బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన కొందరు నేతలు పోలీసుల సహకారంతో ఆమెపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యా సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మరికొందరు వైసీపీ కీలక నేతల హస్తముందని, సీనియర్ పోలీసు అధికారుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ కేసు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారని, ఇకపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తారని డిజిపి ద్వారకా తిరుమలరావు ఆదేశించారు.
గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురు సీనియర్ పోలీసు అధికారులపై కూడా ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో సజ్జల పేరు కూడా వినిపించింది. దీంతో, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు తీసేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావించింది.
ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, వివరాలను సిఐడికి అప్పగించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని, ఏసిపి హనుమంతరావు, సత్యనారాయణ తదితరులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…