Movie News

దెబ్బ మీద దెబ్బ.. ఇదైనా ఆడాలబ్బా

పీపుల్స్ మీడియా.. ప్రస్తుతం తెలుగులో హ్యాపెనింగ్ బేనర్. క్వాంటిటీ పరంగా చూస్తే మరే ప్రొడక్షన్ హౌస్ అందుకోలేని స్థాయిలో సినిమాలు తీస్తోందీ సంస్థ. కానీ క్వాలిటీ మీదే ఈ మధ్య సందేహాలు రేకెత్తుతున్నాయి. కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్థ.. మొదట్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. వేరే సంస్థల భాగస్వామ్యంలో సినిమాలు చేసింది. ఈ క్రమంలో గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ-2 లాంటి మంచి విజయాలు అందుకుంది.

ఆ తర్వాత సొంతంగా పెద్ద స్థాయిలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. ఈ సంస్థ నుంచి ఒకే సమయంలో ఏకంగా పాతిక చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయంటే దాని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే. ఐతే సొంత ప్రొడక్షన్లో చేసిన సినిమాల్లో ‘ధమాకా’ ఈ సంస్థకు మంచి విజయాన్నందించింది.

కానీ ఆ తర్వాత ఆ సంస్థకు సరైన విజయమే లేదు. గోపీచంద్‌తో చేసిన ‘రామబాణం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీసిన క్రేజీ మూవీ ‘బ్రో’ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒక్కో సినిమా బోల్తా కొడుతూ వచ్చింది. ఐతే మిస్టర్ బచ్చన్ తర్వాత తాము జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని.. వరుసగా తమ నుంచి క్వాలిటీ సినిమాలు రాబోతున్నాయని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.

కానీ ఈ సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ రిలీజ్ ‘శ్వాగ్’ కూడా నిరాశ పరిచింది. ప్రయోగాత్మక కథతో హాసిత్ గోలి చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. ఏదో ఓ మోస్తరుగా ఆడింది కానీ.. అంతిమంగా ఫలితం అయితే ఆశాజనకంగా లేదు. ఒక్క ఏడాదిలో ఇప్పటికే నాలుగు ఫ్లాపులు పడ్డ పీపుల్స్ మీడియాకు.. ఇప్పుడు ‘విశ్వం’ మీదే ఆశలు ఉన్నాయి. ఇది దసరా కానుకగా రిలీజవుతోంది. ఈ చిత్రమైనా బాగా ఆడి ఆ సంస్థను మళ్లీ విజయాల బాట పటిస్తుందేమో చూడాలి.

This post was last modified on October 11, 2024 12:03 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సునీతా 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

25 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

1 hour ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

3 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago