వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య తారస్థాయిలో చోటు చేసుకున్న ఆస్తుల వివాదాన్ని కూటమి పార్టీలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాయి. గత 10 రోజులుగా ఈ ఆస్తుల వివాదం మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అవుతోంది.
ఇది తమకు రాజకీయంగా మేలు చేస్తుందని టీడీపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అన్న మోసంపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని అంటున్నారు.
ఇక, ప్రజలలోకి షర్మిలకు జరిగిన అన్యాయాన్ని రాజకోణంలో ప్రచారం చేసేందుకు కూడా కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. చెల్లికే న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రంలో మహిళలకు న్యాయం ఏం చేస్తాడంటూ.. ఇప్పటికే మంత్రి అనిత, నిమ్మల రామానాయుడు వంటివారు ఆక్షేపించారు.
ఈ విషయం లో తమకు సంబంధం ఏంటని సీఎం చంద్రబాబు ప్రకటించినా.. అవకాశం వస్తే మాత్రం వదిలి పెట్టు కుండా ఆడేసుకునేందుకు కూటమి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.
ఇక, మరోవైపు.. సర్కారు పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఈ వివాదాల కారణంగా హైలెట్ కాకపోవడం మరో కలిసి వస్తున్న విషయం. వాస్తవానికి ఈ వివాదం లేకపోయి ఉంటే.. కేంద్రం నుంచి రావాల్సిన వరదసాయంపై ఉద్యమించేందుకు వైసీపీ సన్నద్ధమైంది.
కానీ, ఈ వివాదంతో అది మరుగున పడింది. ఇది కూటమికి మేలు చేసినట్టేకదా! ఇక, ఇసుక, మద్యంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నా యని.. వాటిపైనా ఉద్యమించేందుకు వైసీపీ ప్లాన్ చేసింది. కానీ, ఈ ఆస్తుల వివాదంతో అది కూడా కనుమరుగైంది.
మరీ ముఖ్యంగా గత వారంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మహిళలపై జరిగిన దారుణాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిరసనలు, ధర్నాలకు జగన్ పిలుపు ఇవ్వాలని కూడా అనుకున్నారు.
కానీ, ఇంతలోనే షర్మిల పేల్చిన ఆస్తుల బాంబు సెగల నుంచి వైసీపీ కోలుకోలేదు. దీంతో ఈ పరిణామాలు కూడా నిలిచిపోయాయి. మొత్తంగా చూస్తే..అ టు రాజకీయంగా ఇటు పాలన పరంగాకూడా.. అన్నా చెల్లెళ్ల ఆస్తుల వివాదం కూటమికి కలిసి వస్తోందని చెబుతున్నారు.
This post was last modified on October 28, 2024 5:41 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…