Political News

రూటు మార్చిన ష‌ర్మిల‌… వైసీపీని రీప్లేస్ చేస్తారా..!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆస్తుల వివాదాల‌తో తీరిక లేకుండా గ‌డిపిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల తాజాగా రూట్ మార్చారు. రాజ‌కీయంగా దూకుడు కూడా పెంచారు. కూట‌మి స‌ర్కారుపై ఒక‌ర‌కంగా యుద్ధాన్ని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఈ నెల నుంచి అమల్లోకి వ‌చ్చిన విద్యుత్ చార్జీల పెంపును నిర‌సిస్తూ.. ష‌ర్మి ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విజ‌య‌వాడ‌లో ధ‌ర్నా చేశారు. దీనికి మీడియా స‌పోర్టు ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల నుంచి మాత్రం బాగానే రెస్పాన్స్ క‌నిపించింది.

వాస్త‌వానికి నాయ‌కుల‌కు కావాల్సింది కూడా ఇదే. దీంతో ష‌ర్మిల రాజ‌కీయంగా తీసుకున్న స్టెప్‌తో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆమెపై పడిన కుటుంబం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్న వాద‌న‌ను దాదాపు ప‌క్క‌కు జ‌రిగిపోయింది. ఇక‌, ఇప్పుడు పూర్తిస్థాయిలో నాయ‌కురాలిగా కూడా ష‌ర్మిల అరంగేట్రం చేసిన‌ట్టు అవుతుంది. అయితే.. ఆమె ఈ ఊపును కొన్నాళ్ల పాటైనా కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌ధ్య‌లో చేజారితే మాత్రం ఇబ్బందే.

ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. ఇక‌, ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించాల్సిన బాధ్య‌త వైసీపీపైనే ఉంది. కానీ, ఆ పార్టీ నాయ‌కులు సొంత వ్య‌వ‌హారాలు, కేసుల‌తోనే కాలం క‌లిసి రాక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్ర‌జ‌ల స‌మ్య‌ల‌ను వారు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఖ‌చ్చితంగా ఇలాంటి స‌మ‌యంలో ష‌ర్మిల పుంజుకోవ‌డం ఆశావ‌హ‌మే అవుతుంది.

అయితే.. ప్ర‌జా ఉద్య‌మాల‌నే న‌మ్ముకుంటూ.. రాజ‌కీయాలు చేస్తే బాగానే ఉంటుంది. కానీ, మ‌ధ్య‌లో క‌నుక దారిమ‌ళ్లితే.. ష‌ర్మిలపై ప‌డిన ఆస్తుల ముద్ర పోవ‌డం అంత ఈజీకాదు. రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై ఆమె అలుపెరుగ‌ని పోరాటాల‌కు దిగితేనే భ‌విష్య‌త్తులో ఆమెను నాయ‌కురాలిగా ప్ర‌జ‌లు స్వీక‌రించే అవ‌కాశం ఉంటుంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకుని వేసే ప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల దిశ‌గా న‌డిస్తే.. ష‌ర్మిల వైసీపీని రీప్లేస్ చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

This post was last modified on November 7, 2024 11:55 am

Share

Recent Posts

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

15 minutes ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

20 minutes ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

1 hour ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

3 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

4 hours ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

5 hours ago