Political News

ఒక్కొక్కరికీ వెయ్యి.. చంద్ర‌బాబు టార్గెట్!

టీడీపీ జాతీయ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా త‌మ్ముళ్ల‌కు స‌రికొత్త టార్గెట్ విధించారు. ఒక్కొక్కరికీ వెయ్యి చొప్పున స‌భ్య‌త్వాల న‌మోదు బాధ్య‌త‌ల‌ను ఆయ‌న అప్ప‌గించారు. గ‌తంలో ఈ బాధ్య‌త 100-200 మ‌ధ్య మాత్ర‌మే ఉండ‌గా.. ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు చేయ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌నీసంలో క‌నీసం 20 ల‌క్ష‌ల మందికి స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

తాజాగా టీడీపీస‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు ప్రారంభించారు. దీనికి ముందే ఆయ‌న పార్టీ నాయ‌కులకు వెయ్యి చొప్పున స‌భ్య‌త్వాలు న‌మోదు చేయించాల‌న్న టార్గెట్ విధించారు. దీనికి గాను నెల రోజుల స‌మ‌యం కేటాయించారు. దీనికి తోడు ఆన్‌లైన్ స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ వేరేగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 30 వేల మంది ముఖ్య నాయ‌కులు ఉన్నారు. వీరంతా ఒక్కొక్క‌రు వెయ్యి చొప్పున స‌భ్య‌త్వాలు న‌మోదు చేయించాల‌న్న‌ది టార్గెట్‌.

ఎందుకీ టార్గెట్‌..

రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ్రాఫ్ విజృంభించింది. అమ‌రావ‌తి ప‌రుగులు, ప్రాజెక్టుల నిర్మాణాలు, ర‌హ‌దారుల అభివృద్ది వంటివాటిని ఎక్కువ‌గా ప్రాధాన్యం క‌ల్పిస్తున్నారు. దీనికితోడు ఉపాధి క‌ల్ప‌న‌, ఉద్యోగాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తు ముఖ చిత్రం మార‌నుంద‌న్న సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్తున్నాయి. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వంద‌, 130 రోజుల్లో ప్ర‌భుత్వం చేసిన పాల‌న ను కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు.

ఫ‌లితంగా.. టీడీపీపై సానుకూల దృక్ఫ‌థం ఏర్ప‌డింద‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా ఉంది. మ‌రోవైపు వైసీపీ నుంచి వ‌ల‌స‌లు పెరుగుతుండ‌డం.. ఆ పార్టీపై సానుభూతి స‌న్న‌గిల్లుతున్న నేప‌థ్యంలో టీడీపీపుంజుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యంగా కూడా అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఒక్కొక్క‌రికీ వెయ్యి మందిని చేర్చించే బాధ్య‌త‌ను అప్ప‌గించారు. ఈ టార్గెట్‌ను నెల రోజుల్లో పూర్తి చేసిన వారికి కీల‌క ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్న‌ది పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 26, 2024 8:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

60 minutes ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

5 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

5 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

6 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

6 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

7 hours ago