తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదిశగా వడివడిగానే అడుగులు వేస్తున్నారు. వచ్చే సంక్రాంతిలోగా.. పార్టీ ని అన్ని రకాలుగా ముందుకు నడిపించే కీలక నాయకుల భర్తీపై ఆయన దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా.. ప్రధానమైన తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది.
ఏపీలోను, తెలంగాణలోనూ.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో కాసాని జ్ఞానేశ్వర్కు తెలంగాణలో పిలిచి మరీ పదవి కట్టబెట్టారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదన్న కారణంతో ఆయన పార్టీకి దూరమై.. బీఆర్ ఎస్ కండువా కప్పుకొన్నారు. ఇక, ఇప్పుడు ఈ పదవిని మరోసారి భర్తీ చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనూ బీసీనేతకే పెద్దపీట వేయాలని చూస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖ హాస్యనటుడు బాబు మోహన్, జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ తీగల క్రిష్ణారెడ్డి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. నెల రోజుల క్రితం చంద్రబాబును కలిసిన బాబు మోహన్.. రెండ్రోజుల క్రితం టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, ఇప్పటికే పార్టీలో చేరతానని చెప్పిన తీగల కృష్ణారెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే.. చంద్రబాబు మాత్రం బీసీ నాయకుడు అరవింద్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్జలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీ నాయకుడికి పగ్గాలు అప్పగించడం ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇక, ఈ పదవిని ఆశిస్తున్నవారిలో తీగల కృష్ణారెడ్డి(ఇంకా చేరలేదు)కి ఉపాధ్య పదవిని, బాబూ మోహన్కు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చే యోచన ఉందని తాజాగా తెలిసింది. దీపావళి సందర్భంగా చంద్రబాబు ఈ విషయంపై సుదీర్ఘ కసరత్తు చేశారని.. పేర్లను ఫైనల్ చేశారని సమాచారం.
This post was last modified on November 1, 2024 4:39 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…