Political News

వైసీపీ నుంచి పోయేవాళ్లే కాదు.. వ‌చ్చేవాళ్లూ ఉన్నారా?

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ నుంచి చాలా మంది నాయ‌కులు బ‌య‌ట‌కు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. క్యూక‌ట్టుకుని మ‌రీ నాయకులు పార్టీకి బై కొడుతున్నారు. వీరిలో కీల‌క‌మైన బాలినేని శ్రీనివాస‌రెడ్డి, సామినేని ఉద‌య భాను, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్ రావు వంటివారు ఉన్నారు. ఇక‌, మ‌రికొంద‌రు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇంకొంద‌రు రాజ‌కీయాలే వ‌దిలేస్తున్నారు. ఇలా.. వైసీపీలో నాయ‌కులు పోయే బ్యాచే త‌ప్ప వ‌చ్చే బ్యాచ్ క‌నిపించ‌డం లేదు. అస‌లు ఉన్న‌వారైనా ఎన్నాళ్లు ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా వైసీపీలోకి ఎవ‌రైనా వ‌స్తే.. ఆ పార్టీ కండువా ఎవ‌రైనా క‌ప్పుకొంటే.. పెద్ద సంచ‌ల‌న‌మే! అదే ఇప్పుడు జ‌రిగింది. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్తున్న‌వారే కాకుండా.. వ‌స్తున్న‌వారు ఒక‌రిద్ద‌రు క‌నిపిస్తుండ‌డంతో ఆ పార్టీలో కొంత నూత‌నోత్సాహం నెల‌కొంది. దాదాపు నాలుగు మాసాల త‌ర్వాత‌.. వైసీపీలో చేరిక క‌నిపించింది. అదికూడా.. టీడీపీ నుంచి రావ‌డం మ‌రో సంచ‌ల‌నం. ప్ర‌స్తుతం టీడీపీ అధికారంలో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆ పార్టీపై అసంతృప్తితో కీల‌క నేత బ‌య‌ట‌కు వ‌చ్చారు.

కాకినాడ జిల్లా, ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గానికి టీడీపీ ప‌రిశీల‌కుడుగా వ్య‌వ‌హ‌రించిన ముదునూరి ముర‌ళీకృష్ణ తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సుభాష్ చంద్ర‌బోస్ పిల్లి ఆధ్వ‌ర్యంలో ఆయ‌న వైసీపీలో చేరారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సహా నియోజ‌క‌వ‌ర్గం ప‌రిశీల‌కుడిగా ఉన్న త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. అదేవిధంగా టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రిజైన్ చేశారు.

అనంత‌రం.. గురువారం సాయంత్రం వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. ఈయ‌న‌కు పార్టీలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే.. అధికార పార్టీ నుంచి ముర‌ళీకృష్ణ రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ విష‌యాన్ని టీడీపీ లైట్‌గా తీసుకుంటే ఏమో చెప్ప‌లేం కానీ.. సీరియ‌స్‌గా తీసుకుంటే.. క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల దూకుడు ఎలా ఉందో అర్థం అవుతుంది. త‌ద్వారా పార్టీలో మార్పులు చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది.

This post was last modified on October 18, 2024 9:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

28 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

45 minutes ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

1 hour ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

4 hours ago