వైసీపీలో ఒక్కొక్క నేతది కాదు.. గుంపులుగానే అందరిదీ ఒక్కటే బాధ! నిజంగానే అందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. జగన్ ఒంటెత్తు పోకడలను కొందరు నాయకులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నా రు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ వరకు.. అన్నింటిపై ఆయన ఫొటోలు వేసుకోవడాన్ని అనేక మంది నాయకులు తిరస్కరించారు. ఈ విషయం అధికారం కోల్పోయాక చెప్పుకొచ్చారు. ఇది పాలన పరంగా జరిగిన వ్యవహారం.
ఇక, ఇప్పుడు జిల్లాలకు ఇంచార్జ్లను నియమించారు. అయితే.. ఎంతో మంది సీనియర్లు, పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నా.. వారిని వదిలేసి.. కొందరికి మాత్రమే ఈ పదవులు కట్టబెట్టడంపై నాయకులు రగిలిపోతున్నారు. ఒక్క క్షణం కూడా.. వైసీపీలో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని కొందరు చెబుతున్నారు. కానీ, వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీనికి కారణం.. వచ్చినా.. వారిని చేర్చుకునే పార్టీలు లేవు. సరైన వేదికలు కూడా కనిపించడం లేదు.
కాటసాని రాంభూపాల్ రెడ్డి. జగన్పై నిప్పులు చెరుగుతున్న కర్నూలు నాయకుడు. గడికోట శ్రీకాంత్ రెడ్డి.. వైసీపీని తక్షణం వదిలేయాలని నిర్ణయించుకున్న నాయకుడు. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వెంటనే బయటకు వచ్చేయాలని కాచుకుని కూర్చున్న నాయకుడు. మాజీ హోం మంత్రి తానేటి వనిత.. ఎవరైనా పిలుపు ఇస్తే చాలు కండువా మార్చేయాలన్న ఆసక్తిగా ఉన్న నాయకురాలు. పుష్ప శ్రీవాణి.. ఏ చిన్న ఛాన్స్ చిక్కినా.. జగనన్నకు బై చెప్పాలని చూస్తున్న మాజీ మంత్రి.
వీరు మచ్చుకు కొందరు మాత్రమే. ఒకింత లోపలికి వెళ్లి లోతుగా చూస్తే.. ఈ జాబితా భారీగానే ఉంటుంద ని తెలుస్తోంది. కానీ, వీరికి అవకాశం లేదు. గతంలో వీరు వ్యవహరించిన తీరులేదా.. ప్రజల్లో పోయిన పరపతి.. రాజకీయంగా చేసుకున్న కొన్ని తప్పుల కారణంగా కూటమి పార్టీలు ఏవీ కూడా.. వీరిని దరి చేరనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో విధిలేక.. వైసీపీలో కొనసాగుతున్నారు. అందుకే.. ఎంత భూకంపం వచ్చినా మాట్లాడడంలేదు. ఎంత తుఫాను చెలరేగినా.. నోరు విప్పడం లేదు. అందుకే.. నాయకులు అన్నవారు.. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకపోతే.. ఇదే పరిస్తితి!!
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…