ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ పునర్నిర్మాణం, పేదల సంక్షేమం లక్ష్యంగా, ఏపీ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని తెలుస్తోంది. శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.90 లక్షలతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ కు సంబంధించిన పత్రాలను పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అధికారులు అందించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి పయ్యావుల బయలుదేరారు.
ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఆగస్టు నుంచి నవంబరు వరకు 1.30 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండడంతో తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రోజు ఉదయం బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. శాసన సభలో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
This post was last modified on November 11, 2024 10:38 am
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…