ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సోమవారం నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మకాం చేయనున్నారు. గత 15 రోజుల కిందటే ఆయన ఇక్కడ పర్యటించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆయన హాజరయ్యారు. అలాంటిది .. కేవలం 15 రోజుల వ్యవధిలోనే మరోసారి పిఠాపురంలో ఆయన పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇది అధికారికంగా చేపడుతున్న పర్యటనే అయినా.. వెనుక కీలక రాజకీయ వ్యవహారం ఉందని తెలుస్తోంది.
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. నాయకుల మధ్య దాడులు కూడా చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై ఇప్పటికి రెండు సార్లు దాడులు జరిగాయి. అయితే.. దీనివెనుక ఎవరు ఉన్నారన్న విషయంపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. ఇక, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలోనూ.. జనసేన నాయకులు దూకుడు ప్రదర్శించారు.
టీడీపీ నేతలు.. జనసేన పార్టీ కండువాలు వేసుకోకుండా తిరుగుతున్నారని.. రాష్ట్రంలో జనసేన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగంగా ఉందని, అసలు ఈ పార్టీ లేకపోతే, ప్రభుత్వం వచ్చేది కాదన్నది వారు బహిరంగంగా చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సఖ్యత సన్నగిల్లుతోంది. కీలకమైన, అందునా పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే మిత్రపక్షాల మధ్య ఇలా వివాదాలు చెలరేగుతుండడంతో జనసేన అధినేత అలెర్ట్ అయ్యారు.
సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే మకాం వేసి.. నాయకులకు క్లాస్ ఇచ్చే పనిని చేపట్టనున్నారు. మిత్రపక్షాల ఐక్యత, పొరపొచ్చాలు లేని సఖ్యత అనే రెండు కాన్సెప్టులను వారికి వివరించనున్నారు. అదేవిధంగా కలివిడిగా ఉండాల్సినఅవసరం కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. ఇక, అసంతృప్తితో రగులుతున్న కొందరు నాయకులను కూడా ఆయన బుజ్జగించడమో.. లేదా వార్నింగ్ ఇవ్వడమో చేయనున్నారు. మొత్తానికి పవన్ అయితే.. రంగంలోకి దిగుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…