ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ పునర్నిర్మాణం, పేదల సంక్షేమం లక్ష్యంగా, ఏపీ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని తెలుస్తోంది. శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.90 లక్షలతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ కు సంబంధించిన పత్రాలను పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అధికారులు అందించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి పయ్యావుల బయలుదేరారు.
ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఆగస్టు నుంచి నవంబరు వరకు 1.30 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండడంతో తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రోజు ఉదయం బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. శాసన సభలో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
This post was last modified on November 11, 2024 10:38 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…