రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలో తనకు బాగానే తెలుసునని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తాను ఫుట్ బాల్ ప్లేయర్నని.. తనకు ఎలా ఆడాలో తెలుసునని పరోక్షంగా తెలంగాణ రాజకీయాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకున్నాకే.. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కినట్టు చెప్పారు. సీఎం కావాలన్నది తన కలగా పేర్కొన్నారు. దీనిని నెరవేర్చుకున్నానని తెలిపారు.
రాష్ట్రంలో అనేక పనులు చేపట్టామని.. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెంటినీ సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. గతంలో ఉద్యోగులకు నెలలో ఎప్పుడు జీతాలు ఇచ్చేవారో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, కానీ, తాము వచ్చాక.. ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నామన్నారు. అదేసమయంలో ఇచ్చిన గ్యారెంటీల హామీలను కూడా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఎక్కడ తప్పులు జరిగినా.. అవి సీఎం వల్లే జరిగాయని అనడం బుద్ధిలేని వాళ్లు చేసే పనిగా విమర్శించారు.
మూసీ ప్రతిష్టాత్మకం..
మూసీ నదిని ప్రక్షాళన చేయడం అనేది.. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సీఎం చెప్పారు. అనేక సమస్యలు వస్తాయని తెలిసి కూడా.. దీనిని ప్రారంభించామన్నారు. ఉత్తిపుణ్యాన ఎవరి భూమినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏదీ చేయదని చెప్పారు. ఆక్రమించారు కాబట్టే తొలగిస్తున్నామన్నారు. హైడ్రా వస్తే.. రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పిన వారు.. ఇప్పుడు ఎక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయిందో చెప్పాలన్నారు. తాము వచ్చాక.. 2 లక్షల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
తాను ప్రపంచ మేధావినని చెప్పుకొనే కేటీఆర్కు.. మూసీ నదిపై అవగాహన ఉందా? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. ఇంటర్నేషనల్ మైండ్ ఉన్న కేటీఆర్ సలహాలు సూచనలు చేస్తే.. మాఅధికారులు తీసుకుంటారని.. చెప్పారు. 55 కిలో మీటర్ల మేరకు మూసీ నది తిరిగి ప్రక్షాళన అయితే.. నగరానికి పేరు , ప్రభుత్వానికి ఆదాయం రెండూ వస్తాయని.. ఇది ఇష్టంలేని వారే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
This post was last modified on October 30, 2024 6:59 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…