Political News

విజ‌య‌మ్మ లేఖ తో అన్ని నోర్లు మూతబడ్డాయి

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంలో త‌లెత్తిన ఆస్తుల వివాదంలో పెద్ద సంఘ‌ట‌న తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది. ఈ ఆస్తుల వివాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు ష‌ర్మిల చెబుతున్న‌ది, అటు జ‌గ‌న్ చెబుత‌న్న‌ది.. ఇద్ద‌రి ప‌క్షాన అనుకూల‌, ప్ర‌తికూల వ‌ర్గాలు చెబుతున్న‌ది కూడా.. పెద్ద గంద‌ర‌గోళానికి దారి తీసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అంద‌రూ అనుకున్న‌ట్టుగానే.. కొద్దిపాటి ఆల‌స్యంతో అయినా.. విజ‌య‌మ్మ స్పందించారు. ఈ సంద‌ర్భంగా అస‌లు ఏం జ‌రిగింద‌నేది ఆమె చెప్పుకొచ్చారు. దీంతో అసలు వివాదానికి దాదాపు ముగింపు ప‌లికిన‌ట్ట‌యింది.

అయితే.. ఈ క్ర‌మంలో విజ‌య‌మ్మ ఎవ‌రి వైపు నిల‌బడ్డార‌నేది రాజ‌కీయ నేత‌ల నుంచి నెటిజ‌న్ల వ‌ర‌కు పెద్ద ఎత్తున ఆస‌క్తి క‌న‌బ‌రి చారు. స‌హ‌జంగానే ఈ ప్ర‌శ్న ఉద్భ‌విస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఎందుకంటే.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ష‌ర్మిల‌కు అనుకూలంగా విజ‌యమ్మ స్పందించి.. అమెరికా నుంచి కూడా వీడియో సందేశం పంపించారు.

దీంతో ఆమె ప‌క్షానే ష‌ర్మిల మాట్లాడే అవ‌కాశం ఉంటుంద‌ని భావించిన వారు ఉన్నారు. అలాకాదు.. జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు ఆమె కూడా.. చెబుతార‌ని అన్న‌వారు కూడా వైసీపీలో ఉన్నారు. మొత్తానికి విజ‌య‌మ్మ ఎవ‌రి వైపు నిలుస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

తాజాగా రాసిన బ‌హిరంగ లేఖ‌లో విజ‌య‌మ్మ త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పుకొచ్చారు. అయితే.. ఆమె ఎవ‌రి ప‌క్షమో నిల‌బ‌డ‌కుండా.. కుటుంబ ప‌క్షానే నిలిచార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇద్ద‌రూ బిడ్డ‌లూ స‌మానం అని చెప్పిన ఆమె.. ఇరువురి ప‌క్షానా వ‌కాల్తా పుచ్చుకున్నారు.

ఈ విష‌యంలో వేలు పెట్టిన పెద్ద‌ల‌పైనా.. ఈ క్ర‌మంలో వారు చెప్పిన సుద్దుల‌పైనే విజ‌య‌మ్మ ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వైఎస్ ఉన్న‌ప్పుడు ఆస్తులు పంప‌కాలు జ‌రిగిపోయాయ‌న్న వాద‌న ఇప్పుడు ప‌టాపంచ‌లు అయిపోయింది. అలా అప్ప‌ట్లో జ‌ర‌గ‌లేద‌ని, ఆస్తులు స‌మానంగా పంచాల‌ని అనుకున్న స‌మ‌యంలోనే ఆయ‌న మృతి చెందార‌ని విజ‌య‌మ్మ చెప్ప‌డం ద్వారా.. పెద్ద ప్ర‌శ్న‌కు అంతే పెద్ద స‌మాధానం వ‌చ్చిన‌ట్ట‌యింది.

ఇక‌, ఇద్ద‌రూ బిడ్డ‌లూ త‌న‌కు స‌మాన‌మ‌ని చెప్పిన విజ‌య‌మ్మ‌.. పాప‌కు అన్యాయం జ‌రిగింద‌ని చెప్ప‌డం ద్వారా.. నిజంవైపు నిల‌బడ్డార‌నే వాద‌న వినిపించారు. అదేవిధంగా 200 కోట్ల‌రూపాయ‌ల డివిడెండును అన్న ప్రేమ‌తో చెల్లికి ఇచ్చార‌న్న వాద‌న‌ను కూడా తోసిపుచ్చారు.

ఇది ఆమెకు రావాల్సిన వాటానేన‌ని చెప్పుకొచ్చారు. ఉమ్మ‌డి ఆస్తులు ఇంకా పంచుకోలేద‌ని చెప్ప‌డం ద్వారా.. ఆస్తుల వివాదం నిజ‌మేన‌ని నిర్దిష్టంగా తేల్చేశారు. రాజ‌కీయాల్లో జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే పాప‌(ష‌ర్మిల‌) న‌డిచింద‌ని చెప్ప‌డం ద్వారా.. రాజ‌కీయంగా కూడా ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు లేవ‌ని విజ‌య‌మ్మ తీర్మానించిన‌ట్టు అయింది. మొత్తంగా చూస్తే.. విజ‌య‌మ్మ‌.. ఎవ‌రి ప‌క్ష‌మూ కాకుండా.. వైఎస్ కుటుంబం ప‌క్షానే నిల‌బ‌డ్డార‌నేది ఈ లేఖ ద్వారా స్ప‌ష్టం చేశారు.

This post was last modified on October 30, 2024 9:57 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

17 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

7 hours ago