“ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఎవరికి నచ్చినట్టు వారు చేయడానికి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించడానికి నిధులు దారి మళ్లించడానికి. ఇది కూటమి ప్రభుత్వం అన్న విషయం గుర్తు పెట్టుకోండి. ప్రతి పైసాకు.. లెక్క ఉంటుంది. ప్రతి రూపాయికీ జవాబుదారీ తనం ఉంటుంది” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తాజాగా ఆయన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులపై ఆరా తీశారు.
ఆయా నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారో.. పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పవన్ సూచించారు. “అందుబాటులో అంటే.. అర్ధం కాని వివరాలు, ఇంగ్లీష్లో ఉండడం కాదు. పదో తరగతి చదువుకున్న వారికి కూడా.. మనం ఏం చేస్తున్నామో.. చదవగానే అర్ధం కావాలి. ప్రతి రూపాయికీ లెక్క చూపించాలి. ప్రతి గ్రామంలోనూ చేపట్టిన పనులు.. ఎవరు చేస్తున్నారు. ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేస్తున్నాం అనే వివరాలు స్పష్టంగా ఉండాలి” అని పవన్ ఆదేశించారు.
గతంలో వైసీపీ హయాంలో కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులను దారి మళ్లించారన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కూటమి సర్కారుపై గ్రామీణులు చాలానే ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. వారి ఆశలు వమ్ముకావడానికి వీల్లేదని.. ప్రతి రూపాయినీ వారికి చెప్పాలని అన్నారు. కేంద్రం నుంచి వస్తున్న ప్రతిరూపాయీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బదలాయించాలన్నారు. అదేవిధంగా అధికారులు జవాబు దారీ తనంతో వ్యవహరించాలని సూచించారు.
ఇక, పల్లె -పండుగ, పంచాయతీ వారోత్సవాల్లో అనుమతించిన రహదారుల నిర్మాణం, మంచినీటి పైపు లైన్ల నిర్మాణాలకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ పనులు అత్యంత నాణ్యంగా ఉండాలని.. సొంత ఇంటికి ఎలా అయితే.. శ్రద్ధతో పనులు చేయించుకుంటారో.. అలానే ఈ పనులు కూడా ఉండాలని అధికారులకు హితవు పలికారు. ముఖ్యంగా ఇది వైసీపీ ప్రభుత్వం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పదే పదే చెప్పడం గమనార్హం.
This post was last modified on October 28, 2024 5:38 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…