ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ.. ఏపీలోని కూటమి సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తం 24 మందితోకూడిన బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా ప్రముఖ మీడియా టీవీ-5 అధినేత బీఆర్ నాయుడుని ఎంపిక చేయడం గమనార్హం. ఈయన పేరు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మధ్యలో కొన్నాళ్లు మరికొందరి పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. ఎట్టకేలకు ఈయననే పాలక మండలి బోర్డు చైర్మన్గా నియమిస్తూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక, మిగిలిన 23 మంది సభ్యుల్లో వైద్య రంగానికి చెందిన సుచిత్ర ఎల్లాకు ప్రాధాన్యం దక్కడం విశేషం. భారత్ బయోటెక్ సంస్థను స్థాపించిన కృష్ణా ఎల్లా సతీమణి సుచిత్ర ఎల్లా. కరోనా సమయంలో వ్యాక్సిన్ ను కనుగొన్న తొలి సంస్థగా ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తెలంగాణకు చెందిన ఈ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి ఉండడం గమనార్హం. ఇక, వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీ కండువా కప్పుకొన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి కూడా.. బోర్డులో సభ్యత్వం దక్కింది. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కూడా.. అవకాశం కల్పించారు.
ఇక, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా బోర్డులో ఉండనున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఈమె బోర్డు సభ్యురాలిగా ఉండడం గమనార్హం. అదేవిథంగా తొలిసారి ఎస్సీ సామాజిక వర్గానికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీనియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీనాయకుడు ఎం.ఎస్ రాజుకు బోర్డులో సభ్యత్వం లభించింది. ఇక, మరో ఎస్సీనాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత పనబాక లక్ష్మికి కూడా.. చంద్రబాబు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వడం గమనార్హం. అలాగే.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కర్ణాటకకు చెందిన హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు(హెచ్. ఎల్. దత్తు) కు కూడా.. చంద్రబాబు బోర్డులో అవకాశం కల్పించారు.
This post was last modified on October 30, 2024 10:00 pm
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…