చాన్సు దొరికితే చాలు చటుక్కున దూరిపోయి చైనా మరోసారి తన వంకర బుద్దిని చుపోస్తోంది. హిందూ మహాసముద్రంపై చైనా క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుతుండడంతో, భారత్ ఇప్పుడు తమ నిఘా వ్యవస్థను బలపర్చడానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో, అమెరికాతో తాజాగా ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది.
భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు సుమారు రూ.32 వేల కోట్ల వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్లను సేకరించనున్నారు. ఈ డ్రోన్లు అత్యాధునిక నిఘా వ్యవస్థలు కలిగి ఉండి, నీటి మరియు భూ ప్రాంతాల్లో సమర్థవంతమైన నిఘా నిర్వహించగలవు. కుదిరిన ఒప్పందం ప్రకారం, 15 డ్రోన్లు నేవీకి, 8 ఆర్మీకి, మిగతా 8 డ్రోన్లు వాయుసేనకు అప్పగించనున్నారు.
ప్రిడేటర్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సైనిక పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని తయారుచేసిన జనరల్ అటామిక్స్ కంపెనీ, మానవ రహిత నిఘా విమానాల తయారీలో మార్గదర్శక సంస్థగా పేరు పొందింది. భారత్కు ఈ డ్రోన్లు అందుబాటులోకి రాకముందే వాటిపై సైనిక, వ్యూహాత్మక వర్గాలు ఉత్సాహం చూపిస్తున్నాయి.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఈ ఒప్పందం పూర్తి కాగా, వీటి సాయంతో హిందూ మహాసముద్రంలో భారత నిఘా శక్తి మరింత పెరగనుంది. చైనా యుద్ధ నౌకలు తరచూ ప్రవేశిస్తున్న నేపథ్యంలో, ఈ డ్రోన్లు సరిహద్దులను పటిష్ఠంగా కాపాడేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని భావిస్తున్నారు. భవిష్యత్లో భారత్ ప్రిడేటర్ డ్రోన్లను స్మార్ట్ టెక్నాలజీతో కలిపి మరింత పురోగతిని సాధిస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 16, 2024 2:02 pm
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…