మూసీ నది ప్రక్షాళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని సుందరీకరించి తీరుతామని చెప్పారు. ఈ క్రమంలో కొందరు బుల్డోజర్లకు అడ్డంగా వస్తామని, అడ్డుకుంటామని ప్రకటిస్తున్నారని.. ఇలాంటివారిని అదే బుల్డోజర్తో తొక్కించేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ‘మూసీ పునరుజ్జీవ యాత్ర’ పేరిట కాంగ్రెస్ నాయకులు యాత్ర చేపట్టారు. అనంతరం.. నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మూసీ ప్రక్షాళనను తమాషా అనుకుంటున్నారని, దీనిని చేపట్టడం చేతకాని వారు.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గత బీఆర్ ఎస్ సర్కారు నాయకులపై ఆయన విమర్శలు గుప్పించారు.
“మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటామని బీరాలు పలుకుతున్నరు. వాళ్లెవరో ముందుకు రావాలి. మంత్రి వెంకటరెడ్డన్నతోనే తొక్కించేస్తా” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు. ఎవరూ ఆపలేరని చెప్పారు. ప్రజలు తమను ఎన్నుకున్నది చేతులు ముడుచుకుని కూర్చునేందుకు కాదన్నారు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్పైనా విమర్శలు గుప్పించారు. తన కుమార్తె కవిత జైల్లో ఉంటే ఏడ్చిన ఆయన.. నల్లగొండ వాసులు మూసీ కాలుష్యంతో అల్లాడుతుంటే ఏడుపు రాలేదా? అని నిలదీశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను బిర్లా-రంగాలతో పోల్చి చూపారు. వారి వైపు ప్రజలు ఉండరని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీవైపే ప్రజలు నిలబడతారని అన్నారు. సంగెం శివయ్య(సంగమేశ్వర్వుడు) సాక్షిగా.. మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామని రేవంత్ చెప్పారు. సుమారు 2.5కిలో మీటర్ల మేరకు మూసీ పునరుజ్జీవ యాత్రనుచేపట్టిన అనంతరం.. ఆయన సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో శివయ్య ప్రస్తావన తీసుకువస్తూ.. “సంగెం శివయ్య సాక్షిగా చెబుతున్నా మూసీ నది ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసి తీరుతా” అని రేవంత్ స్పష్టం చేశారు.
మూసీతో మసి!
మూసీ నది కారణంగా ప్రజల జీవితాలు మసిబడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాలు,నీళ్లు నిత్యావసరాలు సహా అన్నీ కలుషితమేనని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు తాను నడుంబిగించానన్నారు. “మూసీ పరివాహకంలో పండే పంటలు కూడా కలుషితం అయ్యాయి. వీటిని తింటే రోగాలు వస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఓవైపు ఫ్లోరైడ్, మరోవైపు కలుషిత మూసీ ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎంత ఖర్చయినా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. చేసి తీరుతాం” అని సీఎం వ్యాఖ్యానించారు.
This post was last modified on November 8, 2024 9:15 pm
చెన్నై లవ్ స్టోరీ ఏ స్థాయిలో విజయం సాధిస్తుందనేది తేలడానికి కొంచెం టైం పడుతుంది కానీ వీకెండ్ దాకా ఢోకా…
తెలంగాణలో అధికార పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తరచూ అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. ఎనుముల రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం…
ఒక హీరోతో చేయాల్సిన కథ ఇంకో హీరో చేతికి వెళ్లిపోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఐతే పెద్ద ఫ్యామిలీకి చెందిన…
మనం ఎంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ జనం నిత్యం మాట్లాడుకునేలా,…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకా నందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఆయన కుమార్తె, డాక్టర్ నర్రెడ్డి…
కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…