వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య తారస్థాయిలో చోటు చేసుకున్న ఆస్తుల వివాదాన్ని కూటమి పార్టీలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాయి. గత 10 రోజులుగా ఈ ఆస్తుల వివాదం మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అవుతోంది.
ఇది తమకు రాజకీయంగా మేలు చేస్తుందని టీడీపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అన్న మోసంపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని అంటున్నారు.
ఇక, ప్రజలలోకి షర్మిలకు జరిగిన అన్యాయాన్ని రాజకోణంలో ప్రచారం చేసేందుకు కూడా కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. చెల్లికే న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రంలో మహిళలకు న్యాయం ఏం చేస్తాడంటూ.. ఇప్పటికే మంత్రి అనిత, నిమ్మల రామానాయుడు వంటివారు ఆక్షేపించారు.
ఈ విషయం లో తమకు సంబంధం ఏంటని సీఎం చంద్రబాబు ప్రకటించినా.. అవకాశం వస్తే మాత్రం వదిలి పెట్టు కుండా ఆడేసుకునేందుకు కూటమి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.
ఇక, మరోవైపు.. సర్కారు పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఈ వివాదాల కారణంగా హైలెట్ కాకపోవడం మరో కలిసి వస్తున్న విషయం. వాస్తవానికి ఈ వివాదం లేకపోయి ఉంటే.. కేంద్రం నుంచి రావాల్సిన వరదసాయంపై ఉద్యమించేందుకు వైసీపీ సన్నద్ధమైంది.
కానీ, ఈ వివాదంతో అది మరుగున పడింది. ఇది కూటమికి మేలు చేసినట్టేకదా! ఇక, ఇసుక, మద్యంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నా యని.. వాటిపైనా ఉద్యమించేందుకు వైసీపీ ప్లాన్ చేసింది. కానీ, ఈ ఆస్తుల వివాదంతో అది కూడా కనుమరుగైంది.
మరీ ముఖ్యంగా గత వారంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మహిళలపై జరిగిన దారుణాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిరసనలు, ధర్నాలకు జగన్ పిలుపు ఇవ్వాలని కూడా అనుకున్నారు.
కానీ, ఇంతలోనే షర్మిల పేల్చిన ఆస్తుల బాంబు సెగల నుంచి వైసీపీ కోలుకోలేదు. దీంతో ఈ పరిణామాలు కూడా నిలిచిపోయాయి. మొత్తంగా చూస్తే..అ టు రాజకీయంగా ఇటు పాలన పరంగాకూడా.. అన్నా చెల్లెళ్ల ఆస్తుల వివాదం కూటమికి కలిసి వస్తోందని చెబుతున్నారు.
This post was last modified on %s = human-readable time difference 5:41 am
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో నేతలు కుత కుతలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ వ్యవహారం తెరమీదికి వచ్చినట్టే వచ్చి.. మళ్లీ తెరమరుగు…
తరచుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే బహుభాషా నటుడు ప్రకాష్రాజ్.. మరోసారి పవన్పై విమర్శలు గుప్పించారు.…
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా అదరగొట్టాక.. అందరికీ పాన్ ఇండియా పిచ్చి పట్టుకుంది. మిడ్ రేంజ్, చిన్న…
"ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఎవరికి నచ్చినట్టు వారు చేయడానికి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించడానికి నిధులు దారి…
ఏపీలోని జనసేన తరహా పార్టీ తమిళనాడులోనూ ఆవిర్భవించింది. ప్రముఖ తమిళ హీరో విజయ్.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల…
సాయిధరమ్ తేజ్ కెరీర్లో బిగ్టెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం.. విరూపాక్ష. హార్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం మాంచి…