Political News

చైనా దూకుడు.. ఆకాశంలో ఇండియా కన్ను

చాన్సు దొరికితే చాలు చటుక్కున దూరిపోయి చైనా మరోసారి తన వంకర బుద్దిని చుపోస్తోంది. హిందూ మహాసముద్రంపై చైనా క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుతుండడంతో, భారత్ ఇప్పుడు తమ నిఘా వ్యవస్థను బలపర్చడానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో, అమెరికాతో తాజాగా ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది.

భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు సుమారు రూ.32 వేల కోట్ల వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్లను సేకరించనున్నారు. ఈ డ్రోన్లు అత్యాధునిక నిఘా వ్యవస్థలు కలిగి ఉండి, నీటి మరియు భూ ప్రాంతాల్లో సమర్థవంతమైన నిఘా నిర్వహించగలవు. కుదిరిన ఒప్పందం ప్రకారం, 15 డ్రోన్లు నేవీకి, 8 ఆర్మీకి, మిగతా 8 డ్రోన్లు వాయుసేనకు అప్పగించనున్నారు.

ప్రిడేటర్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సైనిక పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని తయారుచేసిన జనరల్ అటామిక్స్ కంపెనీ, మానవ రహిత నిఘా విమానాల తయారీలో మార్గదర్శక సంస్థగా పేరు పొందింది. భారత్‌కు ఈ డ్రోన్లు అందుబాటులోకి రాకముందే వాటిపై సైనిక, వ్యూహాత్మక వర్గాలు ఉత్సాహం చూపిస్తున్నాయి.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఈ ఒప్పందం పూర్తి కాగా, వీటి సాయంతో హిందూ మహాసముద్రంలో భారత నిఘా శక్తి మరింత పెరగనుంది. చైనా యుద్ధ నౌకలు తరచూ ప్రవేశిస్తున్న నేపథ్యంలో, ఈ డ్రోన్లు సరిహద్దులను పటిష్ఠంగా కాపాడేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని భావిస్తున్నారు. భవిష్యత్‌లో భారత్ ప్రిడేటర్ డ్రోన్లను స్మార్ట్ టెక్నాలజీతో కలిపి మరింత పురోగతిని సాధిస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on October 16, 2024 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

2 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

2 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

5 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

6 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

9 hours ago