బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన కొందరు నేతలు పోలీసుల సహకారంతో ఆమెపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యా సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మరికొందరు వైసీపీ కీలక నేతల హస్తముందని, సీనియర్ పోలీసు అధికారుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ కేసు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారని, ఇకపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తారని డిజిపి ద్వారకా తిరుమలరావు ఆదేశించారు.
గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురు సీనియర్ పోలీసు అధికారులపై కూడా ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో సజ్జల పేరు కూడా వినిపించింది. దీంతో, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు తీసేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావించింది.
ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, వివరాలను సిఐడికి అప్పగించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని, ఏసిపి హనుమంతరావు, సత్యనారాయణ తదితరులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 16, 2024 4:08 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…