ఏపీ మాజీ సీఎం జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళల మధ్య ఆస్తి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిలకు భద్రత పెంచాలని కోరుతూ ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావుకు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. షర్మిలకు ప్రాణహాని ఉందంటే భద్రత కల్పిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే గతంలో వైఎస్ విజయమ్మకు సంబంధించిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ఫ్రంట్ టైర్ లు రెండు ఒకేసారి ఊడిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన విజయమ్మ ప్రయాణిస్తున్న ఖరీదైన కారు ముందు రెండు టైర్లు జాకీలు వేసి నిలబెట్టి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఖరీదైన కొత్త కారు రెండు చక్రాలు ఒకేసారి ఊడిపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై టీడీపీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. లక్షల కోట్ల ఆస్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ఇలా రోడ్డు పక్కన పడి ఉందని, ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదని టిడిపి పేర్కొంది. అయితే, ఇదంతా జరిగింది 2024 ఎన్నికలకు ముందు అని, ఆ ఈ ఘటన జరిగిన తర్వాత ఏడాదిపాటు విజయమ్మ అమెరికాలో ఉన్నారని ఆ ట్వీట్ లో పేర్కొంది. లోగుట్టు ఆ కుటుంబానికి ఎరుక అంటూ టీడీపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2024 ఎన్నికలకు ముందు కూడా 2019 ఎన్నికలకు ముందు మాదిరే పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేశారేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం విశేషం అని టిడిపి ట్వీట్ చేసింది.
This post was last modified on November 2, 2024 6:27 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…