Political News

సరస్వతి పవర్ భూములపై పవన్ ఫోకస్

ఏపీ మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ సంస్థ పేరు కొద్ది రోజులుగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల, జగన్ ల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారంలో సరస్వతి పవర్ సంస్థ ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లాలో ఉన్న సరస్వతి పవర్ సంస్థ భూములపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న ఆ సంస్థ భూములకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని పల్నాడు జిల్లా యంత్రాంగంతోపాటు, అటవీ, పర్యావరణ శాఖ అధికారులను పవన్ ఆదేశించారు. జగన్ కు చెందిన సరస్వతీ పవర్ సంస్థకు 1515 ఎకరాల భూమి ఉందని, అందులో అటవీ సంపదతో పాటు వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగంతో చర్చించిన పవన్ కళ్యాణ్ ఆ భూముల్లో ప్రభుత్వ భూములు, జలవనరులు ఎంతవరకు ఉన్నాయో తెలియజేయాలని ఆదేశించారు.

దాంతోపాటు ఆ భూముల్లో అటవీ భూమి ఎంత ఉందో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాగులు, వంకలు, కొండలు ఆ భూముల్లో ఉన్నందున వాటికి పర్యావరణ అనుమతులు ఏ విధంగా ఇచ్చారె తెలియజేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డును పవన్ ఆదేశించారు. ఈ వ్యవహారంపై అటవీ, రెవెన్యూ, పిసిబి ఉన్నతాధికారులతో త్వరలోనే పవన్ కళ్యాణ్ సమీక్ష జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం చూస్తుంటే చివరకు ఆ భూముల అనుమతులు రద్దయే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా జగన్ ఆస్తిపై పవన్ ఫోకస్ పెట్టడంతో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి ఏర్పడింది.

This post was last modified on October 26, 2024 8:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago