తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదిశగా వడివడిగానే అడుగులు వేస్తున్నారు. వచ్చే సంక్రాంతిలోగా.. పార్టీ ని అన్ని రకాలుగా ముందుకు నడిపించే కీలక నాయకుల భర్తీపై ఆయన దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా.. ప్రధానమైన తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది.
ఏపీలోను, తెలంగాణలోనూ.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో కాసాని జ్ఞానేశ్వర్కు తెలంగాణలో పిలిచి మరీ పదవి కట్టబెట్టారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదన్న కారణంతో ఆయన పార్టీకి దూరమై.. బీఆర్ ఎస్ కండువా కప్పుకొన్నారు. ఇక, ఇప్పుడు ఈ పదవిని మరోసారి భర్తీ చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనూ బీసీనేతకే పెద్దపీట వేయాలని చూస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖ హాస్యనటుడు బాబు మోహన్, జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ తీగల క్రిష్ణారెడ్డి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. నెల రోజుల క్రితం చంద్రబాబును కలిసిన బాబు మోహన్.. రెండ్రోజుల క్రితం టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, ఇప్పటికే పార్టీలో చేరతానని చెప్పిన తీగల కృష్ణారెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే.. చంద్రబాబు మాత్రం బీసీ నాయకుడు అరవింద్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్జలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీ నాయకుడికి పగ్గాలు అప్పగించడం ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇక, ఈ పదవిని ఆశిస్తున్నవారిలో తీగల కృష్ణారెడ్డి(ఇంకా చేరలేదు)కి ఉపాధ్య పదవిని, బాబూ మోహన్కు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చే యోచన ఉందని తాజాగా తెలిసింది. దీపావళి సందర్భంగా చంద్రబాబు ఈ విషయంపై సుదీర్ఘ కసరత్తు చేశారని.. పేర్లను ఫైనల్ చేశారని సమాచారం.
This post was last modified on November 1, 2024 4:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…