తెలంగాణ రాజకీయాల్లో జున్వాడ రేవ్ పార్టీ(పోలీసులు చెబుతున్న ప్రకారం) వ్యవహారం తీవ్ర రగడకు దారి తీసింది. రేవ్ పార్టీ అనంతరం జరిగిన పరిణామాలపై మాజీ సీఎం కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక, రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించడం.. ఆయన కోసం పోలీసులు గాలిస్తుండడం కూడా తెలిసిందే. మరోవైపు ఈ కేసులో కొకైన్ తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ తనపై పోలీసులు అక్రమ కేసు పెట్టారని యూటర్న్ తీసుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సర్కారు మాత్రం మౌనంగా ఉంది. దీనిపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఇదిలావుంటే.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సర్కారు తీరుపైనా.. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపైనా నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో రాక్షస క్రీడలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తమను ఏదో ఒకరకంగా ఇరికించేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. దీపావళి పండుగను పురస్కరించుకుని దావత్ ఇస్తే తప్పా? అని నిలదీశారు.
దీనిలో ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నది ఆయన చేసిన ఆరోపణ. తమపై రాజకీయాలు చేయడం మానుకుని.. రైతులను ఆదుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ టార్గెట్ రాజకీయాలపై చూపిస్తున్న శ్రద్ధ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్న అంశంపై ఎందుకు చూపించరని ఆయన సర్కారును ప్రశ్నించారు. అన్నదాతల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు.
రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నారని చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని.. రేవ్ పార్టీల పేరుతో రేయింబవళ్లు తమను వెంటాడడం మానుకోవాలని వ్యాఖ్యానించారు.
This post was last modified on October 28, 2024 7:38 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…