పీపుల్స్ మీడియా.. ప్రస్తుతం తెలుగులో హ్యాపెనింగ్ బేనర్. క్వాంటిటీ పరంగా చూస్తే మరే ప్రొడక్షన్ హౌస్ అందుకోలేని స్థాయిలో సినిమాలు తీస్తోందీ సంస్థ. కానీ క్వాలిటీ మీదే ఈ మధ్య సందేహాలు రేకెత్తుతున్నాయి. కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్థ.. మొదట్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. వేరే సంస్థల భాగస్వామ్యంలో సినిమాలు చేసింది. ఈ క్రమంలో గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ-2 లాంటి మంచి విజయాలు అందుకుంది.
ఆ తర్వాత సొంతంగా పెద్ద స్థాయిలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. ఈ సంస్థ నుంచి ఒకే సమయంలో ఏకంగా పాతిక చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయంటే దాని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే. ఐతే సొంత ప్రొడక్షన్లో చేసిన సినిమాల్లో ‘ధమాకా’ ఈ సంస్థకు మంచి విజయాన్నందించింది.
కానీ ఆ తర్వాత ఆ సంస్థకు సరైన విజయమే లేదు. గోపీచంద్తో చేసిన ‘రామబాణం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తీసిన క్రేజీ మూవీ ‘బ్రో’ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒక్కో సినిమా బోల్తా కొడుతూ వచ్చింది. ఐతే మిస్టర్ బచ్చన్ తర్వాత తాము జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని.. వరుసగా తమ నుంచి క్వాలిటీ సినిమాలు రాబోతున్నాయని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
కానీ ఈ సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ రిలీజ్ ‘శ్వాగ్’ కూడా నిరాశ పరిచింది. ప్రయోగాత్మక కథతో హాసిత్ గోలి చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. ఏదో ఓ మోస్తరుగా ఆడింది కానీ.. అంతిమంగా ఫలితం అయితే ఆశాజనకంగా లేదు. ఒక్క ఏడాదిలో ఇప్పటికే నాలుగు ఫ్లాపులు పడ్డ పీపుల్స్ మీడియాకు.. ఇప్పుడు ‘విశ్వం’ మీదే ఆశలు ఉన్నాయి. ఇది దసరా కానుకగా రిలీజవుతోంది. ఈ చిత్రమైనా బాగా ఆడి ఆ సంస్థను మళ్లీ విజయాల బాట పటిస్తుందేమో చూడాలి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…