంత్రి నారాలోకేష్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి, టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే బాల‌య్య స‌తీమ‌ణి, కుటుంబ స‌భ్యుల‌ను ప‌చ్చి బూతుల తో సోష‌లో మీడియాలో పోస్టులు పెట్టార‌ని చెప్పారు.

అంతేకాకుండా.. ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కుటుంబ స‌భ్యులు, మంత్రి అనిత కుటుంబం స‌హా ఇత‌ర నేత‌ల కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయార‌న్నారు. ఇలా నేత‌ల కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రెచ్చిపోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్రా సోష‌ల్ మీడియా చెల‌రేగిపోయిం ద‌న్నారు.

అదేవిధంగా క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి పిఏ క‌నుస‌న్న‌ల్లోనే ఈ గ్యాంగ్ రెచ్చిపోయిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఎంపీ చెబితే చేశారా? లేదా? అనేది విచార‌ణ‌లో తేలాల్సి ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం వ‌ర్రాపై 26 కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఇవ‌న్నీ రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదైన కేసులేన‌ని వివ‌రించారు.

This post was last modified on November 11, 2024 9:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

5 hours ago