పీపుల్స్ మీడియా.. ప్రస్తుతం తెలుగులో హ్యాపెనింగ్ బేనర్. క్వాంటిటీ పరంగా చూస్తే మరే ప్రొడక్షన్ హౌస్ అందుకోలేని స్థాయిలో సినిమాలు తీస్తోందీ సంస్థ. కానీ క్వాలిటీ మీదే ఈ మధ్య సందేహాలు రేకెత్తుతున్నాయి. కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్థ.. మొదట్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. వేరే సంస్థల భాగస్వామ్యంలో సినిమాలు చేసింది. ఈ క్రమంలో గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ-2 లాంటి మంచి విజయాలు అందుకుంది.
ఆ తర్వాత సొంతంగా పెద్ద స్థాయిలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. ఈ సంస్థ నుంచి ఒకే సమయంలో ఏకంగా పాతిక చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయంటే దాని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే. ఐతే సొంత ప్రొడక్షన్లో చేసిన సినిమాల్లో ‘ధమాకా’ ఈ సంస్థకు మంచి విజయాన్నందించింది.
కానీ ఆ తర్వాత ఆ సంస్థకు సరైన విజయమే లేదు. గోపీచంద్తో చేసిన ‘రామబాణం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తీసిన క్రేజీ మూవీ ‘బ్రో’ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒక్కో సినిమా బోల్తా కొడుతూ వచ్చింది. ఐతే మిస్టర్ బచ్చన్ తర్వాత తాము జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని.. వరుసగా తమ నుంచి క్వాలిటీ సినిమాలు రాబోతున్నాయని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
కానీ ఈ సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ రిలీజ్ ‘శ్వాగ్’ కూడా నిరాశ పరిచింది. ప్రయోగాత్మక కథతో హాసిత్ గోలి చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. ఏదో ఓ మోస్తరుగా ఆడింది కానీ.. అంతిమంగా ఫలితం అయితే ఆశాజనకంగా లేదు. ఒక్క ఏడాదిలో ఇప్పటికే నాలుగు ఫ్లాపులు పడ్డ పీపుల్స్ మీడియాకు.. ఇప్పుడు ‘విశ్వం’ మీదే ఆశలు ఉన్నాయి. ఇది దసరా కానుకగా రిలీజవుతోంది. ఈ చిత్రమైనా బాగా ఆడి ఆ సంస్థను మళ్లీ విజయాల బాట పటిస్తుందేమో చూడాలి.
This post was last modified on October 11, 2024 12:03 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…