ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ.. ఏపీలోని కూటమి సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తం 24 మందితోకూడిన బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా ప్రముఖ మీడియా టీవీ-5 అధినేత బీఆర్ నాయుడుని ఎంపిక చేయడం గమనార్హం. ఈయన పేరు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మధ్యలో కొన్నాళ్లు మరికొందరి పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. ఎట్టకేలకు ఈయననే పాలక మండలి బోర్డు చైర్మన్గా నియమిస్తూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక, మిగిలిన 23 మంది సభ్యుల్లో వైద్య రంగానికి చెందిన సుచిత్ర ఎల్లాకు ప్రాధాన్యం దక్కడం విశేషం. భారత్ బయోటెక్ సంస్థను స్థాపించిన కృష్ణా ఎల్లా సతీమణి సుచిత్ర ఎల్లా. కరోనా సమయంలో వ్యాక్సిన్ ను కనుగొన్న తొలి సంస్థగా ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తెలంగాణకు చెందిన ఈ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి ఉండడం గమనార్హం. ఇక, వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీ కండువా కప్పుకొన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి కూడా.. బోర్డులో సభ్యత్వం దక్కింది. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కూడా.. అవకాశం కల్పించారు.
ఇక, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా బోర్డులో ఉండనున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఈమె బోర్డు సభ్యురాలిగా ఉండడం గమనార్హం. అదేవిథంగా తొలిసారి ఎస్సీ సామాజిక వర్గానికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీనియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీనాయకుడు ఎం.ఎస్ రాజుకు బోర్డులో సభ్యత్వం లభించింది. ఇక, మరో ఎస్సీనాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత పనబాక లక్ష్మికి కూడా.. చంద్రబాబు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వడం గమనార్హం. అలాగే.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కర్ణాటకకు చెందిన హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు(హెచ్. ఎల్. దత్తు) కు కూడా.. చంద్రబాబు బోర్డులో అవకాశం కల్పించారు.
This post was last modified on October 30, 2024 10:00 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…