Political News

ఇదంతా అప్పుడు చెప్పాల్సింది జగన్

చేతులు కాలాక‌.. ఆకులు ప‌ట్టుకున్న‌ట్టుగా ఉంది వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రిస్థితి. ఆయ‌న హ‌యాంలో జ‌రిగి న త‌ప్పుల‌పై అప్ప‌ట్లో కూట‌మి పార్టీలు ఊరూవాడా ప్ర‌చారం చేశాయి. ఆధారాలు చూప‌లేదు కానీ.. ప్ర‌చా రంలో మాత్రం దూసుకుపోయాయి.

ఇక‌, ఎలానూ కూట‌మి పార్టీల‌కు మౌత్ పీస్‌లు ఉన్నాయి కాబ‌ట్టి ఆ ప్ర‌చారం జోరుగా.. హోరెత్తింది. అలాంటి స‌మ‌యంలోనే స్పందించి.. తాను చేసిందేంటో చెప్పుకోవాల్సి న జ‌గ‌న్ మౌనంగా ఉండిపోయారు. అయితే..ఇ ప్పుడు ఆయ‌న‌కు త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది!

అందుకే, తాజ‌గా జ‌గ‌న్‌.. త‌న హయంలో జ‌రిగిన వాటిని రోజుకొక సీరియ‌ల్‌గా వివ‌రిస్తున్నారు. కానీ, ఇప్పు డు ఎవ‌రు మాత్రం విశ్వ‌సిస్తార‌నేది ప్ర‌శ్న‌. ముద్దొచ్చిన‌ప్పుడే అన్న‌ట్టుగా.. అధికారంలో ఉన్న‌ప్పుడే వివ రించి ఉంటే.. బాగుండేద‌ని సొంత పార్టీ నాయ‌కులే అంటున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. వ‌రుస‌గా గ‌త మూడు రోజులుగా వైసీపీ నాయకుల‌తో జ‌గ‌న్ భేటీ అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా కూట‌మి త‌ప్పులు అంటూ.. కొన్ని లెక్క‌లు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంలోనే త‌న పాల‌న గురించి కూడా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో ప్రారంభ‌మైన నూత‌న మ‌ద్యం పాల‌సీ గురించి తాజాగా మాట్లాడిన జ‌గ‌న్‌.. సాయంత్రం అయ్యేస‌రికి.. మ‌ద్యం క‌లెక్ష‌న్‌.. త‌మ్ముళ్ల జేబుల్లోకి వెళ్తోంద‌ని అన్నారు.

ప్రైవేటుకు అప్ప‌గించి త‌ప్పు చేశార‌ని.. దీనివ‌ల్ల స‌ర్కారుకు ఆదాయం రాద‌ని.. త‌మ్ముళ్ల‌కే ఆదాయం వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు. అదే త‌మ హ‌యాంలో అయితే.. సాయంత్రం అయ్యే స‌రికి నేరుగా ప్ర‌భుత్వ ఖాతాలోకి మ‌ద్యం సొమ్ము జ‌మ అయ్యేద‌ని తెలిపారు. ఎక్క‌డా అవినీతికి తావులేకుండా చేశామ‌న్నారు.

ఇదే నిజ‌మ‌ని భావిస్తే.. అప్ప‌ట్లో ఎందుకు మౌనంగా ఉన్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. పైగా ఎక్క‌డా డిజిట‌ల్ పేమెంట్ ను అనుమ‌తించ‌లేదు. హైకోర్టు చెప్పాక కూడా.. న‌గ‌దు రూపంలో బాటిళ్ల‌ను విక్ర‌యించారు.

ఇదే స‌మయంలో వైసీపీ నేత‌ల సరుకే విక్ర‌యిస్తున్నార‌ని కూట‌మి పార్టీలు ప్ర‌చారం చేసిన‌ప్పుడు కూడా జ‌గ‌న్ ఎందుకు మౌనంగా ఉన్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇక‌, ఇసుక విధానంపైనా ఇదే సూక్తులు చెప్పారు. గ‌తంలో త‌మ హ‌యాంలో నేరుగా ఇసుక‌పై నెలకు 7500 కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింద‌న్నారు.

ఇప్పుడు ఉచితం పేరుతో.. త‌మ్ముళ్లు దోచుకుంటున్నార‌ని సూత్రీక‌రించారు. అయితే.. అప్ప‌ట్లో ఎందుకు మౌనంగా ఉన్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇసుక‌లో మ‌స్కా లేక‌పోతే.. వైసీపీ హ‌యాంలో ఎందుకు మౌనంగా ఉన్న‌ట్టు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. కానీ, అప్పుడు మౌనంగా ఉన్న జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం.. అధికారం పోయాక‌. అవ‌న్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇదే.. రాజకీయాల్లో చిత్రం అంటే!!

This post was last modified on October 19, 2024 10:36 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago