వైసీపీ నేతల నుంచి తమ నాయకురాలికి ప్రాణ హాని ఉందని.. ఈ నేపథ్యంలో మరింత భద్రత కల్పించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల విషయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు వారు లేఖ రాశారు. అదేవిధంగా ఈ లేఖను ప్రతినిధి బృందం డీజీపీకి అందించింది. ప్రస్తుతం షర్మిలకు పార్టీ అధ్యక్షురాలి హోదాతోపాటు.. మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా 2+2 చొప్పున భద్రత కల్పిస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం ఆమె తమ కుటుంబ ఆస్తుల విషయంలో సోదరుడు, వైసీపీ అధినేత జగన్తో వివాదానికి దిగిన విషయం తెలిసిందే. వైసీపీ నాయకులు షర్మిలదే తప్పని చెబుతున్నారు. విజయసాయి రెడ్డి నుంచి సుబ్బారెడ్డి వరకు అందరూ ఇదే మాటపై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి షర్మిలకు సెగ తగులుతోంది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియాలోనూ.. షర్మిలకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో షర్మిలకు భద్రత పెంచాలన్నది ఏపీ కాంగ్రెస్ నాయకుల డిమాండ్. షర్మిలకు ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్కు బదులు 4+4 గన్ మెన్ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్టు పార్టీ నాయకులు తెలిపారు. అయితే.. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించిన తర్వాత డీజీపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక, తెలంగాణలోనూ తన భద్రతను యథతథంగా కొనసాగించాలని షర్మిల కోరుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి సర్కారుకు లేఖ సంధించారు. షర్మిలకు ప్రస్తుతం `వై“కేటగిరీ భద్రత ఉంది. దీనిని ఆమె ఎక్కడకు వెళ్లినా.. కొనసాగించాలని సర్కారుకు విన్నవించడం గమనార్హం. ప్రస్తుత పరిణామాలను వారు లేఖలో వివరించారు.
This post was last modified on October 30, 2024 6:29 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…