వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య తారస్థాయిలో చోటు చేసుకున్న ఆస్తుల వివాదాన్ని కూటమి పార్టీలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాయి. గత 10 రోజులుగా ఈ ఆస్తుల వివాదం మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అవుతోంది.
ఇది తమకు రాజకీయంగా మేలు చేస్తుందని టీడీపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అన్న మోసంపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని అంటున్నారు.
ఇక, ప్రజలలోకి షర్మిలకు జరిగిన అన్యాయాన్ని రాజకోణంలో ప్రచారం చేసేందుకు కూడా కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. చెల్లికే న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రంలో మహిళలకు న్యాయం ఏం చేస్తాడంటూ.. ఇప్పటికే మంత్రి అనిత, నిమ్మల రామానాయుడు వంటివారు ఆక్షేపించారు.
ఈ విషయం లో తమకు సంబంధం ఏంటని సీఎం చంద్రబాబు ప్రకటించినా.. అవకాశం వస్తే మాత్రం వదిలి పెట్టు కుండా ఆడేసుకునేందుకు కూటమి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.
ఇక, మరోవైపు.. సర్కారు పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఈ వివాదాల కారణంగా హైలెట్ కాకపోవడం మరో కలిసి వస్తున్న విషయం. వాస్తవానికి ఈ వివాదం లేకపోయి ఉంటే.. కేంద్రం నుంచి రావాల్సిన వరదసాయంపై ఉద్యమించేందుకు వైసీపీ సన్నద్ధమైంది.
కానీ, ఈ వివాదంతో అది మరుగున పడింది. ఇది కూటమికి మేలు చేసినట్టేకదా! ఇక, ఇసుక, మద్యంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నా యని.. వాటిపైనా ఉద్యమించేందుకు వైసీపీ ప్లాన్ చేసింది. కానీ, ఈ ఆస్తుల వివాదంతో అది కూడా కనుమరుగైంది.
మరీ ముఖ్యంగా గత వారంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మహిళలపై జరిగిన దారుణాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిరసనలు, ధర్నాలకు జగన్ పిలుపు ఇవ్వాలని కూడా అనుకున్నారు.
కానీ, ఇంతలోనే షర్మిల పేల్చిన ఆస్తుల బాంబు సెగల నుంచి వైసీపీ కోలుకోలేదు. దీంతో ఈ పరిణామాలు కూడా నిలిచిపోయాయి. మొత్తంగా చూస్తే..అ టు రాజకీయంగా ఇటు పాలన పరంగాకూడా.. అన్నా చెల్లెళ్ల ఆస్తుల వివాదం కూటమికి కలిసి వస్తోందని చెబుతున్నారు.
This post was last modified on October 28, 2024 5:41 am
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…