తెలంగాణ రాజకీయాల్లో జున్వాడ రేవ్ పార్టీ(పోలీసులు చెబుతున్న ప్రకారం) వ్యవహారం తీవ్ర రగడకు దారి తీసింది. రేవ్ పార్టీ అనంతరం జరిగిన పరిణామాలపై మాజీ సీఎం కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక, రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించడం.. ఆయన కోసం పోలీసులు గాలిస్తుండడం కూడా తెలిసిందే. మరోవైపు ఈ కేసులో కొకైన్ తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ తనపై పోలీసులు అక్రమ కేసు పెట్టారని యూటర్న్ తీసుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సర్కారు మాత్రం మౌనంగా ఉంది. దీనిపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఇదిలావుంటే.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సర్కారు తీరుపైనా.. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపైనా నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో రాక్షస క్రీడలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తమను ఏదో ఒకరకంగా ఇరికించేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. దీపావళి పండుగను పురస్కరించుకుని దావత్ ఇస్తే తప్పా? అని నిలదీశారు.
దీనిలో ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నది ఆయన చేసిన ఆరోపణ. తమపై రాజకీయాలు చేయడం మానుకుని.. రైతులను ఆదుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ టార్గెట్ రాజకీయాలపై చూపిస్తున్న శ్రద్ధ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్న అంశంపై ఎందుకు చూపించరని ఆయన సర్కారును ప్రశ్నించారు. అన్నదాతల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు.
రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నారని చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని.. రేవ్ పార్టీల పేరుతో రేయింబవళ్లు తమను వెంటాడడం మానుకోవాలని వ్యాఖ్యానించారు.
This post was last modified on October 28, 2024 7:38 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…