వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా .. తీవ్ర చర్చనీయాంశంగా మారిన షర్మిల-జగన్ ఆస్తుల విషయంపై మీడియా సమావేశం పెట్టారు. దీనికి 20 గంటల ముందే.. ఆయన పీఏ.. పెద్ద ఎత్తున మీడియా వర్గాల్లో ప్రచారం కూడా చేశారు. ఇక, శనివారం షర్మిల మీడియా ముందుకు వచ్చి.. కన్నీరు పెట్టుకున్న తర్వాత వెంటనే సాయిరెడ్డి ప్రెస్ మీట్ ఉంటుందన్న వార్త హైప్ పెంచేసింది.
ఏం మాట్లాడతారో.. సాయిరెడ్డి ఏం చెబుతారో.. ఎలాంటి బాంబు పేలుస్తారో.. అని ఎక్కువ మంది టైం చూసుకుని మరీ ఈ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూశారు. ఎందుకంటే.. రాజారెడ్డి హయాం నుంచి సాయిరెడ్డికి వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆడిటర్గా ఆయన వృత్తి జీవితాన్ని ప్రారంభిం చిన తర్వాత.. రాజారెడ్డి కుటుంబంతోనే ఆయన అనుబంధం పెంచుకుని.. వారి వ్యాపారాలు వ్యవహారా లు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సాయిరెడ్డి.. ప్రస్తుత ఆస్తుల వివాదంలో ఎలా రియాక్ట్ అవుతారనే విషయం అందరికీ ఉత్కంఠగామారింది. కానీ, సాయిరెడ్డి మాత్రం ఈ అంచనాలను చేరుకోకపోగా.. పాత సంగతులు తవ్వారు. షర్మిలను కార్నర్ చేసుకుని.. ఆయన రాజకీయంగా విమర్శలు గుప్పించారు. వైఎస్ ఆస్తుల విభజన ఎప్పుడో అయిపోయిందని.. జగన్ తన చెల్లిపై ఉన్న ప్రగాఢ ప్రమేతోనే ఆస్తులు ఇప్పుడు వాటా ఇవ్వాలని అనుకుంటున్నారని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
మొత్తంగా చూస్తే.. సాయిరెడ్డి ప్రెస్ మీట్లో పసలేదన్నది స్పష్టంగా కనిపించింది. ఏదో జగన్ కోసం.. జగన్ చేత.. అన్నట్టుగా ఆయన మీడియా ముందు కూడా రచ్చ చేశారన్న భావన అయితే కనిపించింది ఎప్పుడో 2009లో దుర్మరణం చెందిన వైఎస్ మృతి ఘటనకు టీడీపీ నాయకులకు లింకులు పెట్టారు. అంతేకాదు.. కాంగ్రెస్తోనూ లింకులు కలిపారు. అసలు జగన్ ఎందుకు ఆస్తుల విషయంలో ఇంత మంకు పట్టుపడుతున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన కప్పిపుచ్చి.. మీడియా మీటింగును మమ అనిపించారు.
This post was last modified on October 27, 2024 4:04 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…