జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్.సీ) పార్టీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి మెజారి టీ స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.
90 అసెంబ్లీ స్థానాలకు గాను(మరో 5 నామినేటెడ్ స్థానా లు ఉన్నాయి) ఎన్.సీ 42 స్థానాల్లో విజయం దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. ఈ రెండు కలిసి.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.
అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కూటమి నుంచి తాము తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. అంటే.. ఎన్.సీ కి కాంగ్రెస్ పార్టీ దూరమైంది. దీంతో ఎన్సీ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో ఒక్కసారిగా జమ్ము, కశ్మీర్ రాజకీయాలు సంచలనంగా మారాయి.
అయితే.. కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి తప్పుకొని.. బయట నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంటే.. ఒకరకంగా ఎన్సీని ఇరకాటంలో పడేసినట్టు అయింది.
బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్సీ అధినేత .. ఒమర్ అబ్దుల్లాకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్తుల్లో మాత్రం ప్రభుత్వం సంకటపరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపి స్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి.
ప్రధానంగా తాము కొలువు దీరగానే.. జమ్ము కశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ను పునరుద్ధరించే అంశంపై తీర్మానం చేస్తామని ఒమర్ అబ్దుల్లా ఎన్నికల సమయంలో ప్రకటించారు.
ఇప్పుడు దానిని చేసి తీరుతానని కూడా ఆయన చెబుతున్నారు. దీంతో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తోంది. ఇక, ఒమర్ తన మంత్రి వర్గంలో కాంగ్రెస్కు చోటు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్టు గత రెండు రోజులుగా వార్తలు వచ్చాయి.
ఎందుకంటే..కాంగ్రెస్ మిత్రపక్షమైనప్పటికీ.. కేవలం 6 స్థానాల్లోనే విజయం దక్కించుకోవడంతో మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం కనిపించడంలేదు. ప్రధానంగా ఈ రెండు కారణాలతోనే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on October 16, 2024 11:45 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…