ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ 16 నుంచి అమల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 వ తారీకున కొత్త వైన్ షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో రేపటి నుంచి ఏపీలో ప్రైవేట్ రిటైల్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండబోతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం మద్యం షాపులకు చివరి రోజు కానుంది. ఈ నేపథ్యంలోనే మద్యం షాపుల టెండర్ల ద్వారా దాదాపు 1800 కోట్ల ఆదాయాన్ని అర్జించిన ప్రభుత్వం మరో 100 కోట్ల ఆదాయం సమకూర్చుకునే ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే అమల్లోకి వచ్చేలాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మద్యం అమ్మకాలపై విధించే పన్నులు కాకుండా అదనంగా ఈ రెండు శాతం సెస్ విధిస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆల్రెడీ రౌండ్ ఆఫ్ చార్జీలు విధించడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఒక మద్యం బాటిల్ ధర 166 రూపాయలు ఉంటే రౌండాఫ్ ఛార్జీల కింద 170 రూపాయలు తీసుకోనున్నారు. దీనికి తోడు అదనంగా ఇప్పుడు 2 శాతం విధించడంతో ఈ భారం అంతా మద్యం ప్రియులపై పడనుందని విమర్శలు వస్తున్నాయి.
అయితే, అలా సెస్ విధించడం ద్వారా ఆబ్కారీ శాఖకు రూ.100 కోట్ల ఆదాయం సమకూరనుందని, ఆ డబ్బును డ్రగ్ రీహ్యాబిలిటేషన్ సెస్ కింద ప్రభుత్వం వసూలు చేయనుంది.
మరోవైపు, మద్యం సిండికేట్లు ఏర్పడతాయని, ఆ తర్వాత ప్రైవేటు రిటైలర్లు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వాటికి సెస్, రౌండ్ ఆఫ్ చార్జీలు అదనంగా ఉంటే మందుబాబుల జేబుకు చిల్లు పడటం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
This post was last modified on October 16, 2024 1:59 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…