Political News

సరస్వతి పవర్ భూములపై పవన్ ఫోకస్

ఏపీ మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ సంస్థ పేరు కొద్ది రోజులుగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల, జగన్ ల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారంలో సరస్వతి పవర్ సంస్థ ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లాలో ఉన్న సరస్వతి పవర్ సంస్థ భూములపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న ఆ సంస్థ భూములకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని పల్నాడు జిల్లా యంత్రాంగంతోపాటు, అటవీ, పర్యావరణ శాఖ అధికారులను పవన్ ఆదేశించారు. జగన్ కు చెందిన సరస్వతీ పవర్ సంస్థకు 1515 ఎకరాల భూమి ఉందని, అందులో అటవీ సంపదతో పాటు వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగంతో చర్చించిన పవన్ కళ్యాణ్ ఆ భూముల్లో ప్రభుత్వ భూములు, జలవనరులు ఎంతవరకు ఉన్నాయో తెలియజేయాలని ఆదేశించారు.

దాంతోపాటు ఆ భూముల్లో అటవీ భూమి ఎంత ఉందో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాగులు, వంకలు, కొండలు ఆ భూముల్లో ఉన్నందున వాటికి పర్యావరణ అనుమతులు ఏ విధంగా ఇచ్చారె తెలియజేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డును పవన్ ఆదేశించారు. ఈ వ్యవహారంపై అటవీ, రెవెన్యూ, పిసిబి ఉన్నతాధికారులతో త్వరలోనే పవన్ కళ్యాణ్ సమీక్ష జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం చూస్తుంటే చివరకు ఆ భూముల అనుమతులు రద్దయే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా జగన్ ఆస్తిపై పవన్ ఫోకస్ పెట్టడంతో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి ఏర్పడింది.

This post was last modified on October 26, 2024 8:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

23 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

59 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago