Political News

ఏపీలో మద్యం పై 2 శాతం డ్రగ్ రీహ్యాబిలిటేషన్ సెస్

ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ 16 నుంచి అమల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 వ తారీకున కొత్త వైన్ షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో రేపటి నుంచి ఏపీలో ప్రైవేట్ రిటైల్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండబోతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం మద్యం షాపులకు చివరి రోజు కానుంది. ఈ నేపథ్యంలోనే మద్యం షాపుల టెండర్ల ద్వారా దాదాపు 1800 కోట్ల ఆదాయాన్ని అర్జించిన ప్రభుత్వం మరో 100 కోట్ల ఆదాయం సమకూర్చుకునే ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే అమల్లోకి వచ్చేలాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మద్యం అమ్మకాలపై విధించే పన్నులు కాకుండా అదనంగా ఈ రెండు శాతం సెస్ విధిస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆల్రెడీ రౌండ్ ఆఫ్ చార్జీలు విధించడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఒక మద్యం బాటిల్ ధర 166 రూపాయలు ఉంటే రౌండాఫ్ ఛార్జీల కింద 170 రూపాయలు తీసుకోనున్నారు. దీనికి తోడు అదనంగా ఇప్పుడు 2 శాతం విధించడంతో ఈ భారం అంతా మద్యం ప్రియులపై పడనుందని విమర్శలు వస్తున్నాయి.

అయితే, అలా సెస్ విధించడం ద్వారా ఆబ్కారీ శాఖకు రూ.100 కోట్ల ఆదాయం సమకూరనుందని, ఆ డబ్బును డ్రగ్ రీహ్యాబిలిటేషన్ సెస్ కింద ప్రభుత్వం వసూలు చేయనుంది.

మరోవైపు, మద్యం సిండికేట్లు ఏర్పడతాయని, ఆ తర్వాత ప్రైవేటు రిటైలర్లు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వాటికి సెస్, రౌండ్ ఆఫ్ చార్జీలు అదనంగా ఉంటే మందుబాబుల జేబుకు చిల్లు పడటం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

This post was last modified on October 16, 2024 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

21 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago