Political News

అమరావతీ ఊపిరి పీల్చుకో

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. దాదాపు ఐడేళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇక్క‌డ ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. 2015లో శంకు స్థాప‌న జ‌రిగిన రాజ‌ధాని అమ‌రావ‌తికి.. గ‌త ఐదేళ్ల పాటు గ్ర‌హణం ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. అమరావతిలోని రాజ‌ధాని ప్ర‌ధాన ప్రాంతం రాయపూడిలో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పూజలు నిర్వహించి, పనులకు శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ఆయ‌న కొబ్బరికాయ కొట్టారు.

ఇప్ప‌టికిప్పుడు కేంద్రం నుంచి నిధులు రాక‌పోయినా.. రాష్ట్ర బ‌డ్జెట్ నుంచి రూ.160 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు. ఈ నిధుల‌తో రాజ‌ధానిలో ఏపీ సీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించను న్నారు. ఈ ప‌నుల‌కే తాజాగా సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టిన సీఆర్డిఏ.. త‌ర్వాత వైసీపీ రాక‌తో ప‌నుల‌ను నిలిపివేసింది. అంతేకాదు.. అస‌లు సీఆర్ డీఏనే జ‌గ‌న్ స‌ర్కారు ర‌ద్దు చేసింది.

దీని స్థానంలో ఏపీఆర్ డీఏ అనే కొత్త సంస్థ‌ను ఏర్పాటు చేస్తూ.. సీఆర్ డీఏ చ‌ట్టంలో మార్పులు చేసింది. కానీ, కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక‌.. మ‌ళ్లీ సీఆర్ డీఏ చ‌ట్టాన్ని పున‌రుద్ధ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 16 తేదీన జరిగిన సీఆర్డిఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి తాజాగా ఆయా ప‌నుల‌ను ప్రారంభించారు. ఇదిలావుంటే.. కేంద్రం నుంచి రూ.15 వేల కోట్ల రూపాయ‌లు రానున్నాయి. ఇవి రాగానే ప్ర‌ధాన ప‌నులు కూడా ప్రారంభించ‌నున్నారు.

మ‌రోవైపు ఏషియా డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు(ఏడీబీ) కూడా రూ.15 వేల కోట్లను రుణం రూపంలో అందించ నుంది. ఈ మొత్తం నిధులతో వ‌చ్చే ఏడాది చివ‌రి నాటికి అమ‌రావ‌తికి ఒక రూపం తీసుకురావాల‌ని చంద్ర‌బాబు త‌ల‌పోస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ప‌నులు ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 19, 2024 2:34 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

నదిలో 11,000 లీటర్ల పాలు.. పర్యావరణానికి మంచిదేనా?

మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 21 రోజుల పాటు…

11 minutes ago

మీడియాలోకి సాయిరెడ్డి.. పక్షపాతం లేకుండా…!

అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో…

36 minutes ago

చిరంజీవి చుట్టూ డబుల్ అయోమయం

మన శంకరవరప్రసాద్ గారు రిలీజై మూడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో…

1 hour ago

శేష్ కెపాసిటీ ఏంటో అర్థమయ్యిందిగా

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో అడివి శేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు రెడీగా ఉన్నా వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు…

2 hours ago

పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వానికి ఉచితాలు ఎందుకు

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద…

2 hours ago

షాకింగ్: గుడివాడ అమర్నాథ్ కు జైలు శిక్ష

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ…

3 hours ago