గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారాలకు నిర్మాత దిల్ రాజు చెక్ పెట్టేశారు. ముందు నుంచి చెబుతూ వచ్చినట్టు గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో క్రిస్మస్ పండగకు కాకుండా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మూడేళ్ళ నుంచి నిర్మాణంలో ఉంటూ విపరీతమైన అంచనాలు మోస్తున్న ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీ జనవరిలో రావడమే సబబని భావించి విశ్వంభర నిర్మాతలైన యువి బృందంతో పాటు చిరంజీవిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అనౌన్స్ మెంట్ ని వీడియో రూపంలో చేశారు.
దీంతో తాజా సంక్రాంతి సమీకరణాలు మారిపోయాయి. దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ఎంటర్ టైనర్ కూడా రెండు మూడు రోజుల గ్యాప్ లో గేమ్ ఛేంజర్ తో పాటుగా విడుదల కానుంది. బాలయ్య 109, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సందీప్ కిషన్ మజాకాలు బరిలో ఉండబోతున్నాయి. ఏవి ఖరారుగా ఉంటాయి, ఏవి తప్పుకుంటాయనేది ఇంకా వేచి చూడాలి. డిసెంబర్ మూడో వారం మూడు హాలీవుడ్ రిలీజులు ఉండటం వల్ల ఓవర్సీస్ లో ఎదురయ్యే థియేటర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గేమ్ ఛేంజర్ ని వాయిదా వేయడం తెలివైన ఆలోచన.
ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టిన దిల్ రాజు టీమ్ రెండు పాటలు విడుదల చేసింది . వాటిలో రా మచ్చకు మంచి రీచ్ వచ్చింది. ఈ నెలాఖరున దీపావళికి మూడో మెలోడీ సాంగ్ వదలబోతున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి టీజర్, ట్రయిలర్ ఇప్పుడప్పుడే ఆశించకపోవడం మంచిది. వచ్చే నెల నుంచి పుష్ప 2 ది రూల్ పబ్లిసిటీ సౌండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇతర ప్యాన్ ఇండియా సినిమాలు ప్రమోషన్ పరంగా ఎక్కువ హడావిడి చేయకపోవచ్చు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన గేమ్ ఛేంజర్ లో చరణ్ డ్యూయల్ రోల్, తమన్ సంగీతం, ఎస్జె సూర్య విలనీ మీద ఎక్కువ అంచనాలున్నాయి.
This post was last modified on October 12, 2024 11:30 am
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…