అధికారంలో ఉన్న వేళలో బోలెడన్ని విమర్శలతో.. ఆరోపణలతో తరచూ వార్తల్లో ఉండే వైసీపీ నేతలు.. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరి తీరులో ఇంకా మార్పు రాలేదు. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
ఒక యాంకర్ మీదా.. ఆమె తండ్రి మీదా వైసీపీ నేత ఒకరు దాడి చేసి గాయపర్చిన ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూస్తాయి. అప్పు ఇవ్వటమే తప్పుగా ఈ ఉదంతంలో కనిపిస్తుంది.
వైసీపీ నేత కొడుక్కి అప్పుగా ఇచ్చిన ఒక యాంకర్.. ఆ తర్వాత ఆ డబ్బు ఊసు గురించి మాట్లాడకపోవటంతో.. దాని గురించి అడిగేందుకు వెళ్లిన వేళ.. వైసీపీ నేత వారిద్దరిపై దాడి చేసి గాయపర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దాడికి తెగబడిన వైసీపీ నేత వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కాజా కావ్యశ్రీ యాంకరింగ్ చేస్తుంటారు. ఆమె హైదరాబాద్ లో ఉంటారు.
ఆమెకు రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ నేత.. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ముఖ్య అనుచరుడైన వెంకట శ్రీనివాస్ కుమారుడు అభిలాష్ తో స్నేహం ఉంది. ఈ క్రమంలో తాను చేసే బిజినెస్ కోసం కావ్యశ్రీ వద్ద రూ.3 లక్ష్లు అప్పుగా తీసుకున్నాడు. 2021లో అతడికి ఆమె క్యాష్ రూంలో ఆ మొత్తాన్ని ఇచ్చారు.
అప్పటి నుంచి అసలు మాత్రమే కాదు వడ్డీ ఊసే లేదు. ఈ క్రమంలో అతడి తండ్రి శ్రీనివాస్ వద్దకు వచ్చిన ఆ యువతి పలుమార్లు చెప్పటం.. ఏళ్లు గడుస్తున్నా అప్పు తీర్చటం లేదు. ఫోన్ చేస్తే కాల్ లిఫ్టు చేయని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఆదివారం కోనసీమ జిల్లాలోని ఒక ఈవెంట్ కు వచ్చిన ఆమె.. తన తండ్రి నాగరాజుతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. తన దగ్గర అప్పు తీసుకున్న అభిలాష్ లేకపోవటంతో తన వద్ద తీసుకున్న డబ్బుల్ని ఇవ్వాలని అభిలాష్ తండ్రి శ్రీనివాస్ ను ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఆవేశంతో ఊగిపోయిన శ్రీనివాస్.. డబ్బులు అడిగేందుకు నా ఇంటికే వస్తారా? అంటూ తండ్రీ కుమార్తెల మీద దాడికి పాల్పడ్డారు. దీంతో తమపై జరిగిన దాడిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇక.. దాడికి పాల్పడిన శ్రీనివాస్ విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో అనేక సెటిల్ మెంట్లు చేసి.. మాజీఎంపీకి సన్నిహితంగా ఉండేవారని.. ఆయన తీరుపై బోలెడన్ని ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on October 16, 2024 4:06 pm
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……