Political News

చైనా దూకుడు.. ఆకాశంలో ఇండియా కన్ను

చాన్సు దొరికితే చాలు చటుక్కున దూరిపోయి చైనా మరోసారి తన వంకర బుద్దిని చుపోస్తోంది. హిందూ మహాసముద్రంపై చైనా క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుతుండడంతో, భారత్ ఇప్పుడు తమ నిఘా వ్యవస్థను బలపర్చడానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో, అమెరికాతో తాజాగా ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది.

భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు సుమారు రూ.32 వేల కోట్ల వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్లను సేకరించనున్నారు. ఈ డ్రోన్లు అత్యాధునిక నిఘా వ్యవస్థలు కలిగి ఉండి, నీటి మరియు భూ ప్రాంతాల్లో సమర్థవంతమైన నిఘా నిర్వహించగలవు. కుదిరిన ఒప్పందం ప్రకారం, 15 డ్రోన్లు నేవీకి, 8 ఆర్మీకి, మిగతా 8 డ్రోన్లు వాయుసేనకు అప్పగించనున్నారు.

ప్రిడేటర్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సైనిక పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని తయారుచేసిన జనరల్ అటామిక్స్ కంపెనీ, మానవ రహిత నిఘా విమానాల తయారీలో మార్గదర్శక సంస్థగా పేరు పొందింది. భారత్‌కు ఈ డ్రోన్లు అందుబాటులోకి రాకముందే వాటిపై సైనిక, వ్యూహాత్మక వర్గాలు ఉత్సాహం చూపిస్తున్నాయి.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఈ ఒప్పందం పూర్తి కాగా, వీటి సాయంతో హిందూ మహాసముద్రంలో భారత నిఘా శక్తి మరింత పెరగనుంది. చైనా యుద్ధ నౌకలు తరచూ ప్రవేశిస్తున్న నేపథ్యంలో, ఈ డ్రోన్లు సరిహద్దులను పటిష్ఠంగా కాపాడేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని భావిస్తున్నారు. భవిష్యత్‌లో భారత్ ప్రిడేటర్ డ్రోన్లను స్మార్ట్ టెక్నాలజీతో కలిపి మరింత పురోగతిని సాధిస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on October 16, 2024 2:02 pm

Share

Recent Posts

మంత్రి తప్పుకి అసెంబ్లీలో సారీ చెప్పిన సీఎం

చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా…

16 minutes ago

బ్రేకప్ వివాదంపై స్పందించిన ధృవ్ విక్రమ్?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ సినీ న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తోంది. త‌న పాస్ట్ ల‌వ్ స్టోరీ…

30 minutes ago

తెలంగాణలో ఎన్ని ఓట్లు పోతాయి స‌ర్‌

కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ‌(స‌ర్‌) తెలంగాణ‌లో ముగిసింది. దాదాపు 2 మాసాల‌కు పైగానే ఈ…

36 minutes ago

అత‌ను జ‌న‌సేన నుంచి ఔట్… ఆమె బీజేపీలోకి

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ మీద లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన శ్ర‌ష్ఠి వ‌ర్మ.. రాజ‌కీయాల్లోకి…

2 hours ago

డ్రాగన్ అనుకున్న టైంకి రాగలదా

ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల…

2 hours ago

బండ్ల గణేష్ నెట్‌వర్క్… సోషల్ మీడియా చర్చ

నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి…

3 hours ago