వైసీపీ సోషల్ మీడియాలో విర్రవీగి.. అసభ్య పదజాలంతో దూకుడు ప్రదర్శించి.. అదే గొప్పగాఫీలైన వారి భరతం పట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియాలో బూతులను మించిన స్థాయిలో పచ్చి కారుకూతలతో రెచ్చిపోయిన వర్రా రవీంద్రారెడ్డి సహా సుబ్బారెడ్డి, ఉదయ్లను తాజాగా కర్నూలు జిల్లా పోలీసులు, కడప జిల్లా అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు.
ఈ క్రమంలో అసలు వీరి టార్గెట్ ఎవరు? ఏంటి? అనే విషయాలను రాబట్టారు. సోషల్ మీడియాలోనూ పోటీ నెలకొన్న నేపథ్యంలో తమ పేరు మరింత ప్రచారంలోకివచ్చేందుకు వర్రా రవీంద్రారెడ్డి ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాదికారులే చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం పొందేందుకు.. నేతల భార్యలను, కుటుంబంలోని లేడీస్ను టార్గెట్ చేసుకున్నారని వివరించారు. ముఖ్యంగా వర్రా రవీంద్రారెడ్డి గతంలో భారతీ సిమెంట్ కంపెనీలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంబించారని తెలిపారు. 2012లో ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోకి వచ్చారని.. తర్వాత కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలో 2020 నుంచి ఇష్టానుసారంగా చెలరేగిపోయినట్టు తెలిపారు. సాధారణ పోస్టులను పెద్దగా ఎవరూ చూడడం లేదని భావించి.. నేతల కుటుంబాలను టార్గెట్ చేసుకున్నారని వివరించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి విపక్ష నాయకుడు చంద్రబాబు సహా ఆయన సతీమణి భువనేశ్వరి, అదేవిధంగా ఆయన కోడలు, మంత్రి నారాలోకేష్ సతీమణి బ్రాహ్మణి, టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే బాలయ్య సతీమణి, కుటుంబ సభ్యులను పచ్చి బూతుల తో సోషలో మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పారు.
అంతేకాకుండా.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు, మంత్రి అనిత కుటుంబం సహా ఇతర నేతల కుటుంబాల్లోని మహిళలను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారన్నారు. ఇలా నేతల కుటుంబాల్లోని మహిళలను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్రా సోషల్ మీడియా చెలరేగిపోయిం దన్నారు.
అదేవిధంగా కడప ఎంపీ అవినాష్రెడ్డి పిఏ కనుసన్నల్లోనే ఈ గ్యాంగ్ రెచ్చిపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఎంపీ చెబితే చేశారా? లేదా? అనేది విచారణలో తేలాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వర్రాపై 26 కేసులు నమోదయ్యాయని, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులేనని వివరించారు.
This post was last modified on November 11, 2024 9:23 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…