నిన్న మొన్నటి వరకు ఆస్తుల వివాదాలతో తీరిక లేకుండా గడిపిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా రూట్ మార్చారు. రాజకీయంగా దూకుడు కూడా పెంచారు. కూటమి సర్కారుపై ఒకరకంగా యుద్ధాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిన విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ.. షర్మి ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ధర్నా చేశారు. దీనికి మీడియా సపోర్టు ఎలా ఉన్నా.. ప్రజల నుంచి మాత్రం బాగానే రెస్పాన్స్ కనిపించింది.
వాస్తవానికి నాయకులకు కావాల్సింది కూడా ఇదే. దీంతో షర్మిల రాజకీయంగా తీసుకున్న స్టెప్తో నిన్న మొన్నటి వరకు ఆమెపై పడిన కుటుంబం కోసం రాజకీయాల్లోకి వచ్చారన్న వాదనను దాదాపు పక్కకు జరిగిపోయింది. ఇక, ఇప్పుడు పూర్తిస్థాయిలో నాయకురాలిగా కూడా షర్మిల అరంగేట్రం చేసినట్టు అవుతుంది. అయితే.. ఆమె ఈ ఊపును కొన్నాళ్ల పాటైనా కొనసాగించాల్సిన అవసరం ఉంది. మధ్యలో చేజారితే మాత్రం ఇబ్బందే.
ఈ నేపథ్యంలో షర్మిల ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. ఇక, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ప్రజల తరఫున గళం వినిపించాల్సిన బాధ్యత వైసీపీపైనే ఉంది. కానీ, ఆ పార్టీ నాయకులు సొంత వ్యవహారాలు, కేసులతోనే కాలం కలిసి రాక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజల సమ్యలను వారు పట్టించుకోవడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో షర్మిల పుంజుకోవడం ఆశావహమే అవుతుంది.
అయితే.. ప్రజా ఉద్యమాలనే నమ్ముకుంటూ.. రాజకీయాలు చేస్తే బాగానే ఉంటుంది. కానీ, మధ్యలో కనుక దారిమళ్లితే.. షర్మిలపై పడిన ఆస్తుల ముద్ర పోవడం అంత ఈజీకాదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఆమె అలుపెరుగని పోరాటాలకు దిగితేనే భవిష్యత్తులో ఆమెను నాయకురాలిగా ప్రజలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుని వేసే ప్రతి అడుగు ప్రజల సమస్యల దిశగా నడిస్తే.. షర్మిల వైసీపీని రీప్లేస్ చేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on November 7, 2024 11:55 am
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…