Political News

అమరావతీ ఊపిరి పీల్చుకో

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. దాదాపు ఐడేళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇక్క‌డ ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. 2015లో శంకు స్థాప‌న జ‌రిగిన రాజ‌ధాని అమ‌రావ‌తికి.. గ‌త ఐదేళ్ల పాటు గ్ర‌హణం ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. అమరావతిలోని రాజ‌ధాని ప్ర‌ధాన ప్రాంతం రాయపూడిలో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పూజలు నిర్వహించి, పనులకు శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ఆయ‌న కొబ్బరికాయ కొట్టారు.

ఇప్ప‌టికిప్పుడు కేంద్రం నుంచి నిధులు రాక‌పోయినా.. రాష్ట్ర బ‌డ్జెట్ నుంచి రూ.160 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు. ఈ నిధుల‌తో రాజ‌ధానిలో ఏపీ సీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించను న్నారు. ఈ ప‌నుల‌కే తాజాగా సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టిన సీఆర్డిఏ.. త‌ర్వాత వైసీపీ రాక‌తో ప‌నుల‌ను నిలిపివేసింది. అంతేకాదు.. అస‌లు సీఆర్ డీఏనే జ‌గ‌న్ స‌ర్కారు ర‌ద్దు చేసింది.

దీని స్థానంలో ఏపీఆర్ డీఏ అనే కొత్త సంస్థ‌ను ఏర్పాటు చేస్తూ.. సీఆర్ డీఏ చ‌ట్టంలో మార్పులు చేసింది. కానీ, కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక‌.. మ‌ళ్లీ సీఆర్ డీఏ చ‌ట్టాన్ని పున‌రుద్ధ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 16 తేదీన జరిగిన సీఆర్డిఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి తాజాగా ఆయా ప‌నుల‌ను ప్రారంభించారు. ఇదిలావుంటే.. కేంద్రం నుంచి రూ.15 వేల కోట్ల రూపాయ‌లు రానున్నాయి. ఇవి రాగానే ప్ర‌ధాన ప‌నులు కూడా ప్రారంభించ‌నున్నారు.

మ‌రోవైపు ఏషియా డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు(ఏడీబీ) కూడా రూ.15 వేల కోట్లను రుణం రూపంలో అందించ నుంది. ఈ మొత్తం నిధులతో వ‌చ్చే ఏడాది చివ‌రి నాటికి అమ‌రావ‌తికి ఒక రూపం తీసుకురావాల‌ని చంద్ర‌బాబు త‌ల‌పోస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ప‌నులు ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

4 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

6 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

8 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

8 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

9 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

9 hours ago