ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ పునర్నిర్మాణం, పేదల సంక్షేమం లక్ష్యంగా, ఏపీ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని తెలుస్తోంది. శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.90 లక్షలతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ కు సంబంధించిన పత్రాలను పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అధికారులు అందించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి పయ్యావుల బయలుదేరారు.
ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఆగస్టు నుంచి నవంబరు వరకు 1.30 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండడంతో తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రోజు ఉదయం బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. శాసన సభలో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
This post was last modified on November 11, 2024 10:38 am
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…