Political News

40 రోజుల్లో ఏపీలో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం

ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పెన్షన్ ల పెంపు, దీపం పథకం వంటివి అమలు చేసిన కూటమి సర్కార్ మిగతా పథకాల అమలు కోసం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పథకంపై మంత్రి పార్థ సారధి కీలక ప్రకటన చేశారు.

ఈ ఏడాదిలోనే ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. అంటే మరో 40 రోజుల్లోపు ఈ పథకం అమలు కాబోతోందని మంత్రి పరోక్షంగా చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో 2 ప్రధాన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని, దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలెండర్లు ఇస్తున్నామని చెప్పారు. అందుకోసం రూ. 840 కోట్ల నిధులు కేటాయించామని అన్నారు.

తాజా బడ్జెట్ లో మరో 2 పథకాల అమలు కోసం నిధులు కేటాయించామని తెలిపారు. అమ్మకు వందనం పథకం కోసం రూ. 6,485 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కోసం రూ.1000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. నిరుద్యోగభృతికి వచ్చే ఏడాది నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. వైసీపీ సర్కారు దోపిడీతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రూ.1.35 లక్షల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ఆ కారణంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిద్రమై పోయిందని అన్నారు. రాష్ట్రం ఎన్నో ఆర్థిక కష్టాల్లో ఉన్నా.. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు.

This post was last modified on November 11, 2024 6:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

2 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

6 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

8 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

8 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

9 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

10 hours ago