Political News

రతన్ టాటాకు AP సరైన గౌరవం

ఏపీ మాజీ సీఎం జగన్ అమరావతి రాజధానిపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంపై కుల ముద్ర వేసిన జగన్…ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపేశారు. దీంతో, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన అపఖ్యాతి ఏపీ మూటగట్టుకుంది.

అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు అమరావతికి ఊపిరి పోశారు. ఆగిపోయిన నిర్మాణాలను మళ్లీ మొదలుబెట్టే ప్రక్రియలో భాగంగా అమరావతిలో పెరిగిపోయిన పిచ్చి చెట్లు, మొక్కలను యుద్ధ ప్రాతిపదికన తీయించారు. అమరావతిలో జగన్ వల్ల ఏర్పడిన అడవిలోని చెట్లను, మొక్కలను నరికివేసిన తర్వాతే అమరావతి కొత్త రూపు సంతరించుకుంది.

ఇలా, ఓ వైపు అమరావతిని పునర్నిర్మించే పనిని సమర్థవంతంగా చేస్తూనే మరోవైపు అమరావతిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు తన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నొవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎకోసిస్టమ్, మెంటార్ స్టార్టప్స్ గురించి ఈ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రతిదాన్ని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్ మెంటార్ చేస్తాయని, డెవలప్ అవుతున్న సెక్టార్లలో టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్ కు కృషి చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు జోనల్ సెంటర్లతో ఈ హబ్ అనుసంధానమై ఉంటుందని వెల్లడించారు. మరోవైపు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ సంస్థను విశాఖలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతితో పాటు విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా లోకేష్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి అక్టోబర్ 1 వరకు అమెరికాలో లోకేష్ పర్యటించనున్నారు.

This post was last modified on October 17, 2024 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

26 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago