Political News

మహిళలకు ఫ్రీ బస్ పథకం..షర్మిల వినూత్న నిరసన

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పథకాలలో ముఖ్యంగా మహిళలను ఆకర్షించిన పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా ఆ పథకం ఏపీలో అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే వైసిపితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినూత్న నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబుకు పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలపాలని ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు షర్మిల పిలుపునిచ్చారు. ఈ రోజు విజయవాడ నుంచి తెనాలి వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల కండక్టర్ దగ్గర నుంచి టికెట్ కొని తన నిరసనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా, బస్సులోని మహిళలందరూ తమకున్న టికెట్లను చూపించాలని తోటి మహిళా ప్రయాణికులను షర్మిల కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విజయవాడ నుంచి తెనాలి వరకు షర్మిల ప్రయాణించిన సందర్భంగా బస్సులోని మహిళా ప్రయాణికులతో మాట్లాడిన షర్మిల ఉచిత బస్సు ప్రయాణంపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. బస్సులో తోటి మహిళలతో కలిసి మహిళలకు ఉచిత బస్సు పథకం హామీని అమలు చేయాలని షర్మిల నినాదాలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల లోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసిందని చెప్పారు. కర్ణాటకలో కూడా ఆ పథకం అమలు చేస్తున్నారని కానీ, ఏపీలో మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉచిత బస్సు వాగ్దానం అని చెప్పి మహిళలతో ఓటు వేయించుకున్నారని, కానీ ఎన్నాళ్ళైనా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ పథకం అమలు చేయకపోవడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి అని ప్రశ్నించారు.

నెలకు సగటున 30 లక్షల మంది ప్రయాణికులలో 20 లక్షల మంది మహిళలున్నారని షర్మిల అన్నారు. మహిళలతో ఓట్లు వేయించుకుని నెలకు మహిళల కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టలేరా అని ప్రశ్నించారు. మహిళలపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఇది అని విమర్శించారు. తాను ప్రయాణించిన బస్సులో మహిళలందరితో కలిసి పోస్ట్ కార్డును చూపిస్తు షర్మిల నిరసన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో నేడు, రేపు, ఎల్లుండి పోస్ట్ కార్డు ద్వారా చంద్రబాబుకు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. వేలాది పోస్ట్ కార్డులు చంద్రబాబుకు పంపించాలని షర్మిల, అవి చూసిన తర్వాత అయినా చంద్రబాబు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తారేమో అని అన్నారు.

Share

Recent Posts

లక్షల్లో తీసిన చెత్త సినిమా… కోట్లలో కలెక్షన్లు

ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…

2 hours ago

రజిని సినిమాలో విలన్… రాపో పెద్ద రిస్కు?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…

3 hours ago

మడమ తిప్పిన విజయ సాయిరెడ్డి… కొత్త పార్టీ రెడీ!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి గత ఏడాది జనవరిలో తప్పుకున్న…

3 hours ago

శ్రీలీల మిస్సయ్యింది మమిత సాధించింది

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…

3 hours ago

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

5 hours ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

6 hours ago