Political News

విధిలేక‌.. వైసీపీలో..!!

వైసీపీలో ఒక్కొక్క నేత‌ది కాదు.. గుంపులుగానే అంద‌రిదీ ఒక్క‌టే బాధ‌!  నిజంగానే అంద‌రి నోటా ఇదే మాట వినిపిస్తోంది. జ‌గ‌న్ ఒంటెత్తు పోక‌డ‌ల‌ను కొంద‌రు నాయ‌కులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక పోతున్నా రు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌, డెత్ స‌ర్టిఫికెట్ వ‌ర‌కు.. అన్నింటిపై ఆయ‌న ఫొటోలు వేసుకోవ‌డాన్ని అనేక మంది నాయ‌కులు తిర‌స్క‌రించారు. ఈ విష‌యం అధికారం కోల్పోయాక చెప్పుకొచ్చారు. ఇది పాల‌న ప‌రంగా జ‌రిగిన వ్య‌వ‌హారం.

ఇక‌, ఇప్పుడు జిల్లాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. అయితే.. ఎంతో మంది సీనియ‌ర్‌లు, పార్టీ కోసం ప‌నిచేసిన వారు ఉన్నా.. వారిని వ‌దిలేసి.. కొంద‌రికి మాత్రమే ఈ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డంపై నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. ఒక్క క్ష‌ణం కూడా.. వైసీపీలో ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కొంద‌రు చెబుతున్నారు. కానీ, వారు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేకుండా పోయింది. దీనికి కార‌ణం.. వ‌చ్చినా.. వారిని చేర్చుకునే పార్టీలు లేవు. స‌రైన వేదిక‌లు కూడా క‌నిపించ‌డం లేదు.

కాట‌సాని రాంభూపాల్ రెడ్డి. జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్న క‌ర్నూలు నాయ‌కుడు. గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి.. వైసీపీని త‌క్ష‌ణం వ‌దిలేయాల‌ని నిర్ణ‌యించుకున్న నాయ‌కుడు. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని కాచుకుని కూర్చున్న నాయ‌కుడు. మాజీ హోం మంత్రి తానేటి వ‌నిత‌.. ఎవ‌రైనా పిలుపు ఇస్తే చాలు కండువా మార్చేయాల‌న్న ఆస‌క్తిగా ఉన్న నాయ‌కురాలు. పుష్ప శ్రీవాణి.. ఏ చిన్న ఛాన్స్ చిక్కినా.. జ‌గ‌న‌న్న‌కు బై చెప్పాల‌ని  చూస్తున్న మాజీ మంత్రి.

వీరు మ‌చ్చుకు కొంద‌రు మాత్ర‌మే. ఒకింత లోప‌లికి వెళ్లి లోతుగా చూస్తే.. ఈ జాబితా భారీగానే ఉంటుంద ని తెలుస్తోంది. కానీ, వీరికి అవ‌కాశం లేదు. గ‌తంలో వీరు వ్య‌వ‌హ‌రించిన తీరులేదా.. ప్ర‌జ‌ల్లో పోయిన ప‌ర‌ప‌తి.. రాజ‌కీయంగా చేసుకున్న కొన్ని త‌ప్పుల కార‌ణంగా కూట‌మి పార్టీలు ఏవీ కూడా.. వీరిని ద‌రి చేర‌నివ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో విధిలేక‌.. వైసీపీలో కొన‌సాగుతున్నారు. అందుకే.. ఎంత భూకంపం వ‌చ్చినా మాట్లాడ‌డంలేదు. ఎంత తుఫాను చెల‌రేగినా.. నోరు విప్ప‌డం లేదు. అందుకే.. నాయ‌కులు అన్న‌వారు.. చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాలి. లేక‌పోతే.. ఇదే ప‌రిస్తితి!!

This post was last modified on October 27, 2024 9:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

43 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago