రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలో తనకు బాగానే తెలుసునని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తాను ఫుట్ బాల్ ప్లేయర్నని.. తనకు ఎలా ఆడాలో తెలుసునని పరోక్షంగా తెలంగాణ రాజకీయాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకున్నాకే.. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కినట్టు చెప్పారు. సీఎం కావాలన్నది తన కలగా పేర్కొన్నారు. దీనిని నెరవేర్చుకున్నానని తెలిపారు.
రాష్ట్రంలో అనేక పనులు చేపట్టామని.. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెంటినీ సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. గతంలో ఉద్యోగులకు నెలలో ఎప్పుడు జీతాలు ఇచ్చేవారో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, కానీ, తాము వచ్చాక.. ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నామన్నారు. అదేసమయంలో ఇచ్చిన గ్యారెంటీల హామీలను కూడా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఎక్కడ తప్పులు జరిగినా.. అవి సీఎం వల్లే జరిగాయని అనడం బుద్ధిలేని వాళ్లు చేసే పనిగా విమర్శించారు.
మూసీ ప్రతిష్టాత్మకం..
మూసీ నదిని ప్రక్షాళన చేయడం అనేది.. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సీఎం చెప్పారు. అనేక సమస్యలు వస్తాయని తెలిసి కూడా.. దీనిని ప్రారంభించామన్నారు. ఉత్తిపుణ్యాన ఎవరి భూమినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏదీ చేయదని చెప్పారు. ఆక్రమించారు కాబట్టే తొలగిస్తున్నామన్నారు. హైడ్రా వస్తే.. రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పిన వారు.. ఇప్పుడు ఎక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయిందో చెప్పాలన్నారు. తాము వచ్చాక.. 2 లక్షల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
తాను ప్రపంచ మేధావినని చెప్పుకొనే కేటీఆర్కు.. మూసీ నదిపై అవగాహన ఉందా? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. ఇంటర్నేషనల్ మైండ్ ఉన్న కేటీఆర్ సలహాలు సూచనలు చేస్తే.. మాఅధికారులు తీసుకుంటారని.. చెప్పారు. 55 కిలో మీటర్ల మేరకు మూసీ నది తిరిగి ప్రక్షాళన అయితే.. నగరానికి పేరు , ప్రభుత్వానికి ఆదాయం రెండూ వస్తాయని.. ఇది ఇష్టంలేని వారే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
This post was last modified on October 30, 2024 6:59 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…