Political News

బుల్డోజ‌ర్‌కు అడ్డొస్తే… తొక్కించేస్తాం: రేవంత్ రెడ్డి వార్నింగ్‌

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూసీ న‌దిని సుంద‌రీక‌రించి తీరుతామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో కొంద‌రు బుల్డోజ‌ర్ల‌కు అడ్డంగా వ‌స్తామ‌ని, అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టిస్తున్నార‌ని.. ఇలాంటివారిని అదే బుల్డోజ‌ర్‌తో తొక్కించేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ‘మూసీ పున‌రుజ్జీవ యాత్ర‌’ పేరిట కాంగ్రెస్ నాయ‌కులు యాత్ర చేప‌ట్టారు. అనంత‌రం.. నిర్వ‌హించిన స‌భ‌లో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌ను త‌మాషా అనుకుంటున్నార‌ని, దీనిని చేప‌ట్ట‌డం చేత‌కాని వారు.. అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గ‌త బీఆర్ ఎస్ స‌ర్కారు నాయ‌కుల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

“మూసీ ప్ర‌క్షాళ‌న‌ను అడ్డుకుంటామ‌ని బీరాలు ప‌లుకుతున్న‌రు. వాళ్లెవ‌రో ముందుకు రావాలి. మంత్రి వెంక‌ట‌రెడ్డ‌న్న‌తోనే తొక్కించేస్తా” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవ‌రు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. మూసీ ప్ర‌క్షాళ‌న జ‌రిగి తీరుతుంద‌న్నారు. ఎవ‌రూ ఆప‌లేర‌ని చెప్పారు. ప్ర‌జ‌లు త‌మను ఎన్నుకున్న‌ది చేతులు ముడుచుకుని కూర్చునేందుకు కాద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం ఎంత దూర‌మైనా వెళ్తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పైనా విమర్శ‌లు గుప్పించారు. త‌న కుమార్తె క‌విత జైల్లో ఉంటే ఏడ్చిన ఆయ‌న‌.. న‌ల్ల‌గొండ వాసులు మూసీ కాలుష్యంతో అల్లాడుతుంటే ఏడుపు రాలేదా? అని నిల‌దీశారు.

ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నాయ‌కుల‌ను బిర్లా-రంగాల‌తో పోల్చి చూపారు. వారి వైపు ప్ర‌జ‌లు ఉండ‌ర‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీవైపే ప్ర‌జ‌లు నిల‌బ‌డ‌తార‌ని అన్నారు. సంగెం శివ‌య్య‌(సంగ‌మేశ్వ‌ర్వుడు) సాక్షిగా.. మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసి తీరుతామ‌ని రేవంత్ చెప్పారు. సుమారు 2.5కిలో మీట‌ర్ల మేర‌కు మూసీ పున‌రుజ్జీవ యాత్ర‌నుచేప‌ట్టిన అనంత‌రం.. ఆయ‌న సంగమేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు. ఈ నేప‌థ్యంలో శివ‌య్య ప్ర‌స్తావ‌న తీసుకువ‌స్తూ.. “సంగెం శివయ్య సాక్షిగా చెబుతున్నా మూసీ నది ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసి తీరుతా” అని రేవంత్ స్ప‌ష్టం చేశారు.

మూసీతో మ‌సి!

మూసీ న‌ది కార‌ణంగా ప్ర‌జ‌ల జీవితాలు మ‌సిబ‌డుతున్నాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాలు,నీళ్లు నిత్యావ‌స‌రాలు స‌హా అన్నీ కలుషితమేన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు తాను న‌డుంబిగించాన‌న్నారు. “మూసీ ప‌రివాహ‌కంలో పండే పంట‌లు కూడా క‌లుషితం అయ్యాయి. వీటిని తింటే రోగాలు వ‌స్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఓవైపు ఫ్లోరైడ్, మరోవైపు కలుషిత మూసీ ఆందోళన కలిగిస్తోంది. ఈ ప‌రిస్థితి మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ఎంత ఖ‌ర్చ‌యినా.. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. చేసి తీరుతాం” అని సీఎం వ్యాఖ్యానించారు.

This post was last modified on November 8, 2024 9:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

17 minutes ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

1 hour ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

3 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

3 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

4 hours ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

5 hours ago