Political News

అమెరికాలో పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ.. ఎలా జరిగిందంటే

అమెరికాలోని లాస్‍వేగాస్‍లో జరుగుతున్న “ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‍”లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడ‌బ్ల్యూఎస్‌) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌, పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా సూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌తో లోకేష్ భేటీ అయ్యారు.

ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ గవర్నెన్స్, ఏఐ, ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యత, ఏపీ పాలసీలు, పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సదుపాయాల గురించి వివరించారు. లోకేష్ ఆహ్వానంపై వారు సానుకూలంగా స్పందించారు.

ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతివ్వాల‌ని ఇంద్రా సూయీని లోకేష్ కోరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకుపోతున్నామని, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు ఏపీలో అమలుచేస్తున్నామని తెలిపారు.

మహిళా నాయకత్వాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, కార్పొరేట్, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యంతో మెరుగైన సమాజ నిర్మాణం కోసం వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఏపీలో సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఏపీలో పర్యటించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారమందిస్తానన్నారు.

సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌ తో భేటీ అయిన లోకేష్ స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై ఏపీ ప్ర‌భుత్వం దృష్టిసారించింద‌ని చెప్పారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వాలని, ఏపీ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి ఏఐ టూల్స్, మెంటార్‌షిప్‌ను అందించాల‌ని లోకేష్ విజ్నప్తి చేశారు.

సేల్స్‌ఫోర్స్ తాలూకు “ఐన్‌స్టీన్ ఏఐ”ని ఏపీకి పరిచయం చేయాల‌ని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో చ‌ర్చిస్తామ‌ని క్లారా షిష్ వెల్లడించారు.

ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడ‌బ్ల్యూఎస్‌) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ తో లోకేష్ అన్నారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏపీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు, ఏపీ స్మార్ట్ గవర్నెన్స్ లో ఏడ‌బ్ల్యూఎస్‌ క్లౌడ్ సేవలు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఏపీని ఏఐ ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలని, తమతో కలిసి పనిచేయాలని, ఏడ‌బ్ల్యూఎస్‌ తదుపరి డేటా సెంటర్‌కు ఏపీ అనువైనదని చెప్పారు. లోకేష్ ప్రతిపాదనలపై స్పందించిన రేచల్ స్కాఫ్.. ఏపీలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

Satya

Recent Posts

తెలంగాణ‌లో జ‌న‌సేన‌… మద్దతు పెరుగుతుందా?

తెలంగాణకు రావొచ్చు.. పోవ‌చ్చు.. ఇక్క‌డ నివ‌సించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజ‌కీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…

44 minutes ago

షర్మిలకు సీటు ఇవ్వని కాంగ్రెస్

గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…

1 hour ago

ఏపీ బీచ్‌ల‌లో.. గోవా క‌ల్చ‌ర్‌.. కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో సుదీర్ఘ స‌ముద్ర తీర ప్రాంతం ఉంది. గుజ‌రాత్ స‌హా కొన్ని రాష్ట్రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన తీర ప్రాంతం(బీచ్‌) ఏపీలో…

1 hour ago

కృషి ఉంటే… సేనానికి క‌ష్ట‌మేమీ కాదు..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..త‌న పార్టీని తెలంగాణ‌లోనూ విస్త‌రించేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యాన్ని…

4 hours ago

చిరు పుత్రోత్సాహంలో ఇది పీక్స్

ఒక టాప్ హీరో వార‌స‌త్వాన్నందుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టి అంచ‌నాల‌ను అందుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. మొత్తం ఇండియ‌న్…

8 hours ago

ఆర్టిస్టులను ఇంకొంచెం వాడుకుని ఉంటే

పెద్దిలో అందరూ రామ్ చరణ్, జగపతిబాబు, శివరాజ్ కుమార్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతున్నారు. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. దర్శకుడు…

9 hours ago