చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. ఆయన హయాంలో జరిగి న తప్పులపై అప్పట్లో కూటమి పార్టీలు ఊరూవాడా ప్రచారం చేశాయి. ఆధారాలు చూపలేదు కానీ.. ప్రచా రంలో మాత్రం దూసుకుపోయాయి.
ఇక, ఎలానూ కూటమి పార్టీలకు మౌత్ పీస్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రచారం జోరుగా.. హోరెత్తింది. అలాంటి సమయంలోనే స్పందించి.. తాను చేసిందేంటో చెప్పుకోవాల్సి న జగన్ మౌనంగా ఉండిపోయారు. అయితే..ఇ ప్పుడు ఆయనకు తత్వం బోధపడినట్టుంది!
అందుకే, తాజగా జగన్.. తన హయంలో జరిగిన వాటిని రోజుకొక సీరియల్గా వివరిస్తున్నారు. కానీ, ఇప్పు డు ఎవరు మాత్రం విశ్వసిస్తారనేది ప్రశ్న. ముద్దొచ్చినప్పుడే అన్నట్టుగా.. అధికారంలో ఉన్నప్పుడే వివ రించి ఉంటే.. బాగుండేదని సొంత పార్టీ నాయకులే అంటున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. వరుసగా గత మూడు రోజులుగా వైసీపీ నాయకులతో జగన్ భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా కూటమి తప్పులు అంటూ.. కొన్ని లెక్కలు చెబుతున్నారు. ఈ సందర్భంలోనే తన పాలన గురించి కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో ప్రారంభమైన నూతన మద్యం పాలసీ గురించి తాజాగా మాట్లాడిన జగన్.. సాయంత్రం అయ్యేసరికి.. మద్యం కలెక్షన్.. తమ్ముళ్ల జేబుల్లోకి వెళ్తోందని అన్నారు.
ప్రైవేటుకు అప్పగించి తప్పు చేశారని.. దీనివల్ల సర్కారుకు ఆదాయం రాదని.. తమ్ముళ్లకే ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. అదే తమ హయాంలో అయితే.. సాయంత్రం అయ్యే సరికి నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి మద్యం సొమ్ము జమ అయ్యేదని తెలిపారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా చేశామన్నారు.
ఇదే నిజమని భావిస్తే.. అప్పట్లో ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న. పైగా ఎక్కడా డిజిటల్ పేమెంట్ ను అనుమతించలేదు. హైకోర్టు చెప్పాక కూడా.. నగదు రూపంలో బాటిళ్లను విక్రయించారు.
ఇదే సమయంలో వైసీపీ నేతల సరుకే విక్రయిస్తున్నారని కూటమి పార్టీలు ప్రచారం చేసినప్పుడు కూడా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న. ఇక, ఇసుక విధానంపైనా ఇదే సూక్తులు చెప్పారు. గతంలో తమ హయాంలో నేరుగా ఇసుకపై నెలకు 7500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు.
ఇప్పుడు ఉచితం పేరుతో.. తమ్ముళ్లు దోచుకుంటున్నారని సూత్రీకరించారు. అయితే.. అప్పట్లో ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న. ఇసుకలో మస్కా లేకపోతే.. వైసీపీ హయాంలో ఎందుకు మౌనంగా ఉన్నట్టు? అనేది కీలక ప్రశ్న. కానీ, అప్పుడు మౌనంగా ఉన్న జగన్ ఇప్పుడు మాత్రం.. అధికారం పోయాక. అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇదే.. రాజకీయాల్లో చిత్రం అంటే!!
This post was last modified on October 19, 2024 10:36 am
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…