ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ.. ఏపీలోని కూటమి సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తం 24 మందితోకూడిన బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా ప్రముఖ మీడియా టీవీ-5 అధినేత బీఆర్ నాయుడుని ఎంపిక చేయడం గమనార్హం. ఈయన పేరు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మధ్యలో కొన్నాళ్లు మరికొందరి పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. ఎట్టకేలకు ఈయననే పాలక మండలి బోర్డు చైర్మన్గా నియమిస్తూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక, మిగిలిన 23 మంది సభ్యుల్లో వైద్య రంగానికి చెందిన సుచిత్ర ఎల్లాకు ప్రాధాన్యం దక్కడం విశేషం. భారత్ బయోటెక్ సంస్థను స్థాపించిన కృష్ణా ఎల్లా సతీమణి సుచిత్ర ఎల్లా. కరోనా సమయంలో వ్యాక్సిన్ ను కనుగొన్న తొలి సంస్థగా ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తెలంగాణకు చెందిన ఈ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి ఉండడం గమనార్హం. ఇక, వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీ కండువా కప్పుకొన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి కూడా.. బోర్డులో సభ్యత్వం దక్కింది. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కూడా.. అవకాశం కల్పించారు.
ఇక, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా బోర్డులో ఉండనున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఈమె బోర్డు సభ్యురాలిగా ఉండడం గమనార్హం. అదేవిథంగా తొలిసారి ఎస్సీ సామాజిక వర్గానికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీనియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీనాయకుడు ఎం.ఎస్ రాజుకు బోర్డులో సభ్యత్వం లభించింది. ఇక, మరో ఎస్సీనాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత పనబాక లక్ష్మికి కూడా.. చంద్రబాబు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వడం గమనార్హం. అలాగే.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కర్ణాటకకు చెందిన హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు(హెచ్. ఎల్. దత్తు) కు కూడా.. చంద్రబాబు బోర్డులో అవకాశం కల్పించారు.
This post was last modified on October 30, 2024 10:00 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…