బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన కొందరు నేతలు పోలీసుల సహకారంతో ఆమెపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యా సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మరికొందరు వైసీపీ కీలక నేతల హస్తముందని, సీనియర్ పోలీసు అధికారుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ కేసు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారని, ఇకపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తారని డిజిపి ద్వారకా తిరుమలరావు ఆదేశించారు.
గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురు సీనియర్ పోలీసు అధికారులపై కూడా ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో సజ్జల పేరు కూడా వినిపించింది. దీంతో, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు తీసేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావించింది.
ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, వివరాలను సిఐడికి అప్పగించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని, ఏసిపి హనుమంతరావు, సత్యనారాయణ తదితరులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 16, 2024 4:08 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…