ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ 16 నుంచి అమల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 వ తారీకున కొత్త వైన్ షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో రేపటి నుంచి ఏపీలో ప్రైవేట్ రిటైల్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండబోతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం మద్యం షాపులకు చివరి రోజు కానుంది. ఈ నేపథ్యంలోనే మద్యం షాపుల టెండర్ల ద్వారా దాదాపు 1800 కోట్ల ఆదాయాన్ని అర్జించిన ప్రభుత్వం మరో 100 కోట్ల ఆదాయం సమకూర్చుకునే ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే అమల్లోకి వచ్చేలాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మద్యం అమ్మకాలపై విధించే పన్నులు కాకుండా అదనంగా ఈ రెండు శాతం సెస్ విధిస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆల్రెడీ రౌండ్ ఆఫ్ చార్జీలు విధించడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఒక మద్యం బాటిల్ ధర 166 రూపాయలు ఉంటే రౌండాఫ్ ఛార్జీల కింద 170 రూపాయలు తీసుకోనున్నారు. దీనికి తోడు అదనంగా ఇప్పుడు 2 శాతం విధించడంతో ఈ భారం అంతా మద్యం ప్రియులపై పడనుందని విమర్శలు వస్తున్నాయి.
అయితే, అలా సెస్ విధించడం ద్వారా ఆబ్కారీ శాఖకు రూ.100 కోట్ల ఆదాయం సమకూరనుందని, ఆ డబ్బును డ్రగ్ రీహ్యాబిలిటేషన్ సెస్ కింద ప్రభుత్వం వసూలు చేయనుంది.
మరోవైపు, మద్యం సిండికేట్లు ఏర్పడతాయని, ఆ తర్వాత ప్రైవేటు రిటైలర్లు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వాటికి సెస్, రౌండ్ ఆఫ్ చార్జీలు అదనంగా ఉంటే మందుబాబుల జేబుకు చిల్లు పడటం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
This post was last modified on October 16, 2024 1:59 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…