జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్.సీ) పార్టీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి మెజారి టీ స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.
90 అసెంబ్లీ స్థానాలకు గాను(మరో 5 నామినేటెడ్ స్థానా లు ఉన్నాయి) ఎన్.సీ 42 స్థానాల్లో విజయం దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. ఈ రెండు కలిసి.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.
అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కూటమి నుంచి తాము తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. అంటే.. ఎన్.సీ కి కాంగ్రెస్ పార్టీ దూరమైంది. దీంతో ఎన్సీ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో ఒక్కసారిగా జమ్ము, కశ్మీర్ రాజకీయాలు సంచలనంగా మారాయి.
అయితే.. కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి తప్పుకొని.. బయట నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంటే.. ఒకరకంగా ఎన్సీని ఇరకాటంలో పడేసినట్టు అయింది.
బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్సీ అధినేత .. ఒమర్ అబ్దుల్లాకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్తుల్లో మాత్రం ప్రభుత్వం సంకటపరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపి స్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి.
ప్రధానంగా తాము కొలువు దీరగానే.. జమ్ము కశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ను పునరుద్ధరించే అంశంపై తీర్మానం చేస్తామని ఒమర్ అబ్దుల్లా ఎన్నికల సమయంలో ప్రకటించారు.
ఇప్పుడు దానిని చేసి తీరుతానని కూడా ఆయన చెబుతున్నారు. దీంతో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తోంది. ఇక, ఒమర్ తన మంత్రి వర్గంలో కాంగ్రెస్కు చోటు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్టు గత రెండు రోజులుగా వార్తలు వచ్చాయి.
ఎందుకంటే..కాంగ్రెస్ మిత్రపక్షమైనప్పటికీ.. కేవలం 6 స్థానాల్లోనే విజయం దక్కించుకోవడంతో మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం కనిపించడంలేదు. ప్రధానంగా ఈ రెండు కారణాలతోనే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…