ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ.. ఏపీలోని కూటమి సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తం 24 మందితోకూడిన బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా ప్రముఖ మీడియా టీవీ-5 అధినేత బీఆర్ నాయుడుని ఎంపిక చేయడం గమనార్హం. ఈయన పేరు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మధ్యలో కొన్నాళ్లు మరికొందరి పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. ఎట్టకేలకు ఈయననే పాలక మండలి బోర్డు చైర్మన్గా నియమిస్తూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక, మిగిలిన 23 మంది సభ్యుల్లో వైద్య రంగానికి చెందిన సుచిత్ర ఎల్లాకు ప్రాధాన్యం దక్కడం విశేషం. భారత్ బయోటెక్ సంస్థను స్థాపించిన కృష్ణా ఎల్లా సతీమణి సుచిత్ర ఎల్లా. కరోనా సమయంలో వ్యాక్సిన్ ను కనుగొన్న తొలి సంస్థగా ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తెలంగాణకు చెందిన ఈ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి ఉండడం గమనార్హం. ఇక, వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీ కండువా కప్పుకొన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి కూడా.. బోర్డులో సభ్యత్వం దక్కింది. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కూడా.. అవకాశం కల్పించారు.
ఇక, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా బోర్డులో ఉండనున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఈమె బోర్డు సభ్యురాలిగా ఉండడం గమనార్హం. అదేవిథంగా తొలిసారి ఎస్సీ సామాజిక వర్గానికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీనియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీనాయకుడు ఎం.ఎస్ రాజుకు బోర్డులో సభ్యత్వం లభించింది. ఇక, మరో ఎస్సీనాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత పనబాక లక్ష్మికి కూడా.. చంద్రబాబు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వడం గమనార్హం. అలాగే.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కర్ణాటకకు చెందిన హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు(హెచ్. ఎల్. దత్తు) కు కూడా.. చంద్రబాబు బోర్డులో అవకాశం కల్పించారు.
This post was last modified on October 30, 2024 10:00 pm
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…