Political News

ర‌ఘురామ కేసులో సంచ‌ల‌న ప‌రిణామం..

టీడీపీ నేత‌, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు గుంటూరు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యా దు.. అనంత‌ర ప‌రిణామాల్లో తాజాగా సంచ‌ల‌న ఘ‌ట్టం చోటు చేసుకుంది. వైసీపీ హ‌యాంలో ఎంపీగా ఉన్న స‌మ‌యంలో త‌న‌ను సీఐడీ అధికారులు నిర్బంధించి.. క‌స్ట‌డీలో చిత్ర హింస‌ల‌కు గురి చేశార‌ని.. త‌న‌ను చంపేందుకు కూడా కృట్ర ప‌న్నార‌ని ర‌ఘురామ ఫిర్యాదుచేసిన విష‌యం తెలిసిందే.

దీంతో అప్ప‌టి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స‌హా.. గుంటూరు డీఎస్పీగా ఉన్న విజ‌య‌పాల్‌పై కేసులు న‌మోదు చేశారు. వీరితోపాటు మ‌రో సీనియ‌ర్ అధికారి సీతారామాంజ‌నేయులుపై కూడా కేసు న‌మోదు చేశారు. అయితే.. వీరిని విచారించేందుకు ప‌క్కా ఆధారాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో నాటి సీఐడీ స్టేష‌న్ల‌లో ప‌నిచేసి పోలీసుల‌ను, ఇత‌ర సిబ్బందిని విచారిస్తున్నారు. కానీ, ర‌ఘురామ‌ను ఎవ‌రు కొట్టార‌నే విష‌యం మాత్రం తెలియ‌రాలేదు.

దీనిని తెలుసుకోవాలంటే.. అప్ప‌టి డీఎస్పీగా ఉన్న విజ‌య‌పాల్‌(ప్ర‌స్తుతం రిటైర‌య్యారు)ను విచారించా లన్న‌ది పోలీసుల ఉద్దేశం. అయితే.. విచార‌ణ పేరుతో త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని భావించిన విజ‌య‌పాల్‌.. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. కానీ, కోర్టు దీనికి అంగీక‌రించ‌లేదు. దీంతో ప్ర‌స్తుతం విజ‌య‌పాల్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు త‌న‌కు నాటి సంగ‌తులు గుర్తులేద‌ని, అన్నీ మ‌రిచిపోయార‌ని చెబుతున్నారు.

ఇదిలావుంటే.. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని విజ‌య‌పాల్‌.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సోమ‌వారం తొలి కేసుగా ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేసిన సుప్రీంకోర్టు.. సంచ‌ల‌న ఆదేశాలు చేసింది. విజ‌య‌పాల్‌పై ఎలాంటిదురుసు ప్ర‌వ‌ర్తన చేయ‌రాద‌ని తెలిపింది. ఆయ‌న‌ను విచారిస్తున్న‌ట్టు తెలుసుకున్న సుప్రీంకోర్టు.. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదిని కూడా విచార‌ణ‌లో భాగంగా మార్చాల‌ని తెలిపింది. ఎలాంటిఅరెస్టులు, హెచ్చ‌రిక‌లు చేయ‌రాద‌ని తేల్చిచెప్పింది. కేసు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు.. ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను కూడా కేటాయించాల‌ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 16, 2024 2:41 pm

Share

Recent Posts

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

2 hours ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

2 hours ago

వెంకీ త్రివిక్రమ్… ఇంకా ఆ ఒక్క కిక్ రాలేదే!

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…

3 hours ago

20 గంటలు పని… 4 గంటలు రెస్ట్?

తమిళ సినిమాలో అగ్ర నటుడిగా వెలుగొందిన నటుడు విజయ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. స్వర్గ సుఖాల జీవితం నుంచి…

3 hours ago

మూడేళ్ల ముందు 100 కోట్లు… ఇప్పుడు 3 కోట్లు

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్…

8 hours ago

ఏపీలో ఉద్యోగాల పండగ

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపిక‌బురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేల‌కుపైగా స‌ర్కారీ…

13 hours ago