అమెరికాలోని లాస్వేగాస్లో జరుగుతున్న “ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్”లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్, పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా సూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్తో లోకేష్ భేటీ అయ్యారు.
ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ గవర్నెన్స్, ఏఐ, ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యత, ఏపీ పాలసీలు, పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సదుపాయాల గురించి వివరించారు. లోకేష్ ఆహ్వానంపై వారు సానుకూలంగా స్పందించారు.
ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతివ్వాలని ఇంద్రా సూయీని లోకేష్ కోరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకుపోతున్నామని, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు ఏపీలో అమలుచేస్తున్నామని తెలిపారు.
మహిళా నాయకత్వాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, కార్పొరేట్, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యంతో మెరుగైన సమాజ నిర్మాణం కోసం వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఏపీలో సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఏపీలో పర్యటించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారమందిస్తానన్నారు.
సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్ తో భేటీ అయిన లోకేష్ స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించిందని చెప్పారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వాలని, ఏపీ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఏఐ టూల్స్, మెంటార్షిప్ను అందించాలని లోకేష్ విజ్నప్తి చేశారు.
సేల్స్ఫోర్స్ తాలూకు “ఐన్స్టీన్ ఏఐ”ని ఏపీకి పరిచయం చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో చర్చిస్తామని క్లారా షిష్ వెల్లడించారు.
ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్ తో లోకేష్ అన్నారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏపీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు, ఏపీ స్మార్ట్ గవర్నెన్స్ లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఏపీని ఏఐ ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలని, తమతో కలిసి పనిచేయాలని, ఏడబ్ల్యూఎస్ తదుపరి డేటా సెంటర్కు ఏపీ అనువైనదని చెప్పారు. లోకేష్ ప్రతిపాదనలపై స్పందించిన రేచల్ స్కాఫ్.. ఏపీలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…