Political News

ర‌ఘురామ కేసులో సంచ‌ల‌న ప‌రిణామం..

టీడీపీ నేత‌, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు గుంటూరు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యా దు.. అనంత‌ర ప‌రిణామాల్లో తాజాగా సంచ‌ల‌న ఘ‌ట్టం చోటు చేసుకుంది. వైసీపీ హ‌యాంలో ఎంపీగా ఉన్న స‌మ‌యంలో త‌న‌ను సీఐడీ అధికారులు నిర్బంధించి.. క‌స్ట‌డీలో చిత్ర హింస‌ల‌కు గురి చేశార‌ని.. త‌న‌ను చంపేందుకు కూడా కృట్ర ప‌న్నార‌ని ర‌ఘురామ ఫిర్యాదుచేసిన విష‌యం తెలిసిందే.

దీంతో అప్ప‌టి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స‌హా.. గుంటూరు డీఎస్పీగా ఉన్న విజ‌య‌పాల్‌పై కేసులు న‌మోదు చేశారు. వీరితోపాటు మ‌రో సీనియ‌ర్ అధికారి సీతారామాంజ‌నేయులుపై కూడా కేసు న‌మోదు చేశారు. అయితే.. వీరిని విచారించేందుకు ప‌క్కా ఆధారాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో నాటి సీఐడీ స్టేష‌న్ల‌లో ప‌నిచేసి పోలీసుల‌ను, ఇత‌ర సిబ్బందిని విచారిస్తున్నారు. కానీ, ర‌ఘురామ‌ను ఎవ‌రు కొట్టార‌నే విష‌యం మాత్రం తెలియ‌రాలేదు.

దీనిని తెలుసుకోవాలంటే.. అప్ప‌టి డీఎస్పీగా ఉన్న విజ‌య‌పాల్‌(ప్ర‌స్తుతం రిటైర‌య్యారు)ను విచారించా లన్న‌ది పోలీసుల ఉద్దేశం. అయితే.. విచార‌ణ పేరుతో త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని భావించిన విజ‌య‌పాల్‌.. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. కానీ, కోర్టు దీనికి అంగీక‌రించ‌లేదు. దీంతో ప్ర‌స్తుతం విజ‌య‌పాల్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు త‌న‌కు నాటి సంగ‌తులు గుర్తులేద‌ని, అన్నీ మ‌రిచిపోయార‌ని చెబుతున్నారు.

ఇదిలావుంటే.. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని విజ‌య‌పాల్‌.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సోమ‌వారం తొలి కేసుగా ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేసిన సుప్రీంకోర్టు.. సంచ‌ల‌న ఆదేశాలు చేసింది. విజ‌య‌పాల్‌పై ఎలాంటిదురుసు ప్ర‌వ‌ర్తన చేయ‌రాద‌ని తెలిపింది. ఆయ‌న‌ను విచారిస్తున్న‌ట్టు తెలుసుకున్న సుప్రీంకోర్టు.. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదిని కూడా విచార‌ణ‌లో భాగంగా మార్చాల‌ని తెలిపింది. ఎలాంటిఅరెస్టులు, హెచ్చ‌రిక‌లు చేయ‌రాద‌ని తేల్చిచెప్పింది. కేసు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు.. ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను కూడా కేటాయించాల‌ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

2 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

3 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

5 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

5 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

7 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

7 hours ago