Political News

చైనా దూకుడు.. ఆకాశంలో ఇండియా కన్ను

చాన్సు దొరికితే చాలు చటుక్కున దూరిపోయి చైనా మరోసారి తన వంకర బుద్దిని చుపోస్తోంది. హిందూ మహాసముద్రంపై చైనా క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుతుండడంతో, భారత్ ఇప్పుడు తమ నిఘా వ్యవస్థను బలపర్చడానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో, అమెరికాతో తాజాగా ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది.

భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు సుమారు రూ.32 వేల కోట్ల వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్లను సేకరించనున్నారు. ఈ డ్రోన్లు అత్యాధునిక నిఘా వ్యవస్థలు కలిగి ఉండి, నీటి మరియు భూ ప్రాంతాల్లో సమర్థవంతమైన నిఘా నిర్వహించగలవు. కుదిరిన ఒప్పందం ప్రకారం, 15 డ్రోన్లు నేవీకి, 8 ఆర్మీకి, మిగతా 8 డ్రోన్లు వాయుసేనకు అప్పగించనున్నారు.

ప్రిడేటర్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సైనిక పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని తయారుచేసిన జనరల్ అటామిక్స్ కంపెనీ, మానవ రహిత నిఘా విమానాల తయారీలో మార్గదర్శక సంస్థగా పేరు పొందింది. భారత్‌కు ఈ డ్రోన్లు అందుబాటులోకి రాకముందే వాటిపై సైనిక, వ్యూహాత్మక వర్గాలు ఉత్సాహం చూపిస్తున్నాయి.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఈ ఒప్పందం పూర్తి కాగా, వీటి సాయంతో హిందూ మహాసముద్రంలో భారత నిఘా శక్తి మరింత పెరగనుంది. చైనా యుద్ధ నౌకలు తరచూ ప్రవేశిస్తున్న నేపథ్యంలో, ఈ డ్రోన్లు సరిహద్దులను పటిష్ఠంగా కాపాడేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని భావిస్తున్నారు. భవిష్యత్‌లో భారత్ ప్రిడేటర్ డ్రోన్లను స్మార్ట్ టెక్నాలజీతో కలిపి మరింత పురోగతిని సాధిస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on October 16, 2024 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

14 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago