తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహనం కోల్పోయారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లపై ఆయన నోరు చేసుకున్నారు. తనపై ట్రోల్స్ చేసేవారిని బట్టలూడదీసి కొడతానంటూ రెచ్చిపోయారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొందరు.. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనికి తోడు సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, హైడ్రా పనితీరుపైనా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నాయి. అయితే.. ఇది నేటి నెట్ ప్రపంచంలో కామన్. కానీ, జగ్గారెడ్డి మాత్రం ఫైరైపోయారు.
బీఆర్ ఎస్ పార్టీ దండుపాళ్యంగా మారి.. ఈ కామెంట్లు చేస్తోందని ఆయన విమర్శించారు. తనపై ట్రోలింగ్ చేసిన వారిని వదిలి పెట్టేది లేదని చెప్పుకొచ్చారు. వారికి లీగల్గా నోటీసులు ఇవ్వడంతోపాటు.. దొరికితే బట్టలు ఊడదీసి బాదేస్తానని హెచ్చరించారు. “ఎందుకయ్యా మీరు చేసేది? మమ్మల్ని అనేముందట.. మీ నాయకుల తీరుఎలా ఉందో చూసుకోండి” అని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా కొందరు ట్రోల్ చేస్తున్నారని. ఇది సరికాదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపట్ల గౌరవ భావం ఉండాలని సూచించారు.
కానీ, బీఆర్ ఎస్ దండుపాళ్యం బ్యాచ్.. ముఖ్యమంత్రి సహా మంత్రులపైనా నోటికి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారని చెప్పారు. అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొంత మంది ఉన్నారు. మేం ఏం మాట్లాడినా.. ఎడిట్ చేసి అతికిస్తున్నారు. ఇది సరికాదు. మంచి పద్దతికాదు. ఇకనైనా మారండి” అని వ్యాఖ్యానించారు. తాను అనని మాటలను కూడా అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు కామనేనని.. కానీ, వ్యక్తిగతంగా ఎందుకు దూషిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మారకపోతే.. మారేలా చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు.
This post was last modified on October 27, 2024 4:30 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…