నిత్యం విరామం లేని పనులతో.. కలుసుకునే అతిథులతో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా టీ కాచారు. స్వయంగా ఆయనే పొయ్యి వెలిగించి.. దానిపై గిన్నె పెట్టి, పాల ప్యాకెట్ కట్ చేసి, గిన్నెలో పోసి.. టీ పొడి, పంచదార, యాలుకల పొడి వేసి మరిగించారు. అంతేకాదు.. మరిగిన తర్వాత.. తనే స్వయంగా దానిని వడగట్టి.. గ్లాసుల్లో పోసి.. అందరికీ అందించారు. ఈ చిత్రమైన వ్యవహారం.. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం ఇచ్ఛాపురంలో ఉన్న ఈదుపురం లో గ్రామంలో జరిగింది.
రీజనేంటి?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం తొలి లబ్ధిదారు రాలైన శాంతమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడే గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అనంతరం వారి ఇంట్లోనే.. పొయ్యి వెలిగించి.. అందరి సమక్షంలో తనే స్వయంగా టీ కాచి వడబోసి అందరికీ అందించారు. అయితే.. ఎంత చంద్రన్న అయినా సీఎం కావడం.. పైగా చుట్టూ సెక్యూరిటీ ఉండడంతో శాంతమ్మ కుటుంబం ఒకింత బిక్కుబిక్కుమంది.
దీంతో వారిని కూల్గా ఉండాలని చెప్పిన చంద్రబాబు టీ కాచడం గమనార్హం. టీ మరుగుతున్న సమయంలోనే లబ్ధిదారు శాంతమ్మతో చంద్రబాబు సంభాషించారు. ఆమె కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత గ్యాస్ పథకంపై ఆమె అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ పథకంతో తమ కష్టాలు తీరుతాయని శాంతమ్మ చెప్పడంతో చంద్రబాబు మురిసిపోయారు.
చంద్రబాబు పెట్టిన టీ రుచి చూస్తారా తమ్ముళ్లు
నిత్యం విరామం లేని పనులతో.. కలుసుకునే అతిథులతో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా టీ కాచారు. స్వయంగా ఆయనే పొయ్యి వెలిగించి.. దానిపై గిన్నె పెట్టి, పాల ప్యాకెట్ కట్ చేసి, గిన్నెలో పోసి.. టీ పొడి, పంచదార, యాలుకల పొడి వేసి మరిగించారు. అంతేకాదు.. మరిగిన తర్వాత.. తనే స్వయంగా దానిని వడగట్టి.. గ్లాసుల్లో పోసి.. అందరికీ అందించారు. ఈ చిత్రమైన వ్యవహారం.. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం ఇచ్ఛాపురంలో ఉన్న ఈదుపురం లో గ్రామంలో జరిగింది.
రీజనేంటి?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం తొలి లబ్ధిదారు రాలైన శాంతమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడే గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అనంతరం వారి ఇంట్లోనే.. పొయ్యి వెలిగించి.. అందరి సమక్షంలో తనే స్వయంగా టీ కాచి వడబోసి అందరికీ అందించారు. అయితే.. ఎంత చంద్రన్న అయినా సీఎం కావడం.. పైగా చుట్టూ సెక్యూరిటీ ఉండడంతో శాంతమ్మ కుటుంబం ఒకింత బిక్కుబిక్కుమంది.
దీంతో వారిని కూల్గా ఉండాలని చెప్పిన చంద్రబాబు టీ కాచడం గమనార్హం. టీ మరుగుతున్న సమయంలోనే లబ్ధిదారు శాంతమ్మతో చంద్రబాబు సంభాషించారు. ఆమె కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత గ్యాస్ పథకంపై ఆమె అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ పథకంతో తమ కష్టాలు తీరుతాయని శాంతమ్మ చెప్పడంతో చంద్రబాబు మురిసిపోయారు.
ఈ బిల్లు మీదే!
టీ కాచిన తర్వాత.. చంద్రబాబు ఈ బిల్లు మీదే.. అంటూ.. స్పాట్లో ఉన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి(సొంత జిల్లా కూడా ఇదే) కింరాజాపు రామ్మోహన్ నాయుడిని ఉద్దేశించి చమత్కరించారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. స్టేట్ బడ్జెట్ నుంచి చెల్లించమంటారా? సెంట్రల్ బడ్జెట్ నుంచి చెల్లించమంటారా? అని నవ్వుతూ ప్రశ్నించగా.. “నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదు” అని అనేశారు. కాగా, చంద్రబాబు చేతి టీ రుచి చూసేందుకు తమ్ముళ్లు ఎగబడడం గమనార్హం.
ఈ బిల్లు మీదే!
టీ కాచిన తర్వాత.. చంద్రబాబు ఈ బిల్లు మీదే.. అంటూ.. స్పాట్లో ఉన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి(సొంత జిల్లా కూడా ఇదే) కింరాజాపు రామ్మోహన్ నాయుడిని ఉద్దేశించి చమత్కరించారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. స్టేట్ బడ్జెట్ నుంచి చెల్లించమంటారా? సెంట్రల్ బడ్జెట్ నుంచి చెల్లించమంటారా? అని నవ్వుతూ ప్రశ్నించగా.. “నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదు” అని అనేశారు. కాగా, చంద్రబాబు చేతి టీ రుచి చూసేందుకు తమ్ముళ్లు ఎగబడడం గమనార్హం.
This post was last modified on November 1, 2024 4:47 pm
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…