టీడీపీ జాతీయ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తమ్ముళ్లకు సరికొత్త టార్గెట్ విధించారు. ఒక్కొక్కరికీ వెయ్యి చొప్పున సభ్యత్వాల నమోదు బాధ్యతలను ఆయన అప్పగించారు. గతంలో ఈ బాధ్యత 100-200 మధ్య మాత్రమే ఉండగా.. ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కనీసంలో కనీసం 20 లక్షల మందికి సభ్యత్వం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
తాజాగా టీడీపీసభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. దీనికి ముందే ఆయన పార్టీ నాయకులకు వెయ్యి చొప్పున సభ్యత్వాలు నమోదు చేయించాలన్న టార్గెట్ విధించారు. దీనికి గాను నెల రోజుల సమయం కేటాయించారు. దీనికి తోడు ఆన్లైన్ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేరేగా ఉంటుందని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 30 వేల మంది ముఖ్య నాయకులు ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరు వెయ్యి చొప్పున సభ్యత్వాలు నమోదు చేయించాలన్నది టార్గెట్.
ఎందుకీ టార్గెట్..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫ్ విజృంభించింది. అమరావతి పరుగులు, ప్రాజెక్టుల నిర్మాణాలు, రహదారుల అభివృద్ది వంటివాటిని ఎక్కువగా ప్రాధాన్యం కల్పిస్తున్నారు. దీనికితోడు ఉపాధి కల్పన, ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ముఖ చిత్రం మారనుందన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇక, ఇప్పటి వరకు ఈ వంద, 130 రోజుల్లో ప్రభుత్వం చేసిన పాలన ను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.
ఫలితంగా.. టీడీపీపై సానుకూల దృక్ఫథం ఏర్పడిందన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. మరోవైపు వైసీపీ నుంచి వలసలు పెరుగుతుండడం.. ఆ పార్టీపై సానుభూతి సన్నగిల్లుతున్న నేపథ్యంలో టీడీపీపుంజుకునేందుకు ఇదే సరైన సమయంగా కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరికీ వెయ్యి మందిని చేర్చించే బాధ్యతను అప్పగించారు. ఈ టార్గెట్ను నెల రోజుల్లో పూర్తి చేసిన వారికి కీలక పదవులు దక్కుతాయన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 26, 2024 8:57 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…