వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా .. తీవ్ర చర్చనీయాంశంగా మారిన షర్మిల-జగన్ ఆస్తుల విషయంపై మీడియా సమావేశం పెట్టారు. దీనికి 20 గంటల ముందే.. ఆయన పీఏ.. పెద్ద ఎత్తున మీడియా వర్గాల్లో ప్రచారం కూడా చేశారు. ఇక, శనివారం షర్మిల మీడియా ముందుకు వచ్చి.. కన్నీరు పెట్టుకున్న తర్వాత వెంటనే సాయిరెడ్డి ప్రెస్ మీట్ ఉంటుందన్న వార్త హైప్ పెంచేసింది.
ఏం మాట్లాడతారో.. సాయిరెడ్డి ఏం చెబుతారో.. ఎలాంటి బాంబు పేలుస్తారో.. అని ఎక్కువ మంది టైం చూసుకుని మరీ ఈ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూశారు. ఎందుకంటే.. రాజారెడ్డి హయాం నుంచి సాయిరెడ్డికి వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆడిటర్గా ఆయన వృత్తి జీవితాన్ని ప్రారంభిం చిన తర్వాత.. రాజారెడ్డి కుటుంబంతోనే ఆయన అనుబంధం పెంచుకుని.. వారి వ్యాపారాలు వ్యవహారా లు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సాయిరెడ్డి.. ప్రస్తుత ఆస్తుల వివాదంలో ఎలా రియాక్ట్ అవుతారనే విషయం అందరికీ ఉత్కంఠగామారింది. కానీ, సాయిరెడ్డి మాత్రం ఈ అంచనాలను చేరుకోకపోగా.. పాత సంగతులు తవ్వారు. షర్మిలను కార్నర్ చేసుకుని.. ఆయన రాజకీయంగా విమర్శలు గుప్పించారు. వైఎస్ ఆస్తుల విభజన ఎప్పుడో అయిపోయిందని.. జగన్ తన చెల్లిపై ఉన్న ప్రగాఢ ప్రమేతోనే ఆస్తులు ఇప్పుడు వాటా ఇవ్వాలని అనుకుంటున్నారని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
మొత్తంగా చూస్తే.. సాయిరెడ్డి ప్రెస్ మీట్లో పసలేదన్నది స్పష్టంగా కనిపించింది. ఏదో జగన్ కోసం.. జగన్ చేత.. అన్నట్టుగా ఆయన మీడియా ముందు కూడా రచ్చ చేశారన్న భావన అయితే కనిపించింది ఎప్పుడో 2009లో దుర్మరణం చెందిన వైఎస్ మృతి ఘటనకు టీడీపీ నాయకులకు లింకులు పెట్టారు. అంతేకాదు.. కాంగ్రెస్తోనూ లింకులు కలిపారు. అసలు జగన్ ఎందుకు ఆస్తుల విషయంలో ఇంత మంకు పట్టుపడుతున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన కప్పిపుచ్చి.. మీడియా మీటింగును మమ అనిపించారు.
This post was last modified on October 27, 2024 4:04 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…