Political News

మీడియా అధినేత‌కే టీటీడీ ప‌గ్గాలు.. 24 మందితో బోర్డు!

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లిని ఏర్పాటు చేస్తూ.. ఏపీలోని కూట‌మి స‌ర్కారు తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 24 మందితోకూడిన బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి చైర్మ‌న్‌గా ప్ర‌ముఖ మీడియా టీవీ-5 అధినేత బీఆర్ నాయుడుని ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. ఈయన పేరు గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. మ‌ధ్య‌లో కొన్నాళ్లు మ‌రికొంద‌రి పేర్లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు ఈయ‌న‌నే పాల‌క మండలి బోర్డు చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ.. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌, మిగిలిన 23 మంది స‌భ్యుల్లో వైద్య రంగానికి చెందిన సుచిత్ర ఎల్లాకు ప్రాధాన్యం ద‌క్క‌డం విశేషం. భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ను స్థాపించిన కృష్ణా ఎల్లా స‌తీమ‌ణి సుచిత్ర ఎల్లా. క‌రోనా స‌మ‌యంలో వ్యాక్సిన్ ను క‌నుగొన్న తొలి సంస్థ‌గా ఈ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మార్మోగింది. తెలంగాణ‌కు చెందిన ఈ సంస్థ‌కు అంత‌ర్జాతీయ ఖ్యాతి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వైసీపీ నుంచి ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ కండువా క‌ప్పుకొన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణ‌మూర్తికి కూడా.. బోర్డులో స‌భ్య‌త్వం ద‌క్కింది. అదేవిధంగా ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని జ‌గ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కూడా.. అవ‌కాశం క‌ల్పించారు.

ఇక‌, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి కూడా బోర్డులో ఉండ‌నున్నారు. గ‌త వైసీపీ హ‌యాంలోనూ ఈమె బోర్డు స‌భ్యురాలిగా ఉండ‌డం గ‌మ‌నార్హం. అదేవిథంగా తొలిసారి ఎస్సీ సామాజిక వ‌ర్గానికి టీటీడీ బోర్డులో అవ‌కాశం క‌ల్పించారు. అనంత‌పురం జిల్లా మ‌డ‌క‌శిర ఎస్సీనియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, టీడీపీనాయ‌కుడు ఎం.ఎస్ రాజుకు బోర్డులో స‌భ్య‌త్వం ల‌భించింది. ఇక‌, మ‌రో ఎస్సీనాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత ప‌న‌బాక లక్ష్మికి కూడా.. చంద్ర‌బాబు టీటీడీ బోర్డులో స‌భ్య‌త్వం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అలాగే.. సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, క‌ర్ణాట‌క‌కు చెందిన హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు(హెచ్‌. ఎల్. ద‌త్తు) కు కూడా.. చంద్ర‌బాబు బోర్డులో అవ‌కాశం క‌ల్పించారు.

This post was last modified on October 30, 2024 10:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

22 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

39 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago