Political News

‘వైసీపీ నుంచి ప్రాణ హాని.. ష‌ర్మిల‌కు భ‌ద్ర‌తకు పెంచండి!’

వైసీపీ నేత‌ల నుంచి త‌మ నాయ‌కురాలికి ప్రాణ హాని ఉంద‌ని.. ఈ నేప‌థ్యంలో మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల విష‌యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల రావుకు వారు లేఖ రాశారు. అదేవిధంగా ఈ లేఖ‌ను ప్ర‌తినిధి బృందం డీజీపీకి అందించింది. ప్ర‌స్తుతం ష‌ర్మిల‌కు పార్టీ అధ్య‌క్షురాలి హోదాతోపాటు.. మాజీ ముఖ్య‌మంత్రి కుమార్తెగా 2+2 చొప్పున భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు.

అయితే.. ప్ర‌స్తుతం ఆమె త‌మ కుటుంబ ఆస్తుల విష‌యంలో సోద‌రుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో వివాదానికి దిగిన విష‌యం తెలిసిందే. వైసీపీ నాయ‌కులు ష‌ర్మిల‌దే త‌ప్ప‌ని చెబుతున్నారు. విజ‌య‌సాయి రెడ్డి నుంచి సుబ్బారెడ్డి వ‌ర‌కు అంద‌రూ ఇదే మాట‌పై ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ నుంచి ష‌ర్మిల‌కు సెగ త‌గులుతోంది. మ‌రోవైపు వైసీపీ సోష‌ల్ మీడియాలోనూ.. ష‌ర్మిల‌కు వ్య‌తిరేకంగా కామెంట్లు వ‌స్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో ష‌ర్మిల‌కు భ‌ద్ర‌త పెంచాల‌న్న‌ది ఏపీ కాంగ్రెస్ నాయ‌కుల డిమాండ్‌. షర్మిలకు ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్‌కు బదులు 4+4 గన్ మెన్‌ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందించిన‌ట్టు పార్టీ నాయ‌కులు తెలిపారు. అయితే.. ఈ విష‌యం ప్ర‌భుత్వానికి విన్న‌వించిన త‌ర్వాత డీజీపీ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఇక‌, తెలంగాణ‌లోనూ త‌న భ‌ద్ర‌త‌ను య‌థ‌త‌థంగా కొన‌సాగించాల‌ని ష‌ర్మిల కోరుతున్నారు. ఈ మేర‌కు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి స‌ర్కారుకు లేఖ సంధించారు. ష‌ర్మిల‌కు ప్ర‌స్తుతం `వై“కేటగిరీ భద్రత ఉంది. దీనిని ఆమె ఎక్క‌డ‌కు వెళ్లినా.. కొన‌సాగించాల‌ని స‌ర్కారుకు విన్న‌వించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుత ప‌రిణామాలను వారు లేఖ‌లో వివ‌రించారు.

This post was last modified on October 30, 2024 6:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

24 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago