వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీనివాస్ నివాసంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. లోపల ఉన్నవారిని లోపలే ఉంచేసి.. బయట నుంచి ఎవరూ రాకుండా కాపలా పెట్టి మరీ ఈ తనిఖీలు చేపట్టడం గమనార్హం.
ఒక్క గ్రంధి శ్రీనివాస్ ఇల్లే కాకుండా.. ఆయనకు సంబంధించిన ఆక్వా వ్యాపారాల సముదాయాలు, కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు సాగుతున్నాయి. అలానే.. గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వామి కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన చెన్ను లక్ష్మణరావు ఇల్లు, వ్యాపార సముదాయంలోనూ దాడులు జరుగుతున్నాయి. అటు గ్రంధి శ్రీనివాస్, ఇటు చెన్ను లక్ష్మణరావుల ఇళ్లపై ఏకకాలంలో అధికారులు దాడులు చేయడం గమనార్హం.
ఇదిలావుంటే, ప్రముఖ రొయ్యల ఎక్సపోర్టర్, వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, వ్యాపార సముదాయాలపై దాడులు జరగడానికి రూ.కోట్లలో ప్రభుత్వానికి పన్నులు ఎగవేయడమే కారణమని తెలుస్తోంది. పైగా ఎన్నికల అపిడవిట్లో పేర్కొన్న మేరకు.. వ్యాపారాలను కూడా ఐటీ అధికారులు మధింపు చేస్తున్నారు. తనిఖీల సమయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ను నియమించారు.
కృష్ణాజిల్లా నాగాయలంక ఆఫీస్, ఇతర వ్యాపారాల సముదాయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తుండడంతో రాజకీయంగా కూడా ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. వైసీపీ నాయకులు అలెర్ట్ అయ్యారు. దీని వెనుక.. రాజకీయ కుట్ర ఉందని పలువురు నాయకులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం గ్రంధి శ్రీనివాస్ వ్యవహారం బయటకు రాగానే తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు.
This post was last modified on November 6, 2024 3:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…