Political News

చెల్లిని కోర్టుకు లాగడం సామాన్యం కాదు జగన్ సార్: షర్మిల

ఏపీ మాజీ సీఎం జగన్, ఏపీ పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రతి ఇంట్లో చిన్న చిన్న వివాదాలు ఉంటాయని, వాటిని రాజకీయం చేయడం సరికాదని ఏపీ మాజీ సీఎం జగన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తన సోదరి షర్మిల తనకు రాజకీయంగా వ్యతిరేకంగా వెళ్తున్న నేపథ్యంలోనే ఆస్తుల విషయంలో తేడా వచ్చిందని జగన్ చెప్పిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు.

సామాన్యం అంటూనే తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని, ఇది సామాన్యమైన విషయం కాదు జగన్ సార్ అంటూ షర్మిల తన సోదరుడు జగన్ కి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. తమ కుటుంబంలో ఆస్తుల వివాదం నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని అనుకున్నామని, సామరస్యంగానే దానిని సెటిల్ చేసుకోవాలనుకున్నామని షర్మిల చెప్పారు. కానీ, సామాన్యం అంటూనే అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చారని, ఇది సామాన్య విషయం కాదని షర్మిల అన్నారు.

ఆస్తుల అటాచ్ మెంట్ అని, ఈడీ కేసులు, బెయిల్ అని జగన్ చెబుతున్నారని, కానీ సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదని షర్మిల చెప్పారు. ఈ క్రమంలోనే జగన్ కు షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. 32 కోట్ల విలువైన కంపెనీ భూమిని ఈడీ అటాచ్ చేసిందని, కానీ, సరస్వతి కంపెనీ భూములను ఈడీ ఏనాడు అటాచ్ చేయలేదని షర్మిల క్లారిటీనిచ్చారు. ఏ సమయంలో అయినా షేర్లను బదిలీ చేసుకునే అవకాశం ఉందని, 2016లో ఈ ఆస్తులు అటాచ్ చేసినందువలన షేర్లు బదిలీ జరగకూడదని జగన్ వాదిస్తున్నారని, అది సరికాదని చెప్పుకొచ్చారు.

అలా అయితే, 2019లో 100% వాటాలు బదలాయిస్తామని ఎంవోయుపై జగన్ సంతకం ఎలా చేశారని షర్మిల ప్రశ్నించారు. ఆనాడు బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా అని జగన్ కు షర్మిల సూటి ప్రశ్న సంధించారు. మరి, షర్మిల ప్రశ్నలకు జగన్ సమాధానం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on October 24, 2024 9:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

47 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago