అధికారంలో ఉన్న వేళలో బోలెడన్ని విమర్శలతో.. ఆరోపణలతో తరచూ వార్తల్లో ఉండే వైసీపీ నేతలు.. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరి తీరులో ఇంకా మార్పు రాలేదు. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
ఒక యాంకర్ మీదా.. ఆమె తండ్రి మీదా వైసీపీ నేత ఒకరు దాడి చేసి గాయపర్చిన ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూస్తాయి. అప్పు ఇవ్వటమే తప్పుగా ఈ ఉదంతంలో కనిపిస్తుంది.
వైసీపీ నేత కొడుక్కి అప్పుగా ఇచ్చిన ఒక యాంకర్.. ఆ తర్వాత ఆ డబ్బు ఊసు గురించి మాట్లాడకపోవటంతో.. దాని గురించి అడిగేందుకు వెళ్లిన వేళ.. వైసీపీ నేత వారిద్దరిపై దాడి చేసి గాయపర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దాడికి తెగబడిన వైసీపీ నేత వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కాజా కావ్యశ్రీ యాంకరింగ్ చేస్తుంటారు. ఆమె హైదరాబాద్ లో ఉంటారు.
ఆమెకు రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ నేత.. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ముఖ్య అనుచరుడైన వెంకట శ్రీనివాస్ కుమారుడు అభిలాష్ తో స్నేహం ఉంది. ఈ క్రమంలో తాను చేసే బిజినెస్ కోసం కావ్యశ్రీ వద్ద రూ.3 లక్ష్లు అప్పుగా తీసుకున్నాడు. 2021లో అతడికి ఆమె క్యాష్ రూంలో ఆ మొత్తాన్ని ఇచ్చారు.
అప్పటి నుంచి అసలు మాత్రమే కాదు వడ్డీ ఊసే లేదు. ఈ క్రమంలో అతడి తండ్రి శ్రీనివాస్ వద్దకు వచ్చిన ఆ యువతి పలుమార్లు చెప్పటం.. ఏళ్లు గడుస్తున్నా అప్పు తీర్చటం లేదు. ఫోన్ చేస్తే కాల్ లిఫ్టు చేయని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఆదివారం కోనసీమ జిల్లాలోని ఒక ఈవెంట్ కు వచ్చిన ఆమె.. తన తండ్రి నాగరాజుతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. తన దగ్గర అప్పు తీసుకున్న అభిలాష్ లేకపోవటంతో తన వద్ద తీసుకున్న డబ్బుల్ని ఇవ్వాలని అభిలాష్ తండ్రి శ్రీనివాస్ ను ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఆవేశంతో ఊగిపోయిన శ్రీనివాస్.. డబ్బులు అడిగేందుకు నా ఇంటికే వస్తారా? అంటూ తండ్రీ కుమార్తెల మీద దాడికి పాల్పడ్డారు. దీంతో తమపై జరిగిన దాడిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇక.. దాడికి పాల్పడిన శ్రీనివాస్ విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో అనేక సెటిల్ మెంట్లు చేసి.. మాజీఎంపీకి సన్నిహితంగా ఉండేవారని.. ఆయన తీరుపై బోలెడన్ని ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on October 16, 2024 4:06 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…