Political News

పిఠాపురంలో ప‌వ‌న్ మ‌కాం.. రీజ‌నేంటి?

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు త‌న సొంత నియోజ‌కవర్గం పిఠాపురంలో మ‌కాం చేయ‌నున్నారు. గ‌త 15 రోజుల కింద‌టే ఆయ‌న ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ఆయ‌న హాజ‌ర‌య్యారు. అలాంటిది .. కేవ‌లం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి పిఠాపురంలో ఆయ‌న ప‌ర్య‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే.. ఇది అధికారికంగా చేప‌డుతున్న ప‌ర్య‌ట‌నే అయినా.. వెనుక కీలక రాజ‌కీయ వ్య‌వ‌హారం ఉంద‌ని తెలుస్తోంది.

పిఠాపురం నియోజ‌క‌వర్గంలో టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. నాయ‌కుల మ‌ధ్య దాడులు కూడా చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వ‌ర్మపై ఇప్ప‌టికి రెండు సార్లు దాడులు జ‌రిగాయి. అయితే.. దీనివెనుక ఎవ‌రు ఉన్నార‌న్న విష‌యంపై మాత్రం గోప్య‌త పాటిస్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన స‌మావేశంలోనూ.. జ‌న‌సేన నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

టీడీపీ నేత‌లు.. జ‌న‌సేన పార్టీ కండువాలు వేసుకోకుండా తిరుగుతున్నార‌ని.. రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీ కూడా ప్ర‌భుత్వంలో భాగంగా ఉంద‌ని, అస‌లు ఈ పార్టీ లేక‌పోతే, ప్ర‌భుత్వం వ‌చ్చేది కాద‌న్న‌ది వారు బ‌హిరంగంగా చేస్తున్న ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త స‌న్న‌గిల్లుతోంది. కీల‌క‌మైన, అందునా పార్టీ అధినేత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురంలోనే మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య ఇలా వివాదాలు చెల‌రేగుతుండ‌డంతో జ‌న‌సేన అధినేత అలెర్ట్ అయ్యారు.

సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు ఆయ‌న పిఠాపురంలోనే మ‌కాం వేసి.. నాయ‌కుల‌కు క్లాస్ ఇచ్చే ప‌నిని చేప‌ట్ట‌నున్నారు. మిత్ర‌ప‌క్షాల ఐక్య‌త‌, పొర‌పొచ్చాలు లేని స‌ఖ్య‌త అనే రెండు కాన్సెప్టుల‌ను వారికి వివ‌రించ‌నున్నారు. అదేవిధంగా క‌లివిడిగా ఉండాల్సినఅవ‌స‌రం కూడా ఆయ‌న వివ‌రించే అవ‌కాశం ఉంది. ఇక‌, అసంతృప్తితో ర‌గులుతున్న కొంద‌రు నాయ‌కుల‌ను కూడా ఆయ‌న బుజ్జ‌గించ‌డ‌మో.. లేదా వార్నింగ్ ఇవ్వ‌డ‌మో చేయ‌నున్నారు. మొత్తానికి ప‌వ‌న్ అయితే.. రంగంలోకి దిగుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 4, 2024 11:36 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

47 minutes ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

60 minutes ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

1 hour ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

2 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

3 hours ago

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

3 hours ago