Political News

అమెరికాలో పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ.. ఎలా జరిగిందంటే

అమెరికాలోని లాస్‍వేగాస్‍లో జరుగుతున్న “ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‍”లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడ‌బ్ల్యూఎస్‌) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌, పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా సూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌తో లోకేష్ భేటీ అయ్యారు.

ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ గవర్నెన్స్, ఏఐ, ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యత, ఏపీ పాలసీలు, పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సదుపాయాల గురించి వివరించారు. లోకేష్ ఆహ్వానంపై వారు సానుకూలంగా స్పందించారు.

ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతివ్వాల‌ని ఇంద్రా సూయీని లోకేష్ కోరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకుపోతున్నామని, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు ఏపీలో అమలుచేస్తున్నామని తెలిపారు.

మహిళా నాయకత్వాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, కార్పొరేట్, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యంతో మెరుగైన సమాజ నిర్మాణం కోసం వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఏపీలో సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఏపీలో పర్యటించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారమందిస్తానన్నారు.

సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌ తో భేటీ అయిన లోకేష్ స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై ఏపీ ప్ర‌భుత్వం దృష్టిసారించింద‌ని చెప్పారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వాలని, ఏపీ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి ఏఐ టూల్స్, మెంటార్‌షిప్‌ను అందించాల‌ని లోకేష్ విజ్నప్తి చేశారు.

సేల్స్‌ఫోర్స్ తాలూకు “ఐన్‌స్టీన్ ఏఐ”ని ఏపీకి పరిచయం చేయాల‌ని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో చ‌ర్చిస్తామ‌ని క్లారా షిష్ వెల్లడించారు.

ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడ‌బ్ల్యూఎస్‌) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ తో లోకేష్ అన్నారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏపీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు, ఏపీ స్మార్ట్ గవర్నెన్స్ లో ఏడ‌బ్ల్యూఎస్‌ క్లౌడ్ సేవలు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఏపీని ఏఐ ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలని, తమతో కలిసి పనిచేయాలని, ఏడ‌బ్ల్యూఎస్‌ తదుపరి డేటా సెంటర్‌కు ఏపీ అనువైనదని చెప్పారు. లోకేష్ ప్రతిపాదనలపై స్పందించిన రేచల్ స్కాఫ్.. ఏపీలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

This post was last modified on October 30, 2024 3:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

3 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

3 hours ago

‘అందుకే ఇండస్ట్రీని వదిలేశా’

పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…

4 hours ago

తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…

4 hours ago

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…

5 hours ago

IBOMMA 2.0: అరెస్ట్ అయినా ఆగలేదేంటి?

చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…

5 hours ago