ఏపీ మాజీ సీఎం జగన్ అమరావతి రాజధానిపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంపై కుల ముద్ర వేసిన జగన్…ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపేశారు. దీంతో, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన అపఖ్యాతి ఏపీ మూటగట్టుకుంది.
అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు అమరావతికి ఊపిరి పోశారు. ఆగిపోయిన నిర్మాణాలను మళ్లీ మొదలుబెట్టే ప్రక్రియలో భాగంగా అమరావతిలో పెరిగిపోయిన పిచ్చి చెట్లు, మొక్కలను యుద్ధ ప్రాతిపదికన తీయించారు. అమరావతిలో జగన్ వల్ల ఏర్పడిన అడవిలోని చెట్లను, మొక్కలను నరికివేసిన తర్వాతే అమరావతి కొత్త రూపు సంతరించుకుంది.
ఇలా, ఓ వైపు అమరావతిని పునర్నిర్మించే పనిని సమర్థవంతంగా చేస్తూనే మరోవైపు అమరావతిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు తన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నొవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎకోసిస్టమ్, మెంటార్ స్టార్టప్స్ గురించి ఈ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రతిదాన్ని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్ మెంటార్ చేస్తాయని, డెవలప్ అవుతున్న సెక్టార్లలో టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్ కు కృషి చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు జోనల్ సెంటర్లతో ఈ హబ్ అనుసంధానమై ఉంటుందని వెల్లడించారు. మరోవైపు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ సంస్థను విశాఖలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతితో పాటు విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా లోకేష్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి అక్టోబర్ 1 వరకు అమెరికాలో లోకేష్ పర్యటించనున్నారు.
This post was last modified on October 17, 2024 1:52 pm
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…
గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…