ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. దాదాపు పదిరోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. బిజీ షెడ్యూల్తో పాటు భారీ ఆశలతో ఆయన అగ్రరాజ్యంలో అడుగు పెట్టనున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలన్నది నారా లోకేష్ ఆశయం. ఇప్పటికే రాష్ట్రంలో పలు కంపెనీలను తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. టాటా కంపెనీతోనూ ఇటీవల చర్చించారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుపై మంతనాలు జరిపారు.
అదేవిధంగా తమిళనాడుకు చెందిన శివనాడార్ సంస్థతోనూ నారా లోకేష్ చర్చలు జరిపారు. ఇక, జపాన్ దౌత్య బృందాన్ని కూడా రెండు రోజుల కిందట కలిసి.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వాతావర ణాన్ని వివరించారు. ఈ నేపథ్యంలోనే తొలిసారి పెట్టుబడుల కోసం.. అమెరికాకు వెళ్తున్నారు. ఇక్కడి టెస్లా సహా గూగుల్, మెటా సంస్థలతో చర్చించి.. పెట్టుబడుల కోసం వారి ఒప్పించి.. మెప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే అధికారులతో కలిసి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. కానీ, ఇప్పుడు అమెరి కా పరిస్థితి రాజకీయంగా హాట్హాట్గా ఉంది. వచ్చే నెల 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగను న్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ల మూడ్ అంతా రాజకీయాల వైపే ఉంది. పైగా పెట్టుబడి దారులు కూడా.. విదేశాలకు వెళ్లాలా? అమెరికాలోనే ఉండాలా? అనే డోలాయమాన స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఎన్నికల పరిస్థితిని వారు నిశితంగా అధ్యయనం చేస్తున్నారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచే పరిస్థితి ఉంటే కనుక.. పెట్టుబడి దారులు అమెరికాలోనే ఉంటా రు. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం.. తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వర్గాలు సిద్ధంగా అయితే లేదు. ఇటీవల.. కొన్ని దేశాల ప్రతినిధులకు ఇదే అనుభవం ఎదురైంది. సో.. ఇలాంటి పరిస్థితిలో నారా లోకేష్ అమెరికా పర్యటన విజయవంతం కావాలనే కోరుకుందాం.
This post was last modified on October 24, 2024 10:01 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…