బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన కొందరు నేతలు పోలీసుల సహకారంతో ఆమెపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యా సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మరికొందరు వైసీపీ కీలక నేతల హస్తముందని, సీనియర్ పోలీసు అధికారుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ కేసు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారని, ఇకపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తారని డిజిపి ద్వారకా తిరుమలరావు ఆదేశించారు.
గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురు సీనియర్ పోలీసు అధికారులపై కూడా ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో సజ్జల పేరు కూడా వినిపించింది. దీంతో, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు తీసేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావించింది.
ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, వివరాలను సిఐడికి అప్పగించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని, ఏసిపి హనుమంతరావు, సత్యనారాయణ తదితరులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 16, 2024 4:08 pm
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……