వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఏపీ ప్రభుత్వం సజ్జలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం కేసు పూర్వాపరాలను మాత్రమే పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యం లో తాజాగా సజ్జల విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు. అయితే.. ఆయన విదేశాలకు పారిపోతున్నారని భావించిన ఇమ్మిగ్రేషన్ వర్గాలు ఢిల్లీలో ఆయనను అడ్డుకున్నాయి. దీనికికారణం.. సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు ఉండడమే.
ఏంటీ కేసు..
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన నటి.. కాదంబరి జెత్వానీని అక్రమ కేసులో ఇరికించారన్న అభియోగం. వైసీపీకి చెందిన కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అప్పటి ఐపీఎస్లు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలు.. ప్రత్యేకంగా ముంబై వెళ్లి ఆమెతోపాటు ఆమె కుంటుంబాన్ని కూడా అక్రమంగా అరెస్టు చేసి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నానికితీసుకువచ్చి.. నిర్బంధించారని జత్వానీ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తనను మానసికంగా.. శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారని ఆమె పేర్కొన్నారు.
దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ద్వారా కూపీ లాగింది. జెత్వానీ వేధింపులు.. ఆమెపై కేసు వంటివి అన్నీ కూడా.. నాటి సర్కారు సలహాదారు సజ్జల కనుసన్నల్లోనే జరిగినట్టు అధికారులు గుర్తించారు. అయితే.. ఆయన అరెస్టు విషయంపై ఇంకా ఎలాంటి నిర్నయం తీసుకోలేదు. కానీ, ఇంతలోనే సజ్జల హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందే ప్రయత్నంలో ఉన్నారు. కానీ, విచారణ వాయిదా పడింది.
అయితే.. ఏక్షణమైనా సజ్జలను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. కానీ, ఆయన విదేశాలకు వెళ్లిపోవడం లేదు. విదేశాల నుంచి వస్తున్నారు. ఈ విషయం తెలియని ఇమ్మిగ్రేషన్ అధికారులు కొద్దిసేపు హడావుడి చేశారు. అనంతరం.. ఏపీకి వెళ్తున్నానని చెప్పడంతో వదిలేశారు.
డౌట్ ఏంటంటే..
సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఈ నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఇస్తే.. ఆయన విదేశాలకు ఎందుకు వెళ్లినట్టు? ఒక వేళ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చాక వెళ్లారా? లేక వెళ్లిన తర్వాత.. ఇచ్చారా? ఇదే జరిగితే.. సజ్జల అంత ధైర్యంగా ఎలా వచ్చారు? దీని వెనుక ఏంజరుగుతోంది? సీఎం చంద్రబాబు సజ్జల విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదా? అనేది అనేక సందేహాలకు దారితీస్తోంది.
This post was last modified on October 16, 2024 1:58 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…