తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదిశగా వడివడిగానే అడుగులు వేస్తున్నారు. వచ్చే సంక్రాంతిలోగా.. పార్టీ ని అన్ని రకాలుగా ముందుకు నడిపించే కీలక నాయకుల భర్తీపై ఆయన దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా.. ప్రధానమైన తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది.
ఏపీలోను, తెలంగాణలోనూ.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో కాసాని జ్ఞానేశ్వర్కు తెలంగాణలో పిలిచి మరీ పదవి కట్టబెట్టారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదన్న కారణంతో ఆయన పార్టీకి దూరమై.. బీఆర్ ఎస్ కండువా కప్పుకొన్నారు. ఇక, ఇప్పుడు ఈ పదవిని మరోసారి భర్తీ చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనూ బీసీనేతకే పెద్దపీట వేయాలని చూస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖ హాస్యనటుడు బాబు మోహన్, జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ తీగల క్రిష్ణారెడ్డి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. నెల రోజుల క్రితం చంద్రబాబును కలిసిన బాబు మోహన్.. రెండ్రోజుల క్రితం టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, ఇప్పటికే పార్టీలో చేరతానని చెప్పిన తీగల కృష్ణారెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే.. చంద్రబాబు మాత్రం బీసీ నాయకుడు అరవింద్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్జలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీ నాయకుడికి పగ్గాలు అప్పగించడం ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇక, ఈ పదవిని ఆశిస్తున్నవారిలో తీగల కృష్ణారెడ్డి(ఇంకా చేరలేదు)కి ఉపాధ్య పదవిని, బాబూ మోహన్కు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చే యోచన ఉందని తాజాగా తెలిసింది. దీపావళి సందర్భంగా చంద్రబాబు ఈ విషయంపై సుదీర్ఘ కసరత్తు చేశారని.. పేర్లను ఫైనల్ చేశారని సమాచారం.
This post was last modified on November 1, 2024 4:39 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…