Political News

వైసీపీ నేత కొడుక్కి యాంకర్ అప్పు.. తీర్చమంటే దాడి

అధికారంలో ఉన్న వేళలో బోలెడన్ని విమర్శలతో.. ఆరోపణలతో తరచూ వార్తల్లో ఉండే వైసీపీ నేతలు.. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరి తీరులో ఇంకా మార్పు రాలేదు. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

ఒక యాంకర్ మీదా.. ఆమె తండ్రి మీదా వైసీపీ నేత ఒకరు దాడి చేసి గాయపర్చిన ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూస్తాయి. అప్పు ఇవ్వటమే తప్పుగా ఈ ఉదంతంలో కనిపిస్తుంది.

వైసీపీ నేత కొడుక్కి అప్పుగా ఇచ్చిన ఒక యాంకర్.. ఆ తర్వాత ఆ డబ్బు ఊసు గురించి మాట్లాడకపోవటంతో.. దాని గురించి అడిగేందుకు వెళ్లిన వేళ.. వైసీపీ నేత వారిద్దరిపై దాడి చేసి గాయపర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దాడికి తెగబడిన వైసీపీ నేత వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కాజా కావ్యశ్రీ యాంకరింగ్ చేస్తుంటారు. ఆమె హైదరాబాద్ లో ఉంటారు.

ఆమెకు రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ నేత.. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ముఖ్య అనుచరుడైన వెంకట శ్రీనివాస్ కుమారుడు అభిలాష్ తో స్నేహం ఉంది. ఈ క్రమంలో తాను చేసే బిజినెస్ కోసం కావ్యశ్రీ వద్ద రూ.3 లక్ష్లు అప్పుగా తీసుకున్నాడు. 2021లో అతడికి ఆమె క్యాష్ రూంలో ఆ మొత్తాన్ని ఇచ్చారు.

అప్పటి నుంచి అసలు మాత్రమే కాదు వడ్డీ ఊసే లేదు. ఈ క్రమంలో అతడి తండ్రి శ్రీనివాస్ వద్దకు వచ్చిన ఆ యువతి పలుమార్లు చెప్పటం.. ఏళ్లు గడుస్తున్నా అప్పు తీర్చటం లేదు. ఫోన్ చేస్తే కాల్ లిఫ్టు చేయని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఆదివారం కోనసీమ జిల్లాలోని ఒక ఈవెంట్ కు వచ్చిన ఆమె.. తన తండ్రి నాగరాజుతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. తన దగ్గర అప్పు తీసుకున్న అభిలాష్ లేకపోవటంతో తన వద్ద తీసుకున్న డబ్బుల్ని ఇవ్వాలని అభిలాష్ తండ్రి శ్రీనివాస్ ను ప్రశ్నించారు.

ఈ క్రమంలో ఆవేశంతో ఊగిపోయిన శ్రీనివాస్.. డబ్బులు అడిగేందుకు నా ఇంటికే వస్తారా? అంటూ తండ్రీ కుమార్తెల మీద దాడికి పాల్పడ్డారు. దీంతో తమపై జరిగిన దాడిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇక.. దాడికి పాల్పడిన శ్రీనివాస్ విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో అనేక సెటిల్ మెంట్లు చేసి.. మాజీఎంపీకి సన్నిహితంగా ఉండేవారని.. ఆయన తీరుపై బోలెడన్ని ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

This post was last modified on October 16, 2024 4:06 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago