Political News

షర్మిల లెటర్ పై స్పందించిన జగన్

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ సోషల్ మీడియా విభాగం ట్వీట్ చేయడం, ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోని తాజాగా ఈ విషయంలో టీడీపీ నేతల విమర్శలపై జగన్ స్పందించారు. తమ కుటుంబ సమస్యను రాజకీయం చేయడం ఏంటని జగన్ మండిపడ్డారు.

ఎన్నికల హామీలు నెరవేర్చని కూటమి సర్కార్… డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని జగన్ విమర్శించారు. ఈసారి తన అమ్మ, చెల్లెలు ఫోటోలు పెట్టి రాజకీయం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. టీడీపీ అక్రమాలు అన్యాయాలు బయటపెడుతున్న కారణంతోనే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని జగన్ ఆరోపించారు. కుర్లలో డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు.

కుర్లకు తాను వస్తున్నానని తెలిసి రాజకీయం చేస్తున్నారని, కుటుంబ విషయాలను రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ-5, దత్తపుత్రుడు ఇప్పటికైనా మారాలని జగన్ అన్నారు. మీ కుటుంబాల్లో ఇటువంటి గొడవలు లేవా ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉండే విషయాలే అని జగన్ చెప్పారు. వాస్తవాలను వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోవాలని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జగన్ హితవు పలికారు.

రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని, ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఇక, విజయనగరంలోని కుర్లలో డయేరియాతో చనిపోయిన వారి కుటుంబానికి 2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని జగన్ ప్రకటించారు. మరి బాధితులకు ప్రభుత్వం ఏం సహాయం అందిస్తుంది అని జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్షంలోని వైసిపినే ఇంత సాయం చేస్తుంటే అధికారపక్షం నిద్రమత్తులో ఉందా అని జగన్ ప్రశ్నించారు. అయితే ప్రతిపక్ష హోదా లేని జగన్ తాము ప్రతిపక్షంలో ఉన్నామంటూ చెప్పుకోవడం పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.

This post was last modified on October 24, 2024 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

39 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

1 hour ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago