Political News

చాగంటి జగన్‌కు నో చెప్పారు తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంది. ఎట్టకేలకు వాటిని ప్రకటిస్తున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల కోసం కష్టపడ్డ చాలామందికి పదవులు దక్కాయి. ఈ జాబితాలో కొన్ని ఊహించని పేర్లు కూడా ఉన్నాయి. అలా ఎక్కువమంది దృష్టిని ఆకర్షించి, ఆమోదం పొందిన పేరు.. చాగంటి కోటేశ్వరరావుదే.

ప్రవచనాల ద్వారా ఆయన కోట్లాదిమందికి చేరువ అయ్యారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఆయన్ని అభిమానించేవారి సంఖ్య చాలా పెద్దదే. యువతతో పాటు పెద్దవాళ్లు కూడా మొబైళ్లలో, టీవీలో ఆయన ప్రవచనాలు చూసి స్ఫూర్తి పొందుతుంటారు. చాగంటిని కూటమి ప్రభుత్వం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకుగాను కేబినెట్ హోదాలో సలహాదారు బాధ్యతల్లో నియమించిన సంగతి తెలిసిందే.

చాగంటి ఈ పదవిని స్వీకరించినట్లే తెలుస్తోంది. ఐతే ఆయనకు గత ఏడాది జగన్ ప్రభుత్వం కూడా ఓ పదవిని ఆఫర్ చేసిన విషయం చాలా మందికి తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ధర్మ ప్రచార పరిషత్‌కు సలహాదారుగా ఉండాలని జగన్ సర్కారు ఆయన్ని కోరింది. కానీ ఆయన ఆ పదవిని స్వీకరించలేదు. అందుకు కారణాలేంటన్నది అప్పుడు వెల్లడి కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదవి ఇస్తే మాత్రం స్వీకరిస్తున్నారు.

ఈ తేడాను జనం గమనించాలంటూ సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. జగన్‌కు ఉన్న ఇమేజ్, ఆయన ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను చూసే చాగంటి అప్పుడు పదవి చేపట్టడానికి వెనుకంజ వేసి ఉంటారని.. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్న మంచి ఇమేజ్ దృష్ట్యానే ఆయన పదవి చేపడుతున్నారని ఆ పార్టీల మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on November 11, 2024 2:36 pm

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

1 hour ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

4 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

4 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

4 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

5 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

8 hours ago