Political News

ఒక్కొక్కరికీ వెయ్యి.. చంద్ర‌బాబు టార్గెట్!

టీడీపీ జాతీయ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా త‌మ్ముళ్ల‌కు స‌రికొత్త టార్గెట్ విధించారు. ఒక్కొక్కరికీ వెయ్యి చొప్పున స‌భ్య‌త్వాల న‌మోదు బాధ్య‌త‌ల‌ను ఆయ‌న అప్ప‌గించారు. గ‌తంలో ఈ బాధ్య‌త 100-200 మ‌ధ్య మాత్ర‌మే ఉండ‌గా.. ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు చేయ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌నీసంలో క‌నీసం 20 ల‌క్ష‌ల మందికి స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

తాజాగా టీడీపీస‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు ప్రారంభించారు. దీనికి ముందే ఆయ‌న పార్టీ నాయ‌కులకు వెయ్యి చొప్పున స‌భ్య‌త్వాలు న‌మోదు చేయించాల‌న్న టార్గెట్ విధించారు. దీనికి గాను నెల రోజుల స‌మ‌యం కేటాయించారు. దీనికి తోడు ఆన్‌లైన్ స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ వేరేగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 30 వేల మంది ముఖ్య నాయ‌కులు ఉన్నారు. వీరంతా ఒక్కొక్క‌రు వెయ్యి చొప్పున స‌భ్య‌త్వాలు న‌మోదు చేయించాల‌న్న‌ది టార్గెట్‌.

ఎందుకీ టార్గెట్‌..

రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ్రాఫ్ విజృంభించింది. అమ‌రావ‌తి ప‌రుగులు, ప్రాజెక్టుల నిర్మాణాలు, ర‌హ‌దారుల అభివృద్ది వంటివాటిని ఎక్కువ‌గా ప్రాధాన్యం క‌ల్పిస్తున్నారు. దీనికితోడు ఉపాధి క‌ల్ప‌న‌, ఉద్యోగాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తు ముఖ చిత్రం మార‌నుంద‌న్న సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్తున్నాయి. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వంద‌, 130 రోజుల్లో ప్ర‌భుత్వం చేసిన పాల‌న ను కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు.

ఫ‌లితంగా.. టీడీపీపై సానుకూల దృక్ఫ‌థం ఏర్ప‌డింద‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా ఉంది. మ‌రోవైపు వైసీపీ నుంచి వ‌ల‌స‌లు పెరుగుతుండ‌డం.. ఆ పార్టీపై సానుభూతి స‌న్న‌గిల్లుతున్న నేప‌థ్యంలో టీడీపీపుంజుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యంగా కూడా అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఒక్కొక్క‌రికీ వెయ్యి మందిని చేర్చించే బాధ్య‌త‌ను అప్ప‌గించారు. ఈ టార్గెట్‌ను నెల రోజుల్లో పూర్తి చేసిన వారికి కీల‌క ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్న‌ది పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 26, 2024 8:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

24 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago