వైసీపీ సోషల్ మీడియాలో విర్రవీగి.. అసభ్య పదజాలంతో దూకుడు ప్రదర్శించి.. అదే గొప్పగాఫీలైన వారి భరతం పట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియాలో బూతులను మించిన స్థాయిలో పచ్చి కారుకూతలతో రెచ్చిపోయిన వర్రా రవీంద్రారెడ్డి సహా సుబ్బారెడ్డి, ఉదయ్లను తాజాగా కర్నూలు జిల్లా పోలీసులు, కడప జిల్లా అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు.
ఈ క్రమంలో అసలు వీరి టార్గెట్ ఎవరు? ఏంటి? అనే విషయాలను రాబట్టారు. సోషల్ మీడియాలోనూ పోటీ నెలకొన్న నేపథ్యంలో తమ పేరు మరింత ప్రచారంలోకివచ్చేందుకు వర్రా రవీంద్రారెడ్డి ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాదికారులే చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం పొందేందుకు.. నేతల భార్యలను, కుటుంబంలోని లేడీస్ను టార్గెట్ చేసుకున్నారని వివరించారు. ముఖ్యంగా వర్రా రవీంద్రారెడ్డి గతంలో భారతీ సిమెంట్ కంపెనీలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంబించారని తెలిపారు. 2012లో ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోకి వచ్చారని.. తర్వాత కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలో 2020 నుంచి ఇష్టానుసారంగా చెలరేగిపోయినట్టు తెలిపారు. సాధారణ పోస్టులను పెద్దగా ఎవరూ చూడడం లేదని భావించి.. నేతల కుటుంబాలను టార్గెట్ చేసుకున్నారని వివరించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి విపక్ష నాయకుడు చంద్రబాబు సహా ఆయన సతీమణి భువనేశ్వరి, అదేవిధంగా ఆయన కోడలు, మంత్రి నారాలోకేష్ సతీమణి బ్రాహ్మణి, టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే బాలయ్య సతీమణి, కుటుంబ సభ్యులను పచ్చి బూతుల తో సోషలో మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పారు.
అంతేకాకుండా.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు, మంత్రి అనిత కుటుంబం సహా ఇతర నేతల కుటుంబాల్లోని మహిళలను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారన్నారు. ఇలా నేతల కుటుంబాల్లోని మహిళలను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్రా సోషల్ మీడియా చెలరేగిపోయిం దన్నారు.
అదేవిధంగా కడప ఎంపీ అవినాష్రెడ్డి పిఏ కనుసన్నల్లోనే ఈ గ్యాంగ్ రెచ్చిపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఎంపీ చెబితే చేశారా? లేదా? అనేది విచారణలో తేలాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వర్రాపై 26 కేసులు నమోదయ్యాయని, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులేనని వివరించారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…