వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఏపీ ప్రభుత్వం సజ్జలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం కేసు పూర్వాపరాలను మాత్రమే పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యం లో తాజాగా సజ్జల విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు. అయితే.. ఆయన విదేశాలకు పారిపోతున్నారని భావించిన ఇమ్మిగ్రేషన్ వర్గాలు ఢిల్లీలో ఆయనను అడ్డుకున్నాయి. దీనికికారణం.. సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు ఉండడమే.
ఏంటీ కేసు..
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన నటి.. కాదంబరి జెత్వానీని అక్రమ కేసులో ఇరికించారన్న అభియోగం. వైసీపీకి చెందిన కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అప్పటి ఐపీఎస్లు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలు.. ప్రత్యేకంగా ముంబై వెళ్లి ఆమెతోపాటు ఆమె కుంటుంబాన్ని కూడా అక్రమంగా అరెస్టు చేసి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నానికితీసుకువచ్చి.. నిర్బంధించారని జత్వానీ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తనను మానసికంగా.. శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారని ఆమె పేర్కొన్నారు.
దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ద్వారా కూపీ లాగింది. జెత్వానీ వేధింపులు.. ఆమెపై కేసు వంటివి అన్నీ కూడా.. నాటి సర్కారు సలహాదారు సజ్జల కనుసన్నల్లోనే జరిగినట్టు అధికారులు గుర్తించారు. అయితే.. ఆయన అరెస్టు విషయంపై ఇంకా ఎలాంటి నిర్నయం తీసుకోలేదు. కానీ, ఇంతలోనే సజ్జల హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందే ప్రయత్నంలో ఉన్నారు. కానీ, విచారణ వాయిదా పడింది.
అయితే.. ఏక్షణమైనా సజ్జలను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. కానీ, ఆయన విదేశాలకు వెళ్లిపోవడం లేదు. విదేశాల నుంచి వస్తున్నారు. ఈ విషయం తెలియని ఇమ్మిగ్రేషన్ అధికారులు కొద్దిసేపు హడావుడి చేశారు. అనంతరం.. ఏపీకి వెళ్తున్నానని చెప్పడంతో వదిలేశారు.
డౌట్ ఏంటంటే..
సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఈ నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఇస్తే.. ఆయన విదేశాలకు ఎందుకు వెళ్లినట్టు? ఒక వేళ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చాక వెళ్లారా? లేక వెళ్లిన తర్వాత.. ఇచ్చారా? ఇదే జరిగితే.. సజ్జల అంత ధైర్యంగా ఎలా వచ్చారు? దీని వెనుక ఏంజరుగుతోంది? సీఎం చంద్రబాబు సజ్జల విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదా? అనేది అనేక సందేహాలకు దారితీస్తోంది.
This post was last modified on October 16, 2024 1:58 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…