నిన్న మొన్నటి వరకు ఆస్తుల వివాదాలతో తీరిక లేకుండా గడిపిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా రూట్ మార్చారు. రాజకీయంగా దూకుడు కూడా పెంచారు. కూటమి సర్కారుపై ఒకరకంగా యుద్ధాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిన విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ.. షర్మి ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ధర్నా చేశారు. దీనికి మీడియా సపోర్టు ఎలా ఉన్నా.. ప్రజల నుంచి మాత్రం బాగానే రెస్పాన్స్ కనిపించింది.
వాస్తవానికి నాయకులకు కావాల్సింది కూడా ఇదే. దీంతో షర్మిల రాజకీయంగా తీసుకున్న స్టెప్తో నిన్న మొన్నటి వరకు ఆమెపై పడిన కుటుంబం కోసం రాజకీయాల్లోకి వచ్చారన్న వాదనను దాదాపు పక్కకు జరిగిపోయింది. ఇక, ఇప్పుడు పూర్తిస్థాయిలో నాయకురాలిగా కూడా షర్మిల అరంగేట్రం చేసినట్టు అవుతుంది. అయితే.. ఆమె ఈ ఊపును కొన్నాళ్ల పాటైనా కొనసాగించాల్సిన అవసరం ఉంది. మధ్యలో చేజారితే మాత్రం ఇబ్బందే.
ఈ నేపథ్యంలో షర్మిల ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. ఇక, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ప్రజల తరఫున గళం వినిపించాల్సిన బాధ్యత వైసీపీపైనే ఉంది. కానీ, ఆ పార్టీ నాయకులు సొంత వ్యవహారాలు, కేసులతోనే కాలం కలిసి రాక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజల సమ్యలను వారు పట్టించుకోవడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో షర్మిల పుంజుకోవడం ఆశావహమే అవుతుంది.
అయితే.. ప్రజా ఉద్యమాలనే నమ్ముకుంటూ.. రాజకీయాలు చేస్తే బాగానే ఉంటుంది. కానీ, మధ్యలో కనుక దారిమళ్లితే.. షర్మిలపై పడిన ఆస్తుల ముద్ర పోవడం అంత ఈజీకాదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఆమె అలుపెరుగని పోరాటాలకు దిగితేనే భవిష్యత్తులో ఆమెను నాయకురాలిగా ప్రజలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుని వేసే ప్రతి అడుగు ప్రజల సమస్యల దిశగా నడిస్తే.. షర్మిల వైసీపీని రీప్లేస్ చేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on November 7, 2024 11:55 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…